Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్కు బెయిల్
Women Journalists | పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్కు బెయిల్ మంజూరైంది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్కు బెయిల్ మంజూరైంది. ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి సోమ, శుక్రవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్ కాపీలు అందిన వెంటనే.. చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్ సర్కారుకు కంటగింపుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా ...