Warangalvoice

Warangal_TriCites

జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేత
Sports, Warangal_TriCites

జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేత

వరంగల్ వాయిస్, ఆరేపల్లి : ఆరేపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించి, మొత్తం 140 బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్సత్తా ఉద్యమ సంస్థ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకరి ప్రశాంత్  హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ,“ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. గణతంత్ర దినోత్సవం అనేది మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పవిత్ర దినం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించింది. ప్రతి విద్యార్థి మంచిగా చదివి దేశానికి, రాష్ట్రానికి, తన గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి” ప్రభ...
కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
Warangal_TriCites

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులతోపాటు భూములిచ్చిన అయోధ్యపురం గ్రామస్థులకు 65 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ డిమాండ్‌పై తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ సాగిస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నియామకాల్లో ప్రత్యేక విధానం ఉండాలి.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో విభజన చట్టం ప్రకారం దక్కిన కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నిర్మించడం హర్షణీయమని అసోసియేషన్ పేర్కొంది. అయితే, ఇందులో నియామకాలను సాధారణ ఆర్ఆర్ బీ, ఆర్ఆర్ సీ పద్ధతిలో కాకుండా, ఈ ప్రాంత నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జీవో ద్వారా చేపట్టాలని ...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
Warangal_TriCites

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. వరంగల్ వాయిస్, వరంగల్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధిలోని 32,41 డివిజన్ లలో రూ.4.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ లు, సైడ్ వాల్ లు, బాక్స్ డ్రైన్ ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని గతంలో తాను శాసన సభ్యురాలుగా ఉన్నపుడు వేసిన రోడ్లు అని ప్రస్తుతం దెబ్బతిని పనికి రాకుండా పోయిన నేపథ్యంలో మేయర్, కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు స్థానిక నాయకుల సహకారంతో ఏక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వారి అవసరం మేరకు అంచనాలు తయారు చేసి వరంగల్ తూర్పు నియోజక వర్గం లో ప్రతి డివిజన్ లలో నెలకొ...
స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay
Political, Warangal_TriCites

స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay

ఉదయం నోటిఫికేషన్.. మధ్యాహ్నం స్టే బీసీ రిజర్వేషన్ల జీవో 9పై వాదోపవాదనలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశంవరంగల్ వాయిస్ ప్రతినిధి : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.ఉదయం నోటిఫికేషన్..రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వ...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Crime, Warangal_TriCites

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఒకరికి తీవ్ర గాయాలుఎదురెదురుగా ఢీకొన్న బైకులువరంగల్ వాయిస్, ఆత్మకూరు : మండలంలోని దుర్గపేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఆరూరి అశోక్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దామెర మండల బీజేపీ పార్టీ అధ్యక్షడు రాజ్ కుమార్ ను స్థానికులు హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....
ఉత్తమ ఇంపాక్ట్ ట్రైనర్ గా రఘు రాఘవేంద్ర స్వామి
Hanamkonda, Warangal_TriCites

ఉత్తమ ఇంపాక్ట్ ట్రైనర్ గా రఘు రాఘవేంద్ర స్వామి

* ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస నైపుణ్య శిక్షణ శిబిరం  * శిక్షణ పొందిన వారికి అవార్డుల ప్రధానంవరంగల్ వాయిస్ (కుమార్ పల్లి హనుమకొండ సెప్టెంబర్ 25) :ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సైకాలజిస్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి హనుమకొండ జిల్లా కుమార్ పల్లి లోని డైమండ్ హిల్ బ్యాంకేట్  హాల్ హాల్ నందు రెండు రోజుల సదస్సును నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రధానం జరిగింది. ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రైమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లర్నింగ్ వ్యవస్థాపకుడు రఘు రాఘవేంద్ర స్వామిని అభినందిస్తూ ముఖ్య అతిధులచే అవార్డు మరియు సర్టిఫికెట్ను బహుకరించడం జరిగింది,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కు చెందిన నేషనల్ ప్రెసిడెంట్ కె మాధవి ఆర్గనైజింగ్ సెక్రటరీ...
మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy
Cultural, Mulugu, Warangal_TriCites

మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy

నేనేమి మనులు, మాణిక్యాలు అడగడం లేదు మేడారానికి జాతీయ హోదా కల్పించాలి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందుకు కృషి చేయాలి జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదాం.. వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ తో నిర్మిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా కల్పించి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అందుకు రాష్ట్రం నుంచి ప్రాముఖ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,...
పేద, మధ్యతరగతికి జీఎస్టీ పండుగ
Political, Warangal_TriCites

పేద, మధ్యతరగతికి జీఎస్టీ పండుగ

మోదీ ప్రభుత్వం  పండుగ గిఫ్ట్ భారీగా  జీఎస్టీ తగ్గింపు రైతులకు, విద్యార్థులకు ఊరట మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ వరంగల్ వాయిస్, (వరంగల్, సెప్టెంబర్ 22): నూతనంగా సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈరోజు నుంచి అమలులోకి వస్తున్నాయని, ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బోనంజా లాంటిదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత శక్తివంతం అవుతుందని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వరంగల్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు, నెక్స్ట్ జెన్ జీఎస్టీ అభియాన్ జిల్లా కన్వీనర్ రత్నం సతీష్ షా ఆధ్వర్యంలో ఎల్.బి. నగర్‌లోని రాయన్ ప్యాలెస్ హాల్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ స...
అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది
Warangal_TriCites

అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది

వరంగల్ వాయిస్, దామెర : అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పదనీ  కాంగ్రెస్ రేవూరి మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు  కు నాటి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఊరుగొండ  గ్రామంలో పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం  అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ముందుగా గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ... అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని, వినాయకుడి ఆశీస్సులు పరకాల ఎమ్మెల్యే పై ఉండాలని దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భూపతి రమేష్,సభ్యులు వేల్పుల మధుకర్, కోల రాజు, గొల్లపల్లి వీరయ్య, జన్ను రాజు, ఉప్పుల రవి, చిట్ల సదానందం,ఓదెల కరుణాకర్, చెట్టుపల్లి మధుకర్, గౌడ గాని మహేందర్, లక్కిడి రవీందర్ రెడ్డి,మనోజ్, పవన్, నల్ల సాంబయ్య, దామెర మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందికొండ సంపత్ తదితరులు పా...
రక్తదానం ప్రాణదానం..
Warangal_TriCites

రక్తదానం ప్రాణదానం..

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దామేశ్వరాలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద గల కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  హనుమకొండ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎంపీడీవో గుమ్మడి కల్పన, ఎస్సై కొంక   అశోక్, ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం ఇతరులకు ప్రాణదానం అన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి రక్త కణాల పునరుత్పత్తికి ఉపయోగపడుతుందని ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం బిల్లా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి...