Warangalvoice

Mulugu

రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు
Mulugu

రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు

వరంగల్ వాయిస్, మంగపేట : మంగపేట మండల కేద్రంలోని శ్రీ దుర్గా మోడరన్ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరంగల్ రీజనల్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అడిషన్ ఎస్పీ రామారావు ఆదేశాల మేరకు ములుగు జిల్లా మంగపేట మండలంలో శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు పై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 420 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, 55 క్వింటాళ్ల బ్రోకెన్ రైస్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని, మిల్లు ఓనరుపై తగు చర్యల తీసుకునేందుకు సివిల్ సప్లై అధికారులకు రిపోర్ట్ పంపటం జరిగిందని వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ రాకేష్ , పీసీ సుమన్ రెడ్డి, రమేష్ సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ రాంచందర్, మంగపేట రెవిన్యూ ఇస్పెక్టర్ నేత కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు....
ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
Crime, District News, Mulugu

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలుయువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దువరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ రాజయ్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను గురువారం పరకాల ఇన్ స్పెక్టర్ పి.కిషన్ నిందితులకు ఖమ్మం జిల్లా కారాగారంలో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితులు రెండు నెలల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా నుంచి భద్రాచలం మీదుగా పరకాలకు గ...
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌
Crime, District News, Mulugu

ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

వరంగల్‌ వాయిస్‌, ములుగు: ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం వారి అరెస్ట్‌ ను చూపిన వెంకటాపురం సీఐ కె. శివప్రసాద్‌ మంగళవారం వివరాలు వెల్లడిరచారు. 25న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివారులోని బిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొండాపురం వైపు నుంచి అలుబాక వైపునకు అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ బ్రిడ్జి సమీపానికి వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడిరచి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నిషేదిత సి.పి.ఐ మావోయిస్ట్‌ పార్టీకి చెందిన వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌) , జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌) పేరుతో నినాదాలతో కూడిన కొన్ని కరపత్రాలు కనిపించాయమన్నారు. పట్టుబడిన వ్యక్తులు తాటి సోమయ్య, తాటి సత్యం, యాలం సురేష్‌ ల గుర్తించారు. వీరిది...