Warangalvoice

Warangal_TriCites

అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది
Warangal_TriCites

అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది

వరంగల్ వాయిస్, దామెర : అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పదనీ  కాంగ్రెస్ రేవూరి మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు  కు నాటి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఊరుగొండ  గ్రామంలో పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం  అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ముందుగా గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ... అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని, వినాయకుడి ఆశీస్సులు పరకాల ఎమ్మెల్యే పై ఉండాలని దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భూపతి రమేష్,సభ్యులు వేల్పుల మధుకర్, కోల రాజు, గొల్లపల్లి వీరయ్య, జన్ను రాజు, ఉప్పుల రవి, చిట్ల సదానందం,ఓదెల కరుణాకర్, చెట్టుపల్లి మధుకర్, గౌడ గాని మహేందర్, లక్కిడి రవీందర్ రెడ్డి,మనోజ్, పవన్, నల్ల సాంబయ్య, దామెర మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందికొండ సంపత్ తదితరులు పా...
రక్తదానం ప్రాణదానం..
Warangal_TriCites

రక్తదానం ప్రాణదానం..

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దామేశ్వరాలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద గల కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  హనుమకొండ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎంపీడీవో గుమ్మడి కల్పన, ఎస్సై కొంక   అశోక్, ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం ఇతరులకు ప్రాణదానం అన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి రక్త కణాల పునరుత్పత్తికి ఉపయోగపడుతుందని ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం బిల్లా రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి...
రక్తదానానికి కదిలి రండి
District News, Warangal_TriCites

రక్తదానానికి కదిలి రండి

వరంగల్ వాయిస్, దామెర: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం దామేశ్వరాలయంలో అభిషేకం, అర్చన కార్యక్రమాలను  నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ  పరకాల ప్రదాత రేవూరి ప్రకాష్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో సోమవారం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం హనుమాన్ దేవాలయం దగ్గరలోని కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో...
తాడికొండ వెంకటరాజయ్య మృతి సమాజానికి తీరనిలోటు
Warangal_TriCites

తాడికొండ వెంకటరాజయ్య మృతి సమాజానికి తీరనిలోటు

మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు సంతాపం!వరంగల్ వాయిస్, హనుమకొండ :ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రఖ్యాత ఆచార్యులు తాడికొండ వెంకటరాజయ్య మరణ వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన యోగ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సామాజిక ఉద్యమకారులు,రచయిత ప్రజాజీవన పోరాటం కోసం అంకితమవుతున్న ఆచార్య వెంకట రాజయ్య హఠాన్మరణం పట్ల వన్నాల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బహుముఖ ప్రజ్ఞాశాలి,బహుజన సమాజ ఆస్తి తెలంగాణలో ఆయన భూమిక విస్తారం పద్మశాలి సమూహం ప్రయోజనాలకు పెట్టని కోట ఆచార్య తాడికొండ వెంకటరాజయ్య అని వన్నాల కొనియాడారు.జనగామ జిల్లాలో ఆయన సేవలు మరువలేనివి, వెంకటరాజయ్య  అస్తమయం తెలంగాణ భవిష్యత్తు బహుజన సామాజిక ఉద్యమాలకు తీరని లోటని వన్నాల అన్నారు. వెంకటరాజయ్య నిష్క్రమరణం నాకు తీవ్ర ఆవేదన కలిగించిందని,ఆయన కుటుంబానికి మనోధైర్యం కల...
గణేష్ ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ వారి విన్నపం
Cultural, Warangal_TriCites

గణేష్ ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ వారి విన్నపం

వరంగల్ వాయిస్,దామెర: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  దామెరమండలంలోని అన్ని గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీలకు, యూత్ క్లబ్ నిర్వాహకులకు విద్యుత్ శాఖ సూచనలను తప్పకుండా పాటించవలెనని దామెర  ఏఈ గుర్రం రమేష్ తెలిపారు. వినాయక విగ్రహాలను తీసుకుని వచ్చేటప్పుడు తొందరపడకుండా విద్యుత్ వైర్లను మరియు కేబుల్ వైర్లను గమనించి వాహనంలోనికి ఎక్కించడం దింపడం  చేయవలెను. కేబుల్ ఆపరేటర్లు కేబుల్ వైర్లను వినాయక విగ్రహాలకు తగలకుండా పైకి కట్టవలెను. లేనిచో వాటిని తొలగించడం జరుగుతుందని తెలిపారు. వినాయక మండపాలను విద్యుత్ వైర్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేయరాదని అన్నారు. మండపంలోని విద్యుత్ సౌకర్యం కొరకు ఎన్సీబీ కరెంటు వైర్లను వాడవలెను ఇన్సులేటెడ్ కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ వారి అనుమతితో విద్యుత్ సిబ్బంది ద్వారా పోలుపైన చుట్టించుకోవాలని కొండ్లు వేయరాదని తెలిపారు. వినాయక మండపా...
ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం
Crime, Warangal_TriCites

ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం

లబ్ధిదారుడిపై కాంగ్రెస్ నాయకుల దాడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు వరంగల్ వాయిస్, పర్వతగిరి : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు కమీషన్ ఇవ్వలేదనే కారణంతో ఒక లబ్ధిదారుడిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు దాడి చేసిన సంఘటన పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన కన్నే కల్పన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, మొదటి విడతలో లక్ష రూపాయలు ఆమె అకౌంట్‌లో జమ అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు, నాయకుడు రమేష్.. కల్పన భర్త దేవేందర్‌ను సంప్రదించారు. గ్రామంలో చెరువు పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే ఖర్చుల నిమిత్తం మొదటి విడత నుంచి రూ. 10 వేలు, మొత్తం నాలుగు విడతలకు కలిపి రూ.40 వేలు కమీషన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై దేవేందర్ ‘ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లక...
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్స్యూరెన్స్
Warangal_TriCites

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్స్యూరెన్స్

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాంఅధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సదయ్యవరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ చేయించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాద బీమా నమోదు ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అనేక కారణాల వల్ల హమీల అమలు కొంత ఆలస్యమైందన్నారు. ఆర్థిక పరమైన విషయాలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో చర్చించటం, కమిటీలో ఏకాభిప్రాయం రావటం ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవటంతో ఆలస్యం జరిగిందని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న ఇన్స్యూరెన్స్ కు అదనంగా సహజ మరణానికి కూడా వర్తించేలా మరో ప్రత్యేక పాలసీ కోసం కమిటీలో చర్చించి ప్రకటన...
కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం
Latest News, Warangal_TriCites

కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం

కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్దాంతం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వరంగల్ లో ద్వితీయ జిల్లా మహాసభలు ప్రారంభం వరంగల్ వాయిస్, వరంగల్ : కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అధ్యక్షత జరిగిన సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మోడీ పాలనలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. గత 11 ఏళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కుతూ ...
అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!
Crime, Warangal_TriCites

అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!

ద్విచక్ర వాహనం స్వాధీనంవరంగల్ వాయిస్, కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి బుధవారం కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనదారుడి ద్విచక్రవాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ఈ చలాన్ల మొత్తం రూ.32,165 కావడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జరిమానా మొత్తం చెల్లిస్తేనే వాహనం రిలీజ్ చేయనున్నట్లు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న చెప్పారు....
డీసీసీ అధ్యక్షుడిగా దొమ్మాటి?
Political, Warangal_TriCites

డీసీసీ అధ్యక్షుడిగా దొమ్మాటి?

రేవంత్, వేం సూచనలతో ఫైనల్ ఏఐసీసీకి చేరిన దస్త్రం ఒకటి, రెండు రోజుల్లో నియామకపు ఉత్తర్వులు పలువురు ఆశావహులకు నిరాశ కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా దొమ్మాటి సాంబయ్య నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీకి ప్రతిపాదనలు అందినట్లు ప్రచారం సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పీఠం తమ వర్గ నాయకుడికి కట్టబెట్టాలని చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్ఠానం దొమ్మాటి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీకి దొమ్మాటి సాంబయ్య గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. అయితే కడియం శ్రీహరి కూతుకు డాక్టర్ కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవిని సాంబయ్యకు కట్టబెడితే తగిన న్యాయం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడికి అ...