Warangalvoice

Author: Sahith Gaddam

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి
District News

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి

వరంగల్ వాయిస్,  మధిర : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్ర‌భుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖ‌మ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో, రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు. అనంతరం తొలి సభ్యత్వాన్ని సీనియర్ జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి చేతుల మీదగా జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రావిరాల శశి కుమార్, మువ్వా మురళి, మక్కెన నాగేశ్వరరావు, కిలారి కిశోర్, నాళ్ల శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావ...
Harish Rao | న‌మ్మినందుకు రైతుల గొంతు కోస్తారా..? రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు
District News

Harish Rao | న‌మ్మినందుకు రైతుల గొంతు కోస్తారా..? రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట‌ హ‌రీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న.. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండి. వారి కన్నీటి కష్టాలు తీర్చండి. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచింది. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచింది. కష్టపడి పండించిన ధాన్యమంతా...
CM Revanth Reddy | సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం.. రేవంత్ రెడ్డికి త‌ప్పిన ప్ర‌మాదం..
Top Stories

CM Revanth Reddy | సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం.. రేవంత్ రెడ్డికి త‌ప్పిన ప్ర‌మాదం..

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఆయ‌న ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌ హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ నోవాటెల్ హోట‌ల్‌లో మంగళ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. శంషాబాద్ నోవాటెల్ హాట‌ల్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మొద‌టి అంత‌స్తు నుంచి రెండో అంత‌స్తులోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ లిఫ్ట్ ఎక్కారు. అయితే ప‌రిమితికి మించి ఆ లిఫ్ట్‌లో ఎక్క‌డంతో అది ఒక్క‌సారిగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దీంతో హోట‌ల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్‌కి పంపారు. రేవంత్ ఉక్కిర...
Alampur | కళ్ళ ముందే కాలిన మొక్కజొన్న పంట.. క‌న్నీరు పెట్టుకున్న రైత‌న్న‌
Latest News

Alampur | కళ్ళ ముందే కాలిన మొక్కజొన్న పంట.. క‌న్నీరు పెట్టుకున్న రైత‌న్న‌

వరంగల్ వాయిస్,  అలంపూర్  : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కాలి పోతున్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామానికి చెందిన అచ్చన్న అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి అంద‌డంతో మొక్కజొన్న కంకులను కోసి, వాటిని పొలంలోనే కుప్పగా పోసి నూర్పిడి చేసేందుకు నిలువ ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పొలంలోని నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట సుమారు 40 క్వింటాళ్ల ధాన్యం కాలి బూడిదైపోయింది. ఉదయాన్నే పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది.. అప్ప‌టికే మొక్క‌జొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి రైతు లబోదిబో అంటూ గుండె బాదుకున్నాడు. బాధిత రైతును ఆదుకోవాలని తోటి రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు....
MLA Jagadish Reddy | వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది : ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి
Latest News

MLA Jagadish Reddy | వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది : ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి

వరంగల్ వాయిస్,  యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ స‌భ త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోతుంద‌ని సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి ఆలయం వరకు బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది. సబ్బండ వర్గాలు కదిలివస్తున్నాయ్. వ‌రంగ‌ల్ స‌భ ఓ రేంజ్‌లో ఉంటుంది. బీఆర్ఎస్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. వ‌రంగ‌ల్ స‌భ కూడా అలానే ఉంటుంది. ఇవ్వాళ అందరిలో చైత్యనాన్ని స్పూర్తిని నింపేలా బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఇవ్వాళ ప్రజలకు కష్టం వస్తే మా కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ప్రతి రైతు మనసులో...
Revanth Reddy | వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్‌ రెడ్డి
Latest News

Revanth Reddy | వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్‌ రెడ్డి

 ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రచ్చ చేస్తే.. పదేళ్లు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌సాగర్‌ రావు పరోక్షంగా ప్రభుత్వానికే వార్నింగ్‌ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. మంత్రి ప...
KTR | హెచ్‌సీయూ భూముల వెనక 10 వేల కోట్ల భారీ స్కామ్.. రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్‌‌: కేటీఆర్‌
Latest News

KTR | హెచ్‌సీయూ భూముల వెనక 10 వేల కోట్ల భారీ స్కామ్.. రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్‌‌: కేటీఆర్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నాని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల వెనుక 10 వేల కోట్ల...
Warangal | జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు
District News

Warangal | జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు

వరంగల్ వాయిస్, వరంగల్ చౌరస్తా : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభ కార్యక్రమం, మంత్రులు ప్రసంగించి వెళ్లే వరకు నిలిపివేయడంతో ఈ క్రమంలో భారీగా చేరుకున్న నిరుద్యోగ యువతముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులకు గాయాల్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. కాగా, ఇరుకుగా ఉన్న హోటల్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
Anugula Rakesh Reddy | కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ అని మరోసారి రుజువైంది.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవినీతిపై మండిపడ్డ రాకేశ్‌ రెడ్డి
Latest News

Anugula Rakesh Reddy | కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ అని మరోసారి రుజువైంది.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవినీతిపై మండిపడ్డ రాకేశ్‌ రెడ్డి

Anugula Rakesh Reddy | డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదని విమర్శించారు. ఓపెన్ క్యాటగిరీలో ఉన్న 63 మందిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రతి రోజు అభ్యర్థులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణాలు చేస్తున్నా కనీసం సమాధానం చెప్పేటోడే లేడని ఏనుగుల రాకేశ...
EX MLA Anjaiah yadav | వరంగల్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు
Latest News

EX MLA Anjaiah yadav | వరంగల్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు

తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గుర్తు చేశారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు. వరంగల్ వాయిస్, షాద్ నగర్  : తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిని కనులారా చూపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని, స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పాలన అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. రైత...