Warangalvoice

Telangana

సచివాలయానికి ముహూర్తం ఖరారు
Telangana

సచివాలయానికి ముహూర్తం ఖరారు

ఏప్రిల్‌ 30 ప్రారంభించాలని కెసిఆర్‌ నిర్ణయం నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్‌ 14న అంబేడ్కర్‌ స్మృతి వనం. .. జూన్‌ 2న అమరుల స్థూపం ప్రారంభం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ సాగర్‌ పక్కనే స్మృతి వనాన్ని జూన్‌ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్‌ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్‌... త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2 లోప...
కవితా..ఓ కవితా!
Telangana, Today_banner

కవితా..ఓ కవితా!

దేశ మహిళా లోకానికి మేల్కొలుపు జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌కు తొలి అడుగు మున్ముందు మరింతగా చొచ్చుకు పోయే ఛాన్స్‌ భాష,హావభావాలతో ఆకట్టుకున్న కవిత వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలకు తొలి అడుగు పడిరది. దేశానికి సంబంధించిన ఓ పెద్ద సమస్యను ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే క్రమంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష దేశ ప్రజలను ఆలోచన చేసేలా చేసింది. దేశంలోని మహిళలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కవిత ప్రకటించిన యుద్దం బిజెపికి కనువిప్పు అయినా.. కాకున్నా.. దేశంలో బిఆర్‌ఎస్‌ పోరాటానికి మాత్రం పునాది పడిరదనే చెప్పాలి. అంతకు మించి కవిత తన హిందీ ప్రావీణ్యంతో ఉత్తరాదిని ఆకట్టుకునే నాయకురాలిగా కూడా ఎదగగలదని నిరూపించారు. ఉత్తరాదిలో ఎంతగా ఇంగ్లీషు ప్రావీణ్యం ఉన్నా వారు హిందీకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో కవిత తన విూడియా సమావేశంలోనూ, దీక్షా శిబిరంల...
ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం
Political, Telangana, Top Stories

ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌ సిట్‌ ముందుకు ఎందుకు రావడం లేదని ఎదురు ప్రశ్నించారు. సిట్‌ ముందుకు వచ్చేందుకు బీఎల్‌ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ...
అవి ఇడి సమన్లు కాదు..మోడీ సమన్లు
Political, Telangana

అవి ఇడి సమన్లు కాదు..మోడీ సమన్లు

వరుసగా మంత్రులు,నేతలపైనా దాడులు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర విపక్షాలపైనే 90 శాతం దాడులు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం ఆదానీకి బినావిూగా మోడీ అన్నదే నిజం డబుల్‌ ఇంజన్‌ అంటే మోడీ..ఆదానీ ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోడీ ఆదానీ పోర్టుల్లో డ్రగ్స్‌ దొరికినా చలనం లేదు నిబంధనలకు విరుద్దంగా ఆదానికీ ఆరు ఎయిర్‌పోర్టులు విూడియా సమావేశంలో మోడీని ఏకిపారేసిన కెటిఆర్‌ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరుసగా మంత్రుల విూదా ఇడి,ఐటి దాడులు చేయించారని అన్నారు. మా మంత్రి గంగుల విూద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు. మల్లారెడ్డి విూద ఐటీ దాడులు చేయించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పీఏ ఇంటి విూద ఈడీ దాడి చేసి...
బతుకమ్మ ముసుగులో లిక్కర్‌ స్కామ్‌
Telangana

బతుకమ్మ ముసుగులో లిక్కర్‌ స్కామ్‌

కెసిఆర్‌ బిడ్డకు తప్ప ఇతరులకు భద్రత ఏదీ కవిత తీరుపై మండిపడ్డ వైఎస్‌ షర్మిల ట్యాంక్‌బండ్‌పై రాణీరుద్రమ, చాకలి ఐలమ్మకు నివాళి ఆకస్మిక ధర్నాతో ట్రాఫిక్‌ జామ్‌..అరెస్ట్‌ చేసిన పోలీసులు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: కెసిఆర్‌ బంగారు తెలంగాణలో ఆయన కూతురు, ఎమ్మెల్సీ అయిన ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. సీఎం కేసీఆర్‌ బిడ్డకే భద్రత ఉందని, మిగతా వారికి రక్షణ లేదని.. వైఎస్సార్టీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడిరదని ఆరోపించారు. మహిళల విూద ఎంతో ప్రేమ ఉన్నట్లు మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ భద్రత లేదన్నారు. విచ్చలవిడి మద్యం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. కవిత ఆడదై ఉండి సిగ్...
న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు
Political, Telangana

న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు

కెసిఆర్‌ తనయ కవితకు ఇడి నోటీసులు 9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వస్తానంటూ కవిత లేఖ కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌ నేతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్‌ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న ఢల్లీిలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు. ముందస్తు అపాయింట్‌మెంట్స్‌ ఉన్నందున.. విూరు చెప్పిన టైంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి కవిత లేఖ రాశారు. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. ...
హైదరాబాద్‌ అద్భుత నగరం
Telangana, Top Stories

హైదరాబాద్‌ అద్భుత నగరం

ఇక్కడి అభివృద్ది మరింత అద్భుతం హైదరాబాద్‌లో పర్యటించిన ఆసియాన్‌ విూడియా బృందం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఒక చారిత్రక ఆధునిక నగరంగా అద్భుతంగగా ఉందని ఆసియాన్‌ విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి ఆతిధ్యం కూడా భాగుందన్నారు. నూతన సెక్రటేరియట్‌, తెలంగాణ అమరుల స్మారక మంటపం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌, స్కై వేలు, అండర్‌ పాసులు, హరితహారంలను ఆసియాన్‌ విూడియా ప్రతినిధి బృందం తమ కెమెరాల్లో రికార్డు చేసుకుంది. హైదరాబాద్‌ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్‌ దేశాల విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ను తమ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో భాగం చేసుకోవాలని యువతకు సూచించనున్నట్లు పేర్కొన్నారు. ఆసియాన్‌`ఇండియా విూడియా ఎక్చేంజ్‌ లో భాగంగా మియన్మార్‌, కాంభోడియ, వియత్నాం, థాయిలాండ్‌, ఇండోనేషియా, బ్రూనై , పిలిప్పీన్స్‌ , మ...
ఇప్పటినుంచే అడ్మిషన్లు..ఫీజుల గోల
Telangana, Today_banner

ఇప్పటినుంచే అడ్మిషన్లు..ఫీజుల గోల

కార్పోరేట్‌ స్కూళ్ల దోపిడీకి రంగం సిద్దం ముందే వసూళ్లకు ముందస్తు పరీక్షలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: త్వరలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పిల్లలు పరీక్షల కోసం కుస్తీ పడుతున్నారు. పరీక్షల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వచ్చే ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల గోల మొదలయ్యింది. ప్రైవేట్‌ స్కూళ్లు యదావిధిగా వసూళ్లకు తెగబడు తున్నాయి. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేసే పనిలో పడ్డాయి. ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించి మార్చిలో కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభించేందుకు పలు పాఠశాలలు రంగం సిద్దం చేశాయి. ఈ క్రమంలో వీరి దృష్టి అంతా వసూళ్లపై నే ఉంది. విద్యార్థులు, టీచర్లపై వారికి దృష్టి ఉండడం లేదు. టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న లక్ష్యం పక్కకు పోయింది. ఫీజలును పెంచేసి డబ్బులు లాగేయాలన్న లక్ష్యంతో కార్పోరేట్‌ స్కూళ్లు తల్లిదండ్రులను వేధించక తప్పడం లేదు. ప్రైవేట్‌ విద్యాసంస్...
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే…
Telangana, Top Stories

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే…

సింగరేణి అవకతవకలపైనే తొలి విచారణ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెల్లడి వరంగల్ వాయిస్,ఖమ్మం: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేటుకు అప్పగించి 25వేల కోట్ల దోపీడికి యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు. క్రిమినల్‌ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీల్లేదన్న రేవంత్‌.. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగడం దుర్మార్గమన్నారు. 10 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని.. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తామని రేవంత్‌ చెప్పారు. ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌?తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక...
నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ సభ
Telangana, Today_banner, Top Stories

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ సభ

తెలంగాణ పథకాలపై ఫోకస్‌ పెట్టనున్న కెసిఆర్‌ వరంగల్ వాయిస్, నాందేడ్‌: టిఆర్‌ఎస్‌ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన తరవాత తన తొలి అడుగును మహారాష్ట్ర నాందేడ్‌లో మోపబోతోంది. కెసిఆర్‌ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్న క్రమంలో నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తన వాణిని వినిపించబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను దేశానికి పరిచయం చేయబోతున్నారు. ప్రజలు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో మొదటిసారి ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా చేరికలపై ప్రధాన దృష్టి సారించారు. 5న ఆదివారం నాందేడ్‌లో జరుగబోయే బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేసీఆర్‌ కీలక ప్రసంగం చేయబోతున్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడుంటే దేశం బాగుపడుతుందని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని స్థానిక రైతులు కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత వి...