Warangalvoice

Author: Sahith Gaddam

TG Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌.. కేబినెట్‌లో కొత్తగా నలుగురికే ఛాన్స్‌..?
Top Stories

TG Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌.. కేబినెట్‌లో కొత్తగా నలుగురికే ఛాన్స్‌..?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. కేబినెట్‌ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. కొత్త మంత్రులు ఏప్రిల్‌ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ...
SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌లో మ‌రో మృత‌దేహం వెలికితీత‌.. ఇంజినీర్ మ‌నోజ్‌కుమార్‌గా గుర్తింపు
Latest News

SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌లో మ‌రో మృత‌దేహం వెలికితీత‌.. ఇంజినీర్ మ‌నోజ్‌కుమార్‌గా గుర్తింపు

దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్ర‌దేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్త...
Sunitha Lakshma Reddy | స్పీకర్‌ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Top Stories

Sunitha Lakshma Reddy | స్పీకర్‌ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు. విషయంపైనే మాట్లాడానుతప్ప ఎక్కడా పరిధి దాటలేదన్నారు. అయినా తనను అలా వినబుద్ధికావడం లేదని ఎలా అంటారన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్‌ ఉపసంహరించుకోవాలన్నారు. శాసనసభలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సభ్యుల హక్క...
MLA Palla Rajeshwar Reddy | ‘అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి’
Latest News

MLA Palla Rajeshwar Reddy | ‘అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి’

చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. వరంగల్ వాయిస్, చేర్యాల : పల్లెల అభివృద్ధి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సాధ్యమవుతుందని చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సుంకరి మల్లేశంగౌడ్‌ అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్‌ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించేందుకు ఎమ్మెల్యే రూ.కోటి 60లక్షలు మంజూరు ...
OU Circular | ఓయూ సర్క్యులర్ రద్దుకు మద్దతు ఇవ్వండి.. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌కు విజ్ఞ‌ప్తి
Top Stories

OU Circular | ఓయూ సర్క్యులర్ రద్దుకు మద్దతు ఇవ్వండి.. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌కు విజ్ఞ‌ప్తి

ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్‌లను కలిసి పరిస్థితిని వివరించారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం.. ఓయూ అధికారులతో మాట్లాడాలని ...
KP Vivekananda | బడ్జెట్‌లో హైదరాబాద్‌కు కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల మాత్రం శూన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Top Stories

KP Vivekananda | బడ్జెట్‌లో హైదరాబాద్‌కు కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల మాత్రం శూన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

వరంగల్ వాయిస్, కుత్బుల్లాపూర్ : హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా జరిగినప్పటికీ.. నిధులు విడుదల చేయడంలో మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్‌ పార్టీ విప్‌, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇతర పద్దులపై జరిగిన చర్చల సమయంలో హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్‌ నగరానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీకి రూ.2654 కోట్లు కేటాయించి రూ.1200 కోట్లను మాత్రమే విడుదల చేశారని తెలిపారు. హెచ్ఎండీఏకు రూ.2,500 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదని విమర్...
Group-1 | గ్రూప్-1 పేప‌ర్లు రీవాల్యుయేష‌న్ జ‌రిపించాలంటూ హైకోర్టులో పిటిష‌న్
Top Stories

Group-1 | గ్రూప్-1 పేప‌ర్లు రీవాల్యుయేష‌న్ జ‌రిపించాలంటూ హైకోర్టులో పిటిష‌న్

Group-1 | తెలంగాణ గ్రూప్-1 ఫ‌లితాల‌పై అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. పార‌ద‌ర్శ‌కంగా పేప‌ర్లను దిద్దించ‌లేద‌ని.. తెలుగు మీడియం అభ్య‌ర్థుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని బాధిత అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ గ్రూప్-1 ఫ‌లితాల‌పై అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. పార‌ద‌ర్శ‌కంగా పేప‌ర్లను దిద్దించ‌లేద‌ని.. తెలుగు మీడియం అభ్య‌ర్థుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని బాధిత అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. అనుభ‌వం లేని అధ్యాప‌కుల‌చే పేప‌ర్ల‌ను దిద్దించి.. అన్యాయం చేశార‌ని టీజీపీఎస్సీపై మండిప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ్రూప్-1 ప‌రీక్ష పేప‌ర్ల‌ను రీవాల్యుయేష‌న్ జ‌రిపించాల‌ని గ్రూప్-1 అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. గ్రూప్-1 మూల్యాంక‌నం లోప‌భూయిష్టంగా జ‌రిగింద‌ని పిటిష‌న‌ర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్-1...
KTR | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం.. మండిప‌డ్డ కేటీఆర్
Top Stories

KTR | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం.. మండిప‌డ్డ కేటీఆర్

KTR | నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయ‌త్నం నుంచి తన‌ను తాను ర‌క్షించుకునేందుకు ఓ యువ‌తి ఎంఎంటీఎస్ రైలు నుంచి కింద‌కు దూకాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ ఘ‌ట‌న తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై త్వ‌ర‌గా విచార‌ణ‌ను పూర్తి చేయాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు కేటీఆర్ అభ్య‌ర్థించారు. తెలంగాణ పోలీసులు, మ‌హిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా బాధితురాలికి అన్ని విధాలా అండ‌గా ఉండాల‌న్నారు. ఈ ఘ‌ట‌న రైల్వే పోలీసుల ప‌రిధిలో ఉన్న‌ప్ప‌టికీ.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఒక మేల్కొలుపు లాంటిది అని చె...
MLA Jagadish Reddy | ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ ఎత్తేయండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి
Top Stories

MLA Jagadish Reddy | ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ ఎత్తేయండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి

MLA Jagadish Reddy | సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. స్పీక‌ర్‌ను క‌లిసిన వారిలో జ‌గ‌దీశ్ రెడ్డి, హ‌రీశ్‌రావు, కేటీఆర్, గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వ‌కుంట్ల‌ డాక్ట‌ర్ సంజ‌య్, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద‌, అనిల్ జాద‌వ్, చింతా ప్ర‌భాక‌ర్, మాణిక్ రావు ఉన్నారు. శాననసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ మార్చి 13న‌ అసెంబ్లీలో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పె...
MLC Kavitha | ఎంఎంటీఎస్ రైలులో యువ‌తిపై అత్యాచార‌య‌త్నం.. ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి
Top Stories

MLC Kavitha | ఎంఎంటీఎస్ రైలులో యువ‌తిపై అత్యాచార‌య‌త్నం.. ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలులో యువతిపై అత్యాచార‌య‌త్నం ఘ‌ట‌నపై క‌విత‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీ వ‌ద్ద‌ ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని.. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదేపదే చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్...