Warangalvoice

Mulugu

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
Mulugu, Telangana

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వరంగల్ వాయిస్, ములుగు:  మార్చి 6వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, హౌసింగ్, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిద...
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
Cultural, Mulugu

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ నాలుగు పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్న అధికారులు వరంగల్ వాయిస్, ములుగు/హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి తీరం గల జిల్లాల కలెక్టర్లు, అధికారులతో కలిసి పుష్కర ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయి ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. నది తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఏర్పాట...
మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy
Cultural, Mulugu, Warangal_TriCites

మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy

నేనేమి మనులు, మాణిక్యాలు అడగడం లేదు మేడారానికి జాతీయ హోదా కల్పించాలి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందుకు కృషి చేయాలి జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదాం.. వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ తో నిర్మిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా కల్పించి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అందుకు రాష్ట్రం నుంచి ప్రాముఖ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,...
Seetakka-మహిళా సాధికారతే లక్ష్యం
Mulugu, Telangana

Seetakka-మహిళా సాధికారతే లక్ష్యం

పలు వ్యాపారుల్లో వారి భాగస్వామ్యం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సెర్ఫ్ అదనపు సీఈఓ పి.కట్యాయని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ కళలను నెరవేర్చడానికి కాంగ్రెస్ సర్కార్ పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళల జీవితాల్లో వ...
ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు
District News, Mulugu

ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు

అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణం పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలను ప్రభుత్వమే సమకూర్చుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వ...
చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుదాం
Mulugu, Top Stories

చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుదాం

డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య వరంగల్ వాయిస్, ములుగు : చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ములుగు మండలం రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జంగాలపల్లి, కొత్తూరు, సర్వాపూర్ సబ్ సెంటర్ లతో పాటు రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో దాదాపుగా 15 మంది పిల్లలకు టీకాలు ఇవ్వడం తనిఖీ చేశారు. దీంతో పాటు ప్రతి ఆశలకు, ఏఎన్ఎంలకు ముందుగా ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసి డెలివరీ అయ్యి నెలన్నర రోజులు వరకు తల్లి పిల్లలను చూసుకోవలసిన బాధ్యత మన ఆరోగ్య శాఖ సిబ్బందికి ఉందని తెలిపారు. అలాగే, మున్ముందు వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆశలకు, ఏఎన్ఎంలకు తగు సూచనలు చేయడం జరిగింది. మార్గమధ్యలో బావి తీస్తున్న కూలీలు కనపడగా అది ఒంటిగంట ...
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి
Mulugu

ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి

ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి వరంగల్ వాయిస్, ములుగు : ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై పీఓలు, ఏపీఓలకు, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలు పీవోలు , ఏపీవోలు, ఓపీఓల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల సంఘం విధివిధానాలపై అందరికీ అవగాహన ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లలో బ్యాలెట్ పేపర్ తో ఓటు వేస్త...
టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తక్షణమే అమలు
Mulugu

టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తక్షణమే అమలు

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వరంగల్ వాయిస్, ములుగు : టీఎస్ స్థానంలో టీజీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే 'టీఎస్' స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలుబడ్డాయన్నారు. జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడాలని కలెక్టర్ కోరారు.  ...
యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య
Cultural, District News, Mulugu

యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

వరంగల్ వాయిస్, ములుగు: జిల్లా యువత కళలలో రాణించాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబట్టి ,వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో రాణించాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇవి మొట్టమొదటిసారి యువజన ఉత్సవాలు అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి పి. వెంకటరమణ చారి, న్యాయ నిర్ణయితలుగా నరసింహ, తాడిచెర్ల రవి, సంధ్యా రాణి,...
‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్
Crime, District News, Mulugu

‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్

వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి, ఏ4 తడక రమేష్ లను ప్రవేశపెట్టారు. హత్య నేరం అభియోగంపై రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించి ఖమ్మం జైలుకు తరలించారు....