మేడారంకు ప్రత్యేక బస్సులు
9నుంచి 16వరకు
200 బస్సులు..400 ట్రిప్పులు
వరంగల్ రీజియన్ రీజినల్ మేనేజర్ విజయ భాను
వరంగల్ వాయిస్, వరంగల్ : మినీ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయ భాను ప్రకటించారు. ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎనిమిది రోజుల పాటు 200 బస్సులు..400 ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మేడారానికి ఉదయం 6 గంటల నుంచి భక్తుల బస్సులను నడపనున్నట్లు తెలిపారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనం చేసుకునే భక్తులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. మహిళలు, ఆడపిల్లలు వారి ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా ప్రయాణం చేసి అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవల కొరకు హనుమకొండ బస్ స...