Warangalvoice

Warangal_TriCites

వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్
Crime, Latest News, Warangal_TriCites

వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్

వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లితండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బానోతు శృతి కారులో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళ్లుండగా కాకతీయ వెంటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష...
డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు
Crime, Warangal_TriCites

డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు

‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య నలుగురిపై కేసు నమోదు వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో చోటుచేసుకుంది. డాక్టర్ ప్రత్యూష బందువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూషకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లాడి సుజన్ తో 2017లో వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల జానుషా సృజన్, ఏడు నెలల జెస్వికాస్ సృజన్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డాక్టర్ ప్రత్యూష ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో డెంటింస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సృజన్ ...
అధిక జనాభాతో అనేక సమస్యలు
Latest News, Warangal_TriCites

అధిక జనాభాతో అనేక సమస్యలు

కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన వరంగల్ వాయిస్, వరంగల్ : అధిక జనాభాతో అనేక సమస్యలు ఉద్భవిస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలు..సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా విస్పోటనం జరుగుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరి కొన్ని సంవత్సరాలు తర్వాత భూమి మీద నివసించేందుకు చోటు లభించదన్నారు. అందుకు కుటుంబ నియ...
శక్తి స్వరూపిణి.. శాకంబరీ
Cultural, Latest News, Today_banner, Warangal_TriCites

శక్తి స్వరూపిణి.. శాకంబరీ

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ పులకించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. చివరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీగా అలంకరించారు. భద్రకాళి ఆలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వ...