Warangalvoice

Top Stories

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Top Stories

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

దామెర మండలంలో మూడవ విడత ఏర్పాట్లపై సంతృప్తివరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ ప్రధానంగా క్లస్టర్లలోని నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.  దామెర, ల్యాదెళ్ల, ఒగులాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నారు.ఈ కేంద్రంలో ఒగ్లాపూర్, దమ్మన్నపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు  నామినేషన్లను స్వీకరిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. క్లస్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ నోటీస్, రిజర్వేషన్ల జాబితా లను ఆమె పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ గురించి ఆర్వోలు, ఏఆర్వోలతో మాట్లాడి కలెక్టర్ వి...
ఫిర్యాదుల బాక్స్ ను ఉపయోగించుకోవాలి
Top Stories

ఫిర్యాదుల బాక్స్ ను ఉపయోగించుకోవాలి

వరంగల్ వాయిస్, దామెర : మండలం ఓగులాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు మైనార్టీ గురుకుల పాఠశాల మహాత్మ జ్యోతి రావు ఫూలే గురుకుల పాఠశాలను తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సులను పరిశీలించి వాటి గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పాఠశాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే ఒక చిట్టి పై రాసి ఫిర్యాదుల బాక్సులో వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సమ్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ డేవిడ్, ఆర్ఐ భాస్కర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు....
Top Stories

సీఈఓ సస్పెండ్ వేటు

వరంగల్ వాయిస్,దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ వద్ద గల పెద్దపూర్ ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి బి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి. సంజీవ రెడ్డి తెలుపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూపెద్దాపుర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సిఈఓ గా పనిచేస్తున్న శ్రీనివాస్ విధుల పట్ల నిర్మక్ష్యం వహిస్తు ఎరువుల అమ్మకాల ద్వారా వచ్చిన రూపాయలను బ్యాంకులో జమ చేయకుండా తన వద్దనే ఉంచుకున్న నేపథ్యంలో ఆయనను విదుల నుండి తొలగించినట్లు తెలిపారు. వరి ధాన్యం సేకరణ, రైతు ఉవృత్తి దారుల సంఘాలలో వాటాధనం, కొత్త సభ్యుల చేర్పించడం వంటి తదితర విషయాలపై నిర్లక్ష్యం వహించినందున సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు....
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
Top Stories

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

దామెర ఎస్సై అశోక్ విజ్ఞప్తివరంగల్ వాయిస్, దామెర: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు పాటించాల్సిన నియమాలను దామెర ఎస్సై కొంక అశోక్ సూచించారు. రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించకూడదు. గ్రామాల్లో ఎలాంటి రాజకీయ పరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. ఏర్పాటు చేసుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి. గ్రామాల్లో ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినా, మీకు సమాచారం అందిన వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సూచనలను పాటిస్తూ...
Top Stories

కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరంగల్ వాయిస్, దామెర:రైతులు ఆరుగాలం  పండించిన పంటను దళారులకు  అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధరను పొందాలని ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన అన్నారు. శనివారము  దామెర మండలంలోని సింగరాజు పల్లి లో ఐకె పి ఆధ్వర్యంలో సిరి మహిళ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  ఏవో రాకేష్, సిరి మహిళా సంఘం సభ్యులు స్వరూప, సుజాత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  మన్నెం ప్రకాష్ రెడ్డి, పోలే  పాక శ్రీనివాస్, దురిశెట్టి బిక్షపతి,దుబాసి రాజేందర్,పోషిని మహేందర్, కచ్చకాయల అరుణ రవీందర్ తదితర గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు....
Top Stories

స్మైల్ స్కూల్ కరస్పాండెంట్‌పై దాడి కేసు
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

వరంగల్ వాయిస్, హనుమకొండ: కుమార్ పల్లిలోని డీజీ స్మైల్ స్కూల్ కరస్పాండెంట్పై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసులో నిందితులైన విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ తెలిపారు. పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, కార్యదర్శి మహేష్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మహాసభలకు చందా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి, స్కూల్ కరస్పాండెంట్‌పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు....
బాధిత కుటుంబానికి రెడ్డి సంఘం ఆర్థిక సహాయం
Top Stories

బాధిత కుటుంబానికి రెడ్డి సంఘం ఆర్థిక సహాయం

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని  ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన పలకల వరమ్మ ఇటీవల మరణించగా మృతురాలు మనుమలు అభిలాష్ అభినవ్ లను గ్రామ రెడ్డి సంఘం సభ్యులు వరమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆమె మృతికి భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ బాధిత కుటుంబానికి బాసటగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు మన్నెం కరుణాకర్ రెడ్డి, చల్లా మైపాల్ రెడ్డి, సభ్యులు  ఏదుల్లా విజేందర్ రెడ్డి, పలకల సాంబశివరెడ్డి , మన్నెం రామ్ రెడ్డి, వెంకటరెడ్డి తిరుపతిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పలకల శ్రీనివాసరెడ్డి, రాజేందర్ రెడ్డి,  మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....
చల్లా పరామర్శలు
Top Stories

చల్లా పరామర్శలు

వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని దుర్గం పేట గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త గునిగంటి రాజమౌళి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి విషయాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలుసుకొని  ఆయన గృహానికి వెళ్లి పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరుగొండ గ్రామంలో మృతి చెందిన వీసం రామచంద్రారెడ్డి కుమారుడు వీసం రమణారెడ్డిని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గండు రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, రఘుపతి రెడ్డి,చల్ పూరి చంద్రయ్య, నూకల వీరేశం, కూనాటి సునీల్ రెడ్డి, గండు సుదర్శన్,  జన్ను సాంబయ్య తదితరులు పాల్గొన్నారు....
గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
Top Stories

గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాఫూలే, మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పకుండా అమలు చేయాలని తహసీల్దార్ సూచించారు. ఈ తనిఖీలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ఆమె వెంట ఉన్నారు....
సీఎం రేవంత్ ను స్వాగతం పలికిన కాంగ్రెస్ నేత బిల్లా..
Top Stories

సీఎం రేవంత్ ను స్వాగతం పలికిన కాంగ్రెస్ నేత బిల్లా..

వరంగల్ వాయిస్, దామెర:హన్మకొండ కి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,జిల్లా కాంగ్రెస్ నాయకులు బిల్లా రమణా రెడ్డి పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు.