Warangalvoice

Hanamkonda

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం
Cultural, District News, Hanamkonda

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం

వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా అప్లై చేశాడు.197 దేశాల పేర్లు రాజధాని, కరెన్సీ, భాషలు అవలీలగా చెప్పగలడు. రికార్డు ఇంతవరకు ఎవరు సాధించలేదు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా బింగి నరేందర్ గౌడ్, అడ్డగట్ట గంగాధర్, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు....
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
District News, Hanamkonda

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ గిరిజన శక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు మంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని మంద నరేష్ అన్నారు. విద్యార్థులు తమ చదువులు సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం సాధిస్తే రాష్ట్రం వచ్చాక విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రం కోసం పోరాడని తెలంగాణ ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి మాత్రం జిల్లాకు మంత్రి అయ్యాడని మండిపడ్డారు. ...
అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
District News, Hanamkonda

అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ వరంగల్ వాయిస్, హనుమకొండ : షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్న నేటికీ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను అమలు చేయడం లేదని, ఈ కారణంగా కోట్లాది రూపాయలు కార్మికులు నష్టపోతున్నారని, రాష్ట్ర కార్మిక శాఖ కనీస వేతనాలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఫైలు పంపినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి కనీస వేతనాల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సవరణ జరగాల్సి ఉండగా ...
బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి
District News, Hanamkonda

బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : అంబేద్కర్ సెంటర్ వద్ద బీసీ యువజన సంఘం గ్రేటర్ అధ్యక్షుడు రాసురి రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందే అని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55% ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపై క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్...