13SepNo Comments
8SepNo Comments
ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా జన్మదిన వేడుకలు
వరంగల్ వాయిస్,దామెరదామెర మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో సోమవారము బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముద్దసాని సహోదరు రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు యూరియాను అందించలేని స్థితిలో ఉందని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి ఎంపిటి సి స్థానిక గ్రామాల సర్పంచులను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు.ఈ నేపథ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దామెర మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం జూనియర్ కళాశాల ను మంజూరు చేయాలని ఆయన అన్నారు. మాజీ వైస్ ఎంపీపీ జాకీర్ అలీ మాట్లాడుతూ పరకాల అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంల...
8SepNo Comments
ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు
వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లా మండల కేంద్రంలోదమ్మన్నపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకుడు దుబాసి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బిక్షపతి, అనిల్, రఘుపతి రెడ్డి, రాజు, ప్రమోదు, రాజు, నాగరాజు, బాలయ్య, శ్రావణ్, తిరుపతి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు....
5SepNo Comments
గంగమ్మ ఒడిలో గణపయ్య
వరంగల్ వాయిస్, శాయంపేట :మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో చెన్నకేశవర స్వామి గుడిలో గణపత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులందరూ వినాయకుని రథయాత్రను డప్పు చప్పుళ్ల తో ఊరేగింపు కార్యక్రమంలో ఆడపడుచులందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి స్వామి వారి రథం ముందు బిందెలో నీళ్లు తెచ్చి రథానికి ఆరగింపి చేసి కొబ్బరికాయలు కొట్టి మంగళ హారతులు సమర్పిం చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పసుపులేటిఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, రాజు,కృష్ణ,రాజేందర్ నాగరాజు, కర్ణాకర్,రవీందర్, నాగరాజు,నరేందర్,రాజు, కృష్ణ, చిలకయ్య, సుమన్, కాజా పాషా, శ్రీను,చంద్రమౌళి,సురేందర్, కృష్ణ, బిక్షపతి మల్లయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు...
4SepNo Comments
పొలం బాట పట్టిన విద్యుత్ అధికారులు
వరంగల్ వాయిస్, దామెర:రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని డివిజనల్ ఇంజనీర్ సౌమ్య నాయక్ అన్నారు. గురువారము మండలంలోని దామెర, తక్కలపాడు గ్రామాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పోలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్య నాయక్ మాట్లాడుతూ...వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లకు ఎర్తింగ్ చేసుకోవాలని, దుస్తులను ఆరవేయడానికి ఇనుప తీగలను వాడరాదని అన్నారు. వర్షాకాలంలో గాలికి చెట్లు విరిగి కరెంటు తీగలపై పడినప్పుడు వాటిని ముట్టుకోకుండా విద్యుత్ సిబ్బందికి తెలుపాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ కి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఏడిఈ దేవేందర్, స్థానిక ఏ ఈ గుర్రం రమేష్, ఎల్ఎంలు మనోహర్ గిరిబాబు,ఏఎల్ఎంలు కృష్ణ, రమేష్, రాజశేఖర్,శంకర్,ప్రభాకర్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు....
4SepNo Comments
ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ ప్రశాంతి
వరంగల్ వాయిస్, హనుమకొండ :పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ నందు రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎం ప్రశాంతి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి లో ఉత్తమ అధ్యాపకురాలిగా కాకతీయ యూనివర్సిటీ పరిధి నుండి మొదటి స్థానంలో ఎంపిక అయ్యారు. వీరి విద్యాభ్యాసం మొత్తము కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగినది. మీరు 2005లో పీహెచ్డీ పూర్తి చేసుకున్నారు. డాక్టర్ ఎం ప్రశాంతి 2004 పీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్ గా నియమితులయ్యారు. 2010 లో డిగ్రీ అధ్యాపకురాలిగా ప్రమోషన్ పొందారు. వీరు మొదట ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల నందు పనిచేశారు. ఆ తరువాత కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాల నందు పనిచేశారు ప్రస్తుతము పింగిలి మహిళా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పని చేసినప్పుడు వీరు రసాయన శాస్త్ర విభాగపు అధిపతిగా వ్యవహరించారు. ప్రస్తుతము పింగిలి మహిళా డిగ్రీ కళ...
4SepNo Comments
ఒగ్లాపూర్ లో అన్నదానం
వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామం లోని కాపు వాడలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద ఆకుల శోభా కుమారస్వామి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామెర ఎస్సై కొంక అశోక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎస్సై అశోక్ ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కనుకుంట్ల జీవన్ రావు, ఆకుల రవీందర్, మాజీ ఉపసర్పంచ్ ఆకుల కుమారస్వామి,ఆకుల కోటి, కనుకుంట్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు....
3SepNo Comments
దుష్ప్రచారం తగదు
ఆర్టికల్ 342 (2) అనుసరించే లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్స్.
చరిత్రపై అవగాహన లేకనే లంబాడీల పై వలస వాదులుగా చెడు ప్రచారం.
అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలి.
లంబాడీలది తెలంగాణలో వెయ్యి ఏళ్ల చరిత్ర
లంబాడీలపై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్య
తెలంగాణ గిరిజన చరిత్ర (లంబాడీలు)లో ఒక గొప్ప అధ్యాయం
(వరంగల్ వాయిస్, వరంగల్): భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరివిన రిజర్వేషన్స్ నేపథ్యంలో కొన్ని గిరిజన తెగలను గుర్తించడం జరిగింది. ఒక తెగను గిరిజనులుగా గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒక తెగ ను ఎస్టీగా గుర్తించాలంటే ఆతెగకు ప్రత్యేక సంస్కృతి, భాష, ఆచారాలు, అడవులు, కొండ కోనల్లో తిరుగుతూ అక్కడే వృత్తి చేసుకునే వారై ఉండాలి. 1956 కంటే ముందు తెలంగాణలో లంబాడాలు బీసీ-ఏ జాబితాలో ఉన్నారు...
7AugNo Comments
ఘనంగా శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం
వరంగల్ వాయిస్, హనుమకొండ :నగరంలోని కుమార్ పల్లి లో శ్రీ వారహి హోటల్ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి మాట్లాడుతూ వారహి హోటల్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ యొక్క హోటల్ లో ఏసీ మల్టీ క్యూసిన్,ఫ్యామిలీ రెస్టారెంట్, బ్యాంకెట్ హల్స్, బోర్డు రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే కేటరింగ్ సేవలు కుడా అందజేస్తున్నారని అన్నారు.ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హోటల్ సిబ్బంది, బీజేపీ నాయకుడు బైరి శ్రవణ్, ఎర్రోజు సారిక,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు....
5MayNo Comments
Ponnam Prabhakar | సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.. ఇలాంటి దశలో సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని, వినడానికి సీఎం, తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యలపై, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు, రేపు ఎప్ప...