Warangalvoice

Top Stories

గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం
Top Stories

గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం

సర్పంచ్ కేతీపెళ్లి శ్రీధర్ రెడ్డి వరంగల్ వాయిస్, దామెర:ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారము దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్  కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందినీ సన్మానించారు,అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది అంకిత భావంతో గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేయాలని పరిసరాల పరిశుభ్రతతో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారుచేసి మండలంలో నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దాలని వారి సేవలు మరువలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్,ఉపసర్పంచ్ కిన్నెర దినేష్,వార్డు సభ్యులు కుసుమాబాయి,పలకల అనూష, కనుకుంట్ల రజిత,నాగుల రాజ్ కుమార్, పసునూటి వసంత, కిన్నెర కోటి, పొరండ్ల విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్,చేరాలు,సబిత, శంకర్ గ్రామస్తులు కిన్న...
ఒగ్లాపూర్ గురుకులాల్లో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ
Top Stories

ఒగ్లాపూర్ గురుకులాల్లో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ

వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాపూలే, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలను తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో అందుతున్న వసతులు, భోజన సౌకర్యాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ పాఠశాలలోని కిచెన్ షెడ్లను సందర్శించి, విద్యార్థులకు వాడుతున్న కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి, పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, భోజన నాణ్యతలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంట జీపీఓ హరిప్రసాద్, ఇతర స...
మంత్రులను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ
Top Stories

మంత్రులను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ గురువారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యతో కలిసి మంత్రుల  నివాసంలో ఆయనను కలిసిన స్వర్ణ మంతులకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రులు ఆమెకు సూచించారు. పార్టీ అప్పగించిన ఈ కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా మహిళలను చైతన్యపరచడంలో స్వర్ణ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, తోట హరీష్,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....
వేం నరేందర్ రెడ్డికి బొమ్మినేని రవీందర్ రెడ్డి సన్మానం
Top Stories

వేం నరేందర్ రెడ్డికి బొమ్మినేని రవీందర్ రెడ్డి సన్మానం

వరంగల్ వాయిస్, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన ప్రముఖ రాజకీయ నేత వేం నరేందర్ రెడ్డిని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని వేం నివాసానికి వెళ్లిన ఆయన, నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వేం నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల వరంగల్ వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.  ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య రంగాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సందర్భంగా బొమ్మినేని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ) వేదికగా ఈ సమస్యలపై గళమెత్తి, వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి...
Top Stories

మహిళలు ప్రతి రంగంలో ఉండాలి

వరంగల్ వాయిస్, దామెర :హన్మకొండ జిల్లా దామెర  మండలం కేంద్రంలో దమ్మున్నపేట   గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల సాధికారత, సమాజంలో మహిళల పాత్రపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల శక్తి, ప్రతిభ దేశాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈకార్య క్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు....
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
Top Stories

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వరంగల్ వాయిస్, దామెర:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి దుర్గంపేట సర్పంచ్ దాసి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్తను వేరు చేయటం  గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు ఇంటి పరిసర ప్రాంతాలలో చెత్తాచెదారం లేకుండా మురుగునీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు పరిసరాలను శుభ్రంగా లేనిచో దుర్వాసనతో పాటు దోమలు చేరి అనారోగ్య నికి దారితీస్తాయని దానితో ఆర్థికంగా నష్టపోతామని అన్నారు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం అన్నారు గ్రామ ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని తద్వారా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చుకోవాలని కోరారుఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఇంజపెల్లి నరేష్, సుకన్య, కారోబార్లు వెంకన్న, శీను, కిన్నెర రమేష్, నూన...
వివేక్ హార్ట్ క్లినిక్ ప్రారంభించిన డాక్టర్ కే మనోహర్.
Top Stories

వివేక్ హార్ట్ క్లినిక్ ప్రారంభించిన డాక్టర్ కే మనోహర్.

వరంగల్ వాయిస్ హన్మకొండ: హనుమకొండలోని కాలేజీ కళాక్షేత్రం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు అతి సమీపంలో  ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ నరసింహ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేక్ హార్ట్ క్లినిక్ ను ఆదివారం ప్రముఖ వైద్యులు, మాజీ నిమ్స్ డైరెక్టర్ డా. కె  మనోహర్, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ నరసింహ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వరంగల్ ట్రైసిటీలో అత్యాధునిక గుండె చికిత్సను అందించడం కోసం  డాక్టర్. వివేక్ నరసింహ నూతనంగా హాస్పటల్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. అనంతరం వివేక్ హార్ట్ క్లినిక్ యం.డి డా. వివేక్ నరసింహ మాట్లాడుతూ...అత్యాధునిక వైద్య పరికరాలతో, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో గుండెకు సంబంధిత సమస్యల పరిష్కారానికి వైద్యాన్ని అందించడం మా ప్రత్యేకత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా.సాంబశివరావు, డా. చంద్ర శేఖర...
ఎంపీడీఓ కార్యాలయంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’
Top Stories

ఎంపీడీఓ కార్యాలయంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’

వరంగల్ వాయిస్, దామెర : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంపీడీఓ గుమ్మడి కల్పన, సూపరింటెండెంట్ సబ్జా రాణి, పంచాయతీ కార్యదర్శి మనోహర్ లు స్వయంగా ఈ పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. కార్యాలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, మొక్కలకు నీరు పోస్తూ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కల్పన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా నిలవాలన...
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
Top Stories

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవివరంగల్ వాయిస్, దామెర : ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దామెర మండల తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి హెచ్చరించారు. శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రణాళిక’లో భాగంగా తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పారిశుధ్య పనులను నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితో కలిసి తహశీల్దార్ స్వయంగా పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలందించే క్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణం అవసరమని ఆమె పేర్కొన్నారు. విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా లేదా అక్రమ నిర్మాణాలకు పాల్పడినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు...
లర్నర్స్ ల్యాండ్ స్కూల్‌లో ఉమెన్స్ డే వేడుకలు
Top Stories

లర్నర్స్ ల్యాండ్ స్కూల్‌లో ఉమెన్స్ డే వేడుకలు

వరంగల్ వాయిస్, వరంగల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ ఎల్బీనగర్‌లోని 'లర్నర్స్ ల్యాండ్' పాఠశాలలో శనివారం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమం మహిళా శక్తిని, ఐక్యతను చాటిచెప్పేలా సాగింది. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా విజ్ఞానం, వైద్యం, క్రీడలు, విద్య వంటి అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే మహిళలు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలరని వారు ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాఠశాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు అత్యంత సంతోషభరిత వాతావరణంలో జరిగాయి. మహిళల ప్రాముఖ్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక...