Warangalvoice

District News

రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….
District News, Telangana, Top Stories

రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….

జూన్ 28న జయంతి      రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది.  పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ర్టంలో ఎక్కడ చదవకుండా ప్రభుత్వం నిర్భంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ర్టలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీవీ హైదరాబాద్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటు ప్రత్యేక మ...
ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..
District News, Telangana, Today_banner

ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా మీరు కూడా తరచుగా/అరుదుగా రైలు ప్రయాణం చేస్తుంటే, ఇప్పుడు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పటివరకు చాలాసార్లు రైలు ప్రయాణం చేసినా, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనిని టిక్ చేయండి. దీనివల...
ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం
Crime, District News, Latest News

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం

మూడు వందలకు పైగా మృతులు వేయికి పైగా క్షతగాత్రులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్‌ పట్నాయక్‌ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్‌ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. ఈ ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్‌ ఎక్స...
ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్
Crime, District News, Warangal

ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ దొరకలేదన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీటును దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే ప్రతీ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టును నిన్ననే బెయిల్ మంజూరు చేసింది....
బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం
Crime, District News, Warangal

బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం

బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు వరంగల్ వాయిస్, వరంగల్‌ : వరంగల్‌ బస్టాండ్‌ లో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్‌ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు. వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్‌ అనే విద్యార్థి వరంగల్‌ బస్‌ స్టాండ్‌ కు వెళ్లాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు.. అనిల్‌ ను ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన ప్రయాణికులు, విద్యార్థులు నాలుగు బస్సుల అద్దాలను కోపంతో ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనిల్‌ మ...
భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్
Cultural, District News, Telangana

భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్

అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న వరంగల్ వాయిస్, కల్చరల్ :  అంబేద్కర్ అంటే అందరికి అర్థమయ్యేది ఆయన అంటరాని కులంలో పుట్టాడని, కాదంటే దళిత నాయకుడు అని అయితే ఈ దేశానికి రాజ్యాంగం రాసినాయన రాజ్యాంగ నిర్మాతగా పరిచయం అవుతాడు. మరి కొంత మందికి సామాజిక విప్లవకారుడుగా కనిపిస్తాడు. ఇంకొంత మందికి సాంఘీక సంస్కర్తగా కనిపిస్తాడు. వేరే వారికి ఒక న్యాయవాదిగా న్యాయశాఖ మంత్రిగా కనిపిస్తే మరికొంత మందికి మంచి రచయితగా కనిపిస్తాడు. భారతదేశంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కావలసిన పరిశోధనలు చేశాడు. పరిశోధనాసార పుస్తకాలుగా రాశాడు. ఆయన ఎంచుకున్న పరిశోధనలు కూడా చాలా క్లిష్టమైనవి. అంటరానితనం అంటే ఏమిటి? వారు అంటరాని వారు ఎలా అయ్యారు? అనేవి. శూద్రులెవరు? అనేవి? శుద్రులెవరు? కుల నిర్మూలన అంశాల మీద పుస్తకాలు రాశాడాయన. భారతదేశంలోని రచయితలు సామాజిక శాస్త్రవేత్తలు ‘కులం’ గురించి పరిశోధనలు చేయలేదు. పుస్తకాలు...
సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
Crime, District News, Hanamkonda, Warangal

సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా

-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్ వరంగల్ వాయిస్, క్రైం:  నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. నాపై ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారు. అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు నాపై ఉక్రోషంతో ఆరోపణలు చేసినట్లు వుందని. కొన్ని ప్రాంతాల్...
దేశభక్తికి నిలువెత్తురూపం
Cultural, District News, Hanamkonda

దేశభక్తికి నిలువెత్తురూపం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు హెగ్డేవార్ జయంతి ఏప్రిల్ 1న వరంగల్ వాయిస్, కల్చరల్ : ఆయన ఆదికేశవుడు, ఆయన ఆత్మ బలరాముడు ఆయన అవిశ్రాంత వార్ కు ప్రతిరూపం అన్ని అంకాలలో తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ మహనీయ నాయకుడు డాక్టర్ బలిరాం హెగ్డే వార్ 134 సంవత్సరాల క్రితం జన్మించి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ పతాకంగా రెపరెపలాడుతున్న వాడు అందరి చేత వందనాలు అందుకుంటున్న వాడు పెద్దవారు 1889 ఏప్రిల్ ఒకటో తేదీన ఉగాది పర్వదినాన నాగపూర్ లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్డేవారు జన్మించారు. డాక్టర్ జీ పుర్వీకులు నిజామాబాద్ జిల్లా వాసులు. కేశవరావ్ ఆజన్మ దేశభక్తులు. మనల్ని బానిసరలుగా చేసి పాలిస్తున్న విదేశీయులను ఈ దేశం నుంచి ఎలా పంపించాలా అని ఆయన బాల్యం నుంచే బలంగా ఆలోచించేవారు హెగ్డే వార్ "నీట్ సీట్" హైస్కూల్లో చదివే రోజుల్లో దేశంలో వందేమాతరం ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో పర్యవేక్షణ కోసం వచ్చిన అధికారికి "న...
అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి
Bhupalapally, Crime, District News

అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి

గొత్తికోయ గూడేన్ని సందర్శించిన డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి వరంగల్‌ వాయిస్, మహాముత్తారం : సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే చట్ట వ్యతిరేక శక్తులకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గొత్తికోయ గూడేన్ని కాటారం సీఐ రంజిత్‌రావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడేంలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక సిద్ధాంతాలతో అడవుల్లో ఉండే మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గూడెంలోని పిల్లలను తప్పకుండా బడికి పంపించి విద్యానందించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల తమ దృష్టికి తీసుకురావాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గూడెం వాసుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై సుధాకర్, సివిల్, సీఆర్‌పీఎఫ్‌ ...
బిఆర్‌ఎస్‌ బెదరింపులకు భయపడేది లేదు
District News, Hanamkonda, Warangal

బిఆర్‌ఎస్‌ బెదరింపులకు భయపడేది లేదు

దాడులు చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రశ్నిస్తాం వైఎస్‌ షర్మిల విమర్శలు వరంగల్ వాయిస్,వరంగల్‌: ప్రజల పక్షాన పోరాడటమే తప్పా....? అని వైఎస్‌ఆర్టీపీ చీప్‌ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్‌ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. విూ దాడులకు రెట్టింపు స్థాయిలో విూ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల...విూలాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్నా బీఆర్‌ఎస్‌ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. గతంలో నర్సంపేటలో తమ బస్సును తగలబెట్టి, తమపై దాడి చేశారని ఆరోపించారు. నిన్న వర్ధన్నపేటలో ప్రజా ప్రస్థానం యాత్రపై దాడి చేశారని, ఏం జరిగినా తన పాదయాత్ర తిరిగి మొదలుపెట్టానని చెప్పారు. ప్లెక్సీలు చింపి, కవరేజ్‌ చేస్తున్న విూడియాపై దాడికి యత్నించారన్నారు. ప్రజల తరపున ప్ర...