Warangalvoice

Warangal

బిఆర్‌ఎస్‌ బెదరింపులకు భయపడేది లేదు
District News, Hanamkonda, Warangal

బిఆర్‌ఎస్‌ బెదరింపులకు భయపడేది లేదు

దాడులు చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రశ్నిస్తాం వైఎస్‌ షర్మిల విమర్శలు వరంగల్ వాయిస్,వరంగల్‌: ప్రజల పక్షాన పోరాడటమే తప్పా....? అని వైఎస్‌ఆర్టీపీ చీప్‌ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్‌ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. విూ దాడులకు రెట్టింపు స్థాయిలో విూ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల...విూలాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్నా బీఆర్‌ఎస్‌ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. గతంలో నర్సంపేటలో తమ బస్సును తగలబెట్టి, తమపై దాడి చేశారని ఆరోపించారు. నిన్న వర్ధన్నపేటలో ప్రజా ప్రస్థానం యాత్రపై దాడి చేశారని, ఏం జరిగినా తన పాదయాత్ర తిరిగి మొదలుపెట్టానని చెప్పారు. ప్లెక్సీలు చింపి, కవరేజ్‌ చేస్తున్న విూడియాపై దాడికి యత్నించారన్నారు. ప్రజల తరపున ప్ర...
వరలక్ష్మీ నమోస్తుతే..
Cultural, District News, Hanamkonda, Warangal

వరలక్ష్మీ నమోస్తుతే..

భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి, రాజమణి దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్హర్.. మండలంలో వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సం...
న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌
District News, Warangal

న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌

కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగితే తిర‌గ‌బ‌డుతాం.. త్వ‌ర‌లో నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ ఇది నా బర్త్ డే డిక్ల‌రేష‌న్‌ న‌రేంద‌ర్ సైలెంట్‌గా ఉన్నాడు..ఎవ‌రు ఏమ‌న్నా ప‌ట్టించుకోడు అనుకుంటున్నారేమో.. న‌రేంద‌ర్ సైలెంట్‌ కాదు..వైలెంట్.. పార్టీని చీల్చుతామంటూ కొంద‌రు చెప్పుకొంటున్నారు..పార్టీని కాదు నిన్నే చీల్చుతాం..చీల్చింది ఎలా అంటే నీవు పుట్టిన ఊరి వ‌ర‌కు వినిపించేలా ఉంటుందంటూ ఇటీవ‌ల పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఓ నేత‌నుద్దేశించి వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ఘాటుగా స్పందించారు. ఇది తన బర్త్ డే డిక్ల‌రేష‌న్ అంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. -వరంగల్ వాయిస్, వరంగల్...
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
Crime, District News, Today_banner, Warangal

పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిపై సీరియ‌స్‌ఆరుగురు య‌జ‌మానుల‌పై కేసులుచేయి చేసుకోవ‌డంతో ముదిరిన వివాదంఒక రోజు బంద్ పాటించి నిర‌స‌న‌ ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసుల‌కు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారంటూ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంపై బార్ అండ్‌ రెస్టారెంట్ య‌జ‌మానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తే బార్లు న‌ష్టాల్లో కూరుకుపోయి మూసుకోవాల్సిన‌ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని య‌జ‌మానులు అంటుండగా ఎవ‌రైనా ఎక్సైజ్‌ నిబంధ‌న‌లు పాటించాల్సిందే నంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మార‌డంతో బార్ య‌జ‌మానులు మంగ‌ళ‌వారం ఒక్క రోజు బంద్ కూడా పాటించారు. పోలీసులు మ...
నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
Crime, District News, Warangal

నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్

ఏ విద్యార్హత లేకున్నా వైద్యంనకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులువివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్, మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ వున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో అపివేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. నిందితుడు అహ్మద్ సహాయకుడి...
అనుమానం.. రెండు ప్రాణాలు బలి
Crime, District News, Warangal

అనుమానం.. రెండు ప్రాణాలు బలి

భార్యను నరికి చంపిన భర్త ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితమే భార్యతో గొడవపడిన హరీష్‌ క్రిమిసంహారక మందు తాగాడు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. అయితే మరోసారి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వివాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్‌ మంగళవారం తెల్లవారుజామున భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి త...
లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..
Bhupalapally, District News, Hanamkonda, Mahabubabad, Top Stories, Warangal

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..

ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్‌ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి Gandra Venkataraman Reddy...
చాయ్ వాలాకు సత్కారం
District News, Warangal

చాయ్ వాలాకు సత్కారం

వ‌రంగ‌ల్ వాయిస్‌, కాశిబుగ్గ : ఎంజీఎం రెండో గేటు ముందు గత 20 సంవత్సరాలుగా టీ కొట్టు న‌డిపిస్తూ వీధి వ్యాపారం నిర్వహణలో మొదటి స్థానం దక్కించుకున్న మహమ్మద్ మహబూబ్‌ పాషాని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమ‌వారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలకోసం కాకుండా స్వయం కృషితో అభివృద్ది చెందాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సాయి, శైలజ, శ్రీకాంత్ హోటల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు....
ఆటో డ్రైవర్ల‌కు అండగా ఉంటా
District News, Warangal

ఆటో డ్రైవర్ల‌కు అండగా ఉంటా

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వ‌రంగ‌ల్ వాయిస్‌, క‌రీమాబాద్ : ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమ‌వారం భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంత‌రం జెండా ఆవిష్కరించి ఆటో డ్రైవర్ల‌నుద్దేశించి మాట్లాడారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్ని విధాల అండగా ఉంటున్నదన్నారు. భవిష్యత్‌లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. నగరంలోని అన్ని ఆటో అడ్డాల‌లో మౌళిక వసతుల కోసం కృషి చేస్తాన‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. లైసెన్స్, బ్యాడ్జ్ క‌లిగి ఉన్న ఆటో డ్రైవర్లు ప్రమాద వశాత్తు మరణ...
రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్య‌క్షుడిగా అశోక్‌బాబు
District News, Warangal

రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్య‌క్షుడిగా అశోక్‌బాబు

నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకారం వ‌రంగ‌ల్ వాయిస్‌, ఖిలా వ‌రంగ‌ల్ : రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సం సోమ‌వారం కాశిబుగ్గలోని వేడుకల మందిరంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ డాక్ట‌ర్‌ శరత్ బాబు నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా బేతి అశోక్ బాబు, సెక్రటరీగా భేతి సతీష్, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సంద‌ర్భంగా నూత‌న అధ్యక్షుడు బేతి అశోక్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంలో రోట‌రీ క్లబ్ ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పేదలకు ఐదు కుట్టుమిషన్లు, స్కూలుకు పోయే పిల్లలకు ఐదు సైకిళ్లు ఉచితంగా అందజేశారు. కాశిబుగ్గ ఎస్సార్ నగర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల‌కు ప్యాడ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్, చైర్స్ అందించారు. బేతి అశోక్ ఆధ్వర్యంలో 25 మంది ...