అసెంబ్లీకి రానని ఎలా వచ్చాడు
బాబు తీరుపై మండిపడ్డ రోజా
మండలి ఫలితాలు విశ్లేషిస్తామని వెల్లడి
వరంగల్ వాయిస్,విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ మంత్రులు ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. టీడీపీది అనైతిక విజయమని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా, కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా గన్నవరంలోని ఏపీఎస్ఎస్డీసీ ఆవరణలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు విూడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి రానన్న చంద్రబాబు ఎందుకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు (ªుఆఖ అఠతి।ªబి) 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎ...