Cultural

Brahmanandam | ఖాన్తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. నిట్లో సందడి చేసిన బ్రహ్మానందం
Brahmanandam | ఖాన్తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాన్తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి…

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి. వరంగల్ వాయిస్, యాదాద్రి : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swamy temple)లో బుధవారం (19వ తేదీ) నుంచి 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు (Mahakumbhabhishekam Celebrations) జరగనున్నాయి. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం…

Peddagattu Jathara చౌడమ్మ తల్లికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు. వరంగల్ వాయిస్, సూర్యాపేట : పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనం ఎత్తుకుని ఆలయం వద్దకు చేరుకున్న కవితకు పూజారులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కవిత…

మేడారంకు ప్రత్యేక బస్సులు
9నుంచి 16వరకు 200 బస్సులు..400 ట్రిప్పులు వరంగల్ రీజియన్ రీజినల్ మేనేజర్ విజయ భాను వరంగల్ వాయిస్, వరంగల్ : మినీ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయ భాను ప్రకటించారు. ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎనిమిది రోజుల పాటు 200 బస్సులు..400 ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి…

త్యాగరాజ కీర్తనలను ఆలపించిన కలెక్టర్
ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన పి.ప్రావీణ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి సంగీత, నృత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన…

Mukkoti Ekadashi | పవిత్ర ఉత్తర ద్వార దర్శనం ’ముక్కోటికి‘
వరంగల్ వాయిస్, కల్చరల్ : ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆరోజు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు. అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని,…

Konda Sureka | స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనిత.. సావిత్రీబాయి ఫూలే
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగృహంలో పుష్పాంజలి ఘటించిన మంత్రి వరంగల్ వాయిస్, వరంగల్ : మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళలపై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళల విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం…

ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు
హాజరైన ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య ,ఎమ్మెల్యే నాయిని… వరంగల్ వాయిస్ , హనుమకొండ : హనుమకొండ గోకుల్ నగర్ లో బంక సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.. మొదటి సారిగా వరంగల్ లో నిర్వహించడం ప్రత్యేకంగా ఉంది. : నాయిని రాజేందర్…

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అత్యంత ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల వేడుకల్లో పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.మహిళలు బతకమ్మ పాటలకు చేసిన నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. ఈ…