Warangalvoice

Telangana

సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే
District News, Telangana, Warangal

సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే

సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్‌‌ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్‌‌17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్‌‌ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక ‘‘చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారు. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్...
వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి
District News, Telangana

వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి

ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ వాయిస్, వరంగల్ : హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి" అని సీఐఐ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్‌లో పార్లమెంటు సభ్యురాలు (లోక్‌సభ) డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో శుక్రవారం సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటుగా ఏఐ ఇన్ ఫార్మా: ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫార్మాలో సీఐఐ మెంబర్‌షిప్ రోడ్‌ షో, సీఓఈల సేవలను నిర్వహించారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఇందులో పరిశ్రమలోని ముఖ్య నాయకులు వరంగల్‌పై తమ విజన్‌ను పంచుకున్నారు. సీఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సాయి డి ప్రసాద్ 'Ai in Pharma Session'లో స్వాగత ప్రసంగంలో తెలంగాణ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, 2047 బి 1 ట్రిలియన్ USDఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యాన్ని...
అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు
Telangana, Warangal

అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు

దేశ రక్షణకు సైనికులు.. అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు కొనియాడిన మంత్రి సురేఖ రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం వరంగల్ వాయిస్, వరంగల్ : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, దేశ సహజవనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11 సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ, అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషిని మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. ‘మనిషి జీవితం అడవుల నుంచే ఆరంభమైంది. మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయి. మనిషి ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందే క్రమంలో అడవులే ఆలవాలమయ్యాయి. తల్ల...
ఖైరతాబాద్ గణేశుడికి వస్త్రం, జంజం సమర్పించిన పద్మశాలీలు
Cultural, Telangana

ఖైరతాబాద్ గణేశుడికి వస్త్రం, జంజం సమర్పించిన పద్మశాలీలు

వరంగల్ వాయిస్ ఖైరతాబాద్: హైదరాబాద్ లోని అతిపెద్ద గణపతి విగ్రమైన ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలి కులస్తులు శనివారం వినాయక చవితి సందర్భంగా వస్త్రం, జంజం, గరిక మాల సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వినాయకుడికి పద్మశాలి కులస్తులు వస్త్రం, జంజం, గరికమాల సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలి కులస్తులు వాటిని అందించడం జరిగింది. తెలంగాణలోనే అతిపెద్ద వినాయకుడిగా పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలీలు వస్త్రం, జంజం, గరిక మాల సమర్పించే అవకాశం ఈసారి తమకు రావడం సంతోషంగా ఉందని తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ పార్థసారథి, ఐపీఎస్ అధికారి రావిరాల వెంకటేశం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా వీవవర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు, బసపత్తిని రాజేశం,  రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవు...
గురువులకి వందనం
District News, Telangana

గురువులకి వందనం

ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు (వరంగల్ వాయిస్, వరంగల్): విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. అలాంటి విద్యను అందించడంలో నిమగ్నమైన ఉపాధ్యాయులందరూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. ఒక సమర్థుడైన గురువుకు మాత్రమే దేశగమనాన్ని మార్చగల శక్తి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు గాను విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ కమిషన్ ...
వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి
Hanamkonda, Telangana, Warangal

వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతోపాటు పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు అందించామని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చ...
ఘనంగా ఏనుగు దినోత్సవం
District News, Latest News, Telangana

ఘనంగా ఏనుగు దినోత్సవం

పాల్గొన్న మంత్రి కొండా సురేఖ వరంగల్ వాయిస్, బెంగుళూరు : సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు వుందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్’ సదస్సులో కొండా సురేఖ పాల్గొన్నారు. ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ, నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్నాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తున్నద...
బీజేపీ చీఫ్ గా ఈటల?
Telangana

బీజేపీ చీఫ్ గా ఈటల?

కలిసొస్తున్న రాజకీయ అనుభవం బలమైన నాయకుడి కోసం పార్టీ అన్వేషణ వరంగల్ వాయిస్, వరంగల్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ గా మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరు తెరమీదకు వస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన, అనుభవం కలిగిన నేతగా గుర్తింపు ఉన్న ఈటలవైపే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ముగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవాలంటే ఈటెల రాజేందర్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉంటేనే సాధ్యమవుతుందని అధిష్టానం నమ్ముతోంది. ఈ క్రమంలో ఆయన పేరు దాదాపు ఖరారు అయిందని బీజేపీలో ప్రచారం సాగుతోంది. నిజాం కోటపై కమలం జెండా.. నిజాం కోటపై కమలం జెండా ఎగురేసేందుకు ...
వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాన్యం
Hanamkonda, Telangana

వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాన్యం

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ వాయిస్, వరంగల్ : అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఛైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎం సి పర్గెయిన్, ఫీల్డ్ డైరక్టర్ లు క్షితిజ, శాంతారాం, బోర్డు అధికారులు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆర్ అండ్ బి, పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు, బిసిఎన్ఎల్, టి ఫైబర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు. మా...
వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్
Hanamkonda, Telangana

వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్

రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే చాన్స్ ప్రజల్లో హర్షాతిరేకాలు..మంత్రికి అభినందనల వెల్లువ వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగర పురోభివృద్ధికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే కోవలో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, అందులో ఒక టెక్నికల్ సెంటర్ (హబ్) వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయి పేటలో ఏర్పాటు కానుందనే వార్త వరంగల్ ప్రజలకు గొప్ప ఊరటను కలిగిస్తోంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మంత్రి సురేఖ పట్టుదలతో చేసిన ప్రయత్నాలతో వరంగల్ లో టెక్నికల్ సెంటర...