Warangalvoice

Warangal_TriCites

ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ
Crime, Warangal_TriCites

ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో  ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి. గోపి మట్టెవాడ నుండి వి. ఆర్, కె. సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె. రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వి. ఆర్ కు బదిలి అయ్యారు....
గూడు కోసం గోడు
Today_banner, Warangal_TriCites

గూడు కోసం గోడు

ఇందిరమ్మ ఇల్లు" పేరుతో అధికారుల చెలగాటం దామెర మండలం కోగిల్వాయిలో దారుణం ప్రోసిడిండ్ కాపీ వచ్చిందని ఇల్లు నేలమట్టం వానాకాలంలో నిరాశ్రయులైన బాధితులు న్యాయం చేయాలని వేడుకోలు వరంగల్ వాయిస్, దామెర : ఒకవైపు వానాకాలం ప్రారంభమై ప్రజలను బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి, ఉన్న గూడును కూడా కోల్పోయేలా చేసిన ఒక దురదృష్టకర సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం కోయిలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల తమ పాత ఇంటిని కూల్చుకుని, ప్రస్తుతం నిరాశ్రయులైన ఒక కుటుంబం న్యాయం కోసం వేడుకుంటోంది. ఉన్న ఇల్లును కోల్పోయిన కుటుంబం కోయిలవాయి గ్రామానికి చెందిన పోటు సునీత, రవి దంపతులకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి సరళ తెలియజేశారు. మంజూరు కాపీని కూడా అందజేసిన కార్యదర్శి, పాత రేకుల ఇల్లును కూల్చి కొత్త ఇంటిని త్వరితగతిన నిర్మించుకోవాలన...
chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్
Today_banner, Warangal_TriCites

chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్

ఆకస్మిక తనిఖీలతో హల్ చల్ అక్రమార్కులపై ఉక్కుపాదం పాలనలో పట్టు భిగిస్తున్న ఐఏఎస్ గ్రేటర్ కమిషనర్ గా తనదైన ముద్ర మరో శాలినీమిశ్రా అంటూ కితాబు గ్రేటర్ వరంగల్ కు ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే నగర ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. నగరాభివృద్ధిలో వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే పేరు శాలినీ మిశ్రా అయితే అదే స్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తూ పాలనను చక్కదిద్దే పనిలో పడ్డారు ప్రస్తుత కమిషనర్ చాహత్ బాజ్ పాయ్. 13 జూన్ 2025న విధుల్లో చేరిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ పరిధిలోని అన్ని రంగాలపై పట్టు సాధిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పడకేసిన స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి...
వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్
Crime, Latest News, Warangal_TriCites

వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్

వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లితండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బానోతు శృతి కారులో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళ్లుండగా కాకతీయ వెంటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష...
డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు
Crime, Warangal_TriCites

డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు

‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య నలుగురిపై కేసు నమోదు వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో చోటుచేసుకుంది. డాక్టర్ ప్రత్యూష బందువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూషకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లాడి సుజన్ తో 2017లో వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల జానుషా సృజన్, ఏడు నెలల జెస్వికాస్ సృజన్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డాక్టర్ ప్రత్యూష ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో డెంటింస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సృజన్ ...
అధిక జనాభాతో అనేక సమస్యలు
Latest News, Warangal_TriCites

అధిక జనాభాతో అనేక సమస్యలు

కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన వరంగల్ వాయిస్, వరంగల్ : అధిక జనాభాతో అనేక సమస్యలు ఉద్భవిస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలు..సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా విస్పోటనం జరుగుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరి కొన్ని సంవత్సరాలు తర్వాత భూమి మీద నివసించేందుకు చోటు లభించదన్నారు. అందుకు కుటుంబ నియ...
శక్తి స్వరూపిణి.. శాకంబరీ
Cultural, Latest News, Today_banner, Warangal_TriCites

శక్తి స్వరూపిణి.. శాకంబరీ

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ పులకించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. చివరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీగా అలంకరించారు. భద్రకాళి ఆలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వ...