Warangalvoice

Warangal

చోరీలకు పాల్పడిన నిందితులకై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి…సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌
Crime, Warangal

చోరీలకు పాల్పడిన నిందితులకై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి…సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...
దసరా పండుగకి ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం….వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
Crime, Warangal

దసరా పండుగకి ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం….వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.

వరంగల్ వాయిస్, క్రైం :దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అలాగే చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు తెలిపిన ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ◆సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది. ◆ తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వండి.వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం. ◆ ...
శభాష్ పోలీస్… మానవత్వం చాటుకున్న దామెర ఎస్సై..
Crime, Warangal

శభాష్ పోలీస్… మానవత్వం చాటుకున్న దామెర ఎస్సై..

వరంగల్ వాయిస్, దామెర: వరంగల్ పోలీస్ కమీషనరేట్ దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన సంఘటనలో మానవత్వంతో ఎస్సై అశోక్ వ్యవహరించిన సమయస్ఫూర్తిని మండల ప్రజలు సెల్యూట్ దామెర పోలీస్ అంటూ ఆదివారం ప్రశంసల జల్లును కురిపించారు. వివరాల్లోకెళ్తే దామెరలోని శివాలయం వద్ద పోచారం గ్రామానికి చెందిన మనోహర్ తన ద్విచక్ర వాహనంపై హనుమకొండ వైపు వెలుచుండగా దామర గ్రామంలోకి రాగానే టూ వీలర్ కి అడ్డంగా కోతి రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పై మనోహర్ పడడంతో తలకి బలమైన గాయం కావడంతో అటుగా దామెర ఎస్సై కొంక అశోక పెట్రోలింగ్ కోసం వెళ్తూతుండగా గమనించి వెంటనే 108 కి ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో స్వయంగా తన వాహనంలో గాయాలైన వ్యక్తిని తీసుకొని ఆరెపల్లి వరకు వెళ్లగా 108 వాహనం రావడంతో బాధితున్ని అందులో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఎస్సై అశోక్ ని గ్రామ ప్రజలు, పలువురు నాయకులు ప్రశంసించారు....
బీహార్ లో రానున్నది ఇండియా కూటమే… వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
Political, Warangal

బీహార్ లో రానున్నది ఇండియా కూటమే… వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ వాయిస్, వరంగల్ : బీహార్ లో రానున్నది ఇండియా కూటమేనని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.మంగళవారం బీహార్ సుపాల్ లోని నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ...20 ఏళ్ల ప్రజా కంటక నితిష్ బీజేపీ పాలన నుంచి బీహారిలకు విముక్తి లభించ బోతున్నదని ఎంపీ కడియం కావ్య అభిప్రాయ పడ్డారు. ఓట్ చోరి సార్ ఊతంగా దొడ్డి దారిన గద్దెను ఎక్కాలని కలలు కంటున్న ఎన్ డిఏ బ్యాచ్ కు శంకర గిరి మాన్యాలు తప్పవని ఎంపీ అన్నారు. బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో సుపాల్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ అధికార యాత్ర కు వస్తున్న విశేష స్పందనపై విషయాలను ప్రస్పుటం చేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల్లో ఆగ్రహం, యువత ఆక్రోశం, మహిళల ఆవేదన తమకు యాత్ర లోస్ప...
ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం….వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌
Crime, Warangal

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం….వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న తరుణంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ విద్యా సంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడే విధంగా వుంటుందని, ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుండి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ర్యాగింగ్‌ పాల్పడిన విద్యార్థుల విద్యా, ఉ...
పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌….వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌
Crime, Warangal

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌….వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం: వ్యక్తిగత వాహనాలపై పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వాహనదారులకు హెచ్చరించారు.ఈ పెండింగ్‌ చలాన్లపై వరంగల్‌ పోలీస్ కమిషనర్ కొరడా ఝాలిపిస్తూ బుధవారం ఓ ప్రకటన చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజు,రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో పాటు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవడంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అతిక్రమించి వాహనదారులు వాహనాలను నడుపతున్నారని తెలిపారు. దీనితో పోలీసులు ట్రాఫిక్‌ నిబందనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో పోలీసులు ట్రాఫిక్‌ జరిమానాలు విధించడం జరుగుతొందన్నారు.విధించిన ట్రాఫిక్‌ జరిమానాలను సైతం వాహనదారులు సకాలం...
పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి… వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..
Crime, Warangal

పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి… వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..

వరంగల్ వాయిస్, క్రైం :పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్‌ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ నల్లబెల్లి పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు స్టేషన్‌ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు కిట్‌ ఆర్టికల్స్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సీపీ అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసు...
వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపర్చాలి…ఎంపీ డాక్టర్ కడియం కావ్య
Political, Warangal

వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపర్చాలి…ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ శుక్రవారం పార్లమెంట్ లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై వరంగల్ ఎంపీ వివరణ కోరారు. గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సదుపాయాలను కల్పించడంతోపాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఎంపీ కోరారు. మెడికల్ కళాశాలలకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. కొత్త మెడికల్ కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు 2023 నిబంధనల ప్ర...
Warangal

ఈ నెల 13 న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష

వరంగల్ వాయిస్, హనుమకొండ:రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ లలోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్,నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం జరిగే పాలీసెట్-2025ను ఈ నెల 13వ తేదీ (మంగళవారం) రోజున ఉ. 11.00 గం.నుండి మ. 1.30 గం. వరకు నిర్వహించనున్నట్లు, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ పరీక్షకు వరంగల్ నగరంలోని 12 కేంద్రాలనుండి 6424 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు.విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే, అనగా ఉదయం 10.00 గంటలకే అనుమతిస్తారని కావున విద్యార్థులు ఉ. 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓ ఎం...
టీడీపీ నేతల స్వీట్ల పంపిణీ
District News, Warangal

టీడీపీ నేతల స్వీట్ల పంపిణీ

ఘనంగా టీడీపీ ఆవిర్బాభవ దినోత్సవం వరంగల్ వాయిస్, కరీమాబాద్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించి అన్న నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయమని నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పరిపాలనలో భాగస్వామ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన పార్టీ వృద్ధాప్య పింఛన్, పేదవాడికి పక్కా ఇండ్ల నిర్మాణం, రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళలు...