Warangalvoice

Top Stories

KP Vivekananda | బడ్జెట్‌లో హైదరాబాద్‌కు కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల మాత్రం శూన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Top Stories

KP Vivekananda | బడ్జెట్‌లో హైదరాబాద్‌కు కేటాయింపులు ఘనం.. నిధుల విడుదల మాత్రం శూన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

వరంగల్ వాయిస్, కుత్బుల్లాపూర్ : హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా జరిగినప్పటికీ.. నిధులు విడుదల చేయడంలో మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్‌ పార్టీ విప్‌, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇతర పద్దులపై జరిగిన చర్చల సమయంలో హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్‌ నగరానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీకి రూ.2654 కోట్లు కేటాయించి రూ.1200 కోట్లను మాత్రమే విడుదల చేశారని తెలిపారు. హెచ్ఎండీఏకు రూ.2,500 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదని విమర్...
Group-1 | గ్రూప్-1 పేప‌ర్లు రీవాల్యుయేష‌న్ జ‌రిపించాలంటూ హైకోర్టులో పిటిష‌న్
Top Stories

Group-1 | గ్రూప్-1 పేప‌ర్లు రీవాల్యుయేష‌న్ జ‌రిపించాలంటూ హైకోర్టులో పిటిష‌న్

Group-1 | తెలంగాణ గ్రూప్-1 ఫ‌లితాల‌పై అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. పార‌ద‌ర్శ‌కంగా పేప‌ర్లను దిద్దించ‌లేద‌ని.. తెలుగు మీడియం అభ్య‌ర్థుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని బాధిత అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ గ్రూప్-1 ఫ‌లితాల‌పై అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. పార‌ద‌ర్శ‌కంగా పేప‌ర్లను దిద్దించ‌లేద‌ని.. తెలుగు మీడియం అభ్య‌ర్థుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని బాధిత అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. అనుభ‌వం లేని అధ్యాప‌కుల‌చే పేప‌ర్ల‌ను దిద్దించి.. అన్యాయం చేశార‌ని టీజీపీఎస్సీపై మండిప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ్రూప్-1 ప‌రీక్ష పేప‌ర్ల‌ను రీవాల్యుయేష‌న్ జ‌రిపించాల‌ని గ్రూప్-1 అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. గ్రూప్-1 మూల్యాంక‌నం లోప‌భూయిష్టంగా జ‌రిగింద‌ని పిటిష‌న‌ర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్-1...
KTR | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం.. మండిప‌డ్డ కేటీఆర్
Top Stories

KTR | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం.. మండిప‌డ్డ కేటీఆర్

KTR | నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయ‌త్నం నుంచి తన‌ను తాను ర‌క్షించుకునేందుకు ఓ యువ‌తి ఎంఎంటీఎస్ రైలు నుంచి కింద‌కు దూకాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ ఘ‌ట‌న తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై త్వ‌ర‌గా విచార‌ణ‌ను పూర్తి చేయాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు కేటీఆర్ అభ్య‌ర్థించారు. తెలంగాణ పోలీసులు, మ‌హిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా బాధితురాలికి అన్ని విధాలా అండ‌గా ఉండాల‌న్నారు. ఈ ఘ‌ట‌న రైల్వే పోలీసుల ప‌రిధిలో ఉన్న‌ప్ప‌టికీ.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఒక మేల్కొలుపు లాంటిది అని చె...
MLA Jagadish Reddy | ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ ఎత్తేయండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి
Top Stories

MLA Jagadish Reddy | ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్ ఎత్తేయండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి

MLA Jagadish Reddy | సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. స్పీక‌ర్‌ను క‌లిసిన వారిలో జ‌గ‌దీశ్ రెడ్డి, హ‌రీశ్‌రావు, కేటీఆర్, గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వ‌కుంట్ల‌ డాక్ట‌ర్ సంజ‌య్, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద‌, అనిల్ జాద‌వ్, చింతా ప్ర‌భాక‌ర్, మాణిక్ రావు ఉన్నారు. శాననసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ మార్చి 13న‌ అసెంబ్లీలో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పె...
MLC Kavitha | ఎంఎంటీఎస్ రైలులో యువ‌తిపై అత్యాచార‌య‌త్నం.. ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి
Top Stories

MLC Kavitha | ఎంఎంటీఎస్ రైలులో యువ‌తిపై అత్యాచార‌య‌త్నం.. ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలులో యువతిపై అత్యాచార‌య‌త్నం ఘ‌ట‌నపై క‌విత‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీ వ‌ద్ద‌ ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని.. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదేపదే చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్...
KTR | అమ్మ పెట్ట‌దు.. అడుక్క తిన‌నివ్వ‌దు.. కాంగ్రెస్ పాల‌న‌పై కేటీఆర్ ధ్వ‌జం
Top Stories

KTR | అమ్మ పెట్ట‌దు.. అడుక్క తిన‌నివ్వ‌దు.. కాంగ్రెస్ పాల‌న‌పై కేటీఆర్ ధ్వ‌జం

KTR | కాంగ్రెస్ పాల‌న‌లో ప‌ల్లెల‌న్నీ ధ్వంస‌మ‌వుతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. పారిశుధ్య వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్లెల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు అని విమ‌ర్శించారు కేటీఆర్ వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పాల‌న‌లో ప‌ల్లెల‌న్నీ ధ్వంస‌మ‌వుతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. పారిశుధ్య వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్లెల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు అని విమ‌ర్శించారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్లెల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు.. అన్న చందంగా కాంగ్రెస్ పాల‌న ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లెలు నాడు కేసీఆర్ పాలనలో ప్రగతి బాట ప‌డితే.. నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట ప‌ట్టాయ‌న్నారు. 14 నెలలుగా సర్పం...
BRS MLAs | మంత్రి కోమ‌టిరెడ్డిపై చ‌ర్యలు తీసుకోండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞ‌ప్తి
Top Stories

BRS MLAs | మంత్రి కోమ‌టిరెడ్డిపై చ‌ర్యలు తీసుకోండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞ‌ప్తి

తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడని స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పు దోవ పట్టిస్తున్నారు అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై త‌క్ష‌ణ‌మే చర్య తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు....
ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్
Top Stories

ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్

Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి  ఎంపిక త్వరలోనే జరుగనుంది. ఈ పదవి కోసం పార్టీలోని ఆశావాహులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఆ పదవి తమకే రావాలని పలువురు సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌  అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడి పదవిపై వస్తున్న వార్తలకు కేంద్రమంత్రి పుల్‌స్టాప్ పెట్టేశారు. ‘నేను రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను, నాకే రావాలని కోరుకోవడం లేదు’ అని తేల్చి చెప్పేశారు. అలాగే సోషల్ మీడియా, మీడియాలో వచ్చే పేర్లపై, ప్రచారం చేసుకునే నేతలపై అధిష్టానం సీరియస్‌గా ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు...
KTR | రేపు క‌రీంన‌గ‌ర్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Top Stories

KTR | రేపు క‌రీంన‌గ‌ర్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వెళ్ల‌నున్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వెళ్ల‌నున్నారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన స‌న్నాహ‌క స‌మావేశంలో కేటీఆర్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్ బ‌హిరంగ స‌భ‌కు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి బీఆర్ఎస్ స‌త్తా ఏంటో చూపించాల‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు గుండె ధైర్యం గులాబీ జెండానే అని కేటీఆర్ పేర్కొన్నారు....
Job Notifications | తక్షణమే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఓయూలో ర్యాలీ
Top Stories

Job Notifications | తక్షణమే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఓయూలో ర్యాలీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెయిన్ లైబ్రరీ ఎదుట నిర్వహించిన నిరసన అనంతరం జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటివరకు 13 ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. నోటిఫికేష...