కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు
వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన మాజీ శాసనసభ్యుడు నల్లూరి ఇంద్రసేనారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఆయా మండల పరిధిలో గల గ్రామాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి జూన్ 30 2022 ఆర్థిక సంవత్సరం వరకు ఏమేం నిధులు కేటాయించాయి, వాటి వినియోగం ఏ విధంగా జరిగింది అనే అంశాలను ప్రాతిపదికన సమాచార సేకరణ కోసం ప్రతి మండలానికి ఈ దరఖా...






