Warangalvoice

Tag: బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం

బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం
Crime, District News, Warangal

బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం

బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు వరంగల్ వాయిస్, వరంగల్‌ : వరంగల్‌ బస్టాండ్‌ లో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్‌ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు. వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్‌ అనే విద్యార్థి వరంగల్‌ బస్‌ స్టాండ్‌ కు వెళ్లాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు.. అనిల్‌ ను ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన ప్రయాణికులు, విద్యార్థులు నాలుగు బస్సుల అద్దాలను కోపంతో ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనిల్‌ మ...