ఆదానీ వ్యవహారంపై జెపిసికి డిమాండ్
పార్లమెంటులో విపక్ష ఎంపిల ఆందోళన
నల్ల చొక్కలాతో ఎంపిల నిరసన
ఉభయసభలు వాయిదా
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంలో జెపిసి వేయాలని, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించి నందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ ఎంపీలు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ.. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ ఉభయసభల్లోనూ విపక్ష ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. లోక్సభలో కొందరు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చైర్ను ముట్టడిరచారు. స్పీకర్ చైర్పై పేపర్లు చించి విసిరేశారు. ప్లకార్డులను కూడా విసిరేశారు. అయితే ఆందోళనల మధ్యలోనే స్పీకర్ బిర్లా సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు. తరవాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద...
