మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ తూర్పులో 'ఈద్ కా తోఫా' పంపిణీ
పేద ముస్లింలకు రంజాన్ కానుకలు
వరంగల్ వాయిస్, వరంగల్ : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన “ఈద్ కా తోఫా” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున దుస్తుల కిట్లను పంపిణీ చేశారు.
నియోజకవర్గానికి 3500 కిట్లు.. సీఎంకు కృతజ్ఞతలు:
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, దయ మరియు త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం పెంపొందేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చా...
