Warangalvoice

Hanamkonda

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
District News, Hanamkonda, Telangana

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యదర్శిని పక్షపత్రిక పదేళ్లుగా నిర్విరామంగా వెలువరించడం అభినందనీయమన్నారు. అలాగే ఉచిత హోమియో క్యాంపులు నిర్వర్తిస్తూ ప్రజలకు హోమియోపతిపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు ఆరోగ్య దర్షిని పక్షపత...
ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి
District News, Hanamkonda

ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీలు ఆర్థికంగా బలపడాలంటే రాజకీయంగా రాణించాలని అందుకు రాజ్యాధికారం అవసరమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక మేధావుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాలలో బీసీ ఉద్యమ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చిరంజీవులు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో బీసీ సంఘాలు ఉన్నప్పటికీ వారి మధ్య సఖ్యత లేక బీసీలు రాజకీయంగా రాణించలేకపోతున్నారని, భవిష్యత్తు రాజకీయాలు రాణించాలంటే బీసీల మధ్య సఖ్యత తప్పనిసరని తెలిపారు. కుల గణాలతో బీసీలకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని, సమగ్ర సర్వేపై కొన్ని పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జాక్, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, ఓబీసీ కో కన్వీనర్ గడ్డం భాస్క...
బాపూజీకి భారత రత్న ఇవ్వాలి
District News, Hanamkonda

బాపూజీకి భారత రత్న ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే వన్నాల వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్దంతి వేడుకలు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని బాపూజీ నిలువెత్తు విగ్రహానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేర్మన్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వన్నాల మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాపూజీ స్పూర్తిదాయకంగా, నిస్వార్థ సేవలు అందించారని వన్నాల కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాట కాలంలో కీలక భూమిక పోషించారని వన్నాల స్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని మాత్రమే అధికారికంగా నిర్...
జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ
District News, Hanamkonda

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ

వరంగల్ వాయిస్ (హన్మకొండ) : ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులుగా, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా పనిచేసారు. వివిధ పత్రికల్లో, మీడియాలో పనిచేసిన రమణ ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రిక ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తనను రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం పట్ల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి ర...
నవీన్ కుటుంబానికి అండగా ఉంటా
District News, Hanamkonda

నవీన్ కుటుంబానికి అండగా ఉంటా

 ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పది వేల తక్షణ ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ పద్మశాలి కులస్తుల ఆర్థిక సాయం చెక్కు అందజేత కుల కట్టుకుని దర్శనం ఈ చేయూత బాధిత కుటుంబానికి అభయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు హాజరైన పద్మశాలి కుల పెద్దలు వరంగల్ వాయిస్, హన్మకొండ :  నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన నవీన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలబడతామని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. హనుమకొండ కుమార్ పల్లి కి చెందిన నిరుపేద పద్మశాలి కులస్తుడైన నవీన్ భార్య నిఖిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సొంత ఇల్లు లేకపోవడంతో కర్మకాండలు స్మశాన వాటిక లోనే ఉంటూ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ వెంటనే స్పందించి ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని పద...
వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి
Hanamkonda, Telangana, Warangal

వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతోపాటు పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు అందించామని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చ...
విద్యార్థులకు కళ్లద్దాలను అందజేసిన అభినవ్ భాస్కర్
Hanamkonda

విద్యార్థులకు కళ్లద్దాలను అందజేసిన అభినవ్ భాస్కర్

వరంగల్ వాయిస్, హనుమకొండ : మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్,సర్వోదయ మిత్రమండలి సంయుక్తంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించి అనంతరం అవసరమైన విద్యార్థులకు శుక్రవారం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్, 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ అద్దాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డా. సుప్రియ దేశ్ పాండే, అనిరుద్ దేశ్ పాండే, వినాయక హాస్పిటల్ చైర్మన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బిజెపి జిల్లా ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ నాగపురి అశోక్, డివిజన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, యాదగిరి, ప్రవీణ్, నరేష్, శివ, సంతోష్, రాము, గుండె అశోక్, యూత్ అధ్యక్షులు బాబీ, ఓబీసీ సెల్ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు....
కొత్త చట్టాలపై అవగాహన అవసరం
Hanamkonda, Top Stories

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : జులై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారికి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా విడతల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ములుగు రోడ్డులోని ఎల్ బీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులను సెంట్రల్ జోన్ డీసీపీ ముఖ్యం అతిధిగా హాజరై శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ డివిజన్లకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జులై 1 నుంచి కొత్త చట్టాలను అను...
అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ
Hanamkonda, Top Stories

అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డికాలనీలోని అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదానం కోసం అసోసియేషన్ బాధ్యుడు పెద్దోజు వెంకటచారి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో 35వ సారి రక్తదానం చేశాడు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ చారి, వేణు, రాము, సర్వేశ్వర్, రాజు, రవీందర్, సిద్దోజు రాకేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు....
పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర గొప్పది
Hanamkonda, Top Stories

పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర గొప్పది

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, ది.నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన స్వధార్ మహిళా ఆశ్రమంలో పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర అను అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ అనితా రెడ్డి బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, పర్యావరణను కాపాడుకోకపోతే రానున్న కాలంలో జీవించడం కష్టమన్నారు. మన జీవన విధానాలతో పర్యావరణం కాలుష్యమవుతుందని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం, చెట్లను నరకడం వలన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఆధునిక యంత్రాలు వినియోగం పెరగడం, నియంత్రణ లేకపోవడం, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అధికంగా వాడటం తద్వారా, భూగోళం వేడెక్కి జీవరాశులకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని పేర్క...