Tenth Exams | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.
కాగా, పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదలకానున్నాయి. మైనర్ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 3న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్) పేపర్-1, 4న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2కు పరీక్షలు జరుగుతాయి....