Warangalvoice

Top Stories

KTR | నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్ర‌హం
Top Stories

KTR | నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్ర‌హం

శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్ర‌యివేటు వ్య‌క్తితో నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్ర‌యివేటు వ్య‌క్తితో నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్య‌మం చేసి జైలుకు పోయిండా..? ఏం చేసి పోయిండు ఆయ‌న జైలుకు..? సానుభూతి ఎందుకు..? మేం పోలేదా జైలుకు. తెలంగాణ ఉద్య‌మంలో వ‌రంగ‌ల్ జైలుకు నేను కూడా పోయాను. బ‌రా...
KTR | ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగితే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్
Top Stories

KTR | ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగితే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్

ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు. శాస‌న‌స‌భ‌లో రుణ‌మాఫీ, రైతుబంధు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. 18 గంట‌లు ప‌ని చేస్తున్నాన‌ని సీఎం చెబుతున్నాడు. ఒక్క రోజు సెలవు పెట్ట‌కుండా బ్ర‌హ్మాండంగా ప‌ని చేస్తున్నాను. 40 సార్లు కాక‌పోతే 400 సార్లు ఢిల్లీకి పోతా అంటున్న‌డు.. వెళ్లండి.. నిన్ను ఎవ‌రు వ‌ద్ద‌న్న‌రు. బ్ర‌హ్మాండంగా తి...
KTR | ఈ ముఖ్య‌మంత్రిలో అప‌రిచితుడు ఉన్నాడు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..
Top Stories

KTR | ఈ ముఖ్య‌మంత్రిలో అప‌రిచితుడు ఉన్నాడు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతూ అప‌రిచితుడిలా త‌యారైపోయాడ‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌స్టేష‌న్ ప‌నికిరాదు. జీవితంలో అక్క‌డ కూర్చోవాల‌నుకున్నాడు.. కూర్చున్నాడు కాబట్టి కూల్ కావాలి.. ఎందుకింత ఫ్ర‌స్టేష‌నో, ఎందుకింత నిస్పృహ‌నో, ఎందుకింత ఆవేశ‌మో మాకైతే అర్థం కావ‌డం లేదు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడు. మొన్న ర‌వీంద్ర భార‌తిలో మాట్లాడుతూ.. మ‌మ్మ‌ల‌న్ని ఎవ‌రు న‌మ్ముత‌లేడ...
KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్
Top Stories

KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్

KTR: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. కానీ రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాధాకరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో కేటీఆర్ చర్చించారు. రాష్ట్ర బడ్జెట్‌ చూస్తే ఆశ్చర్యమేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శి...
CAG Report | కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
Top Stories

CAG Report | కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చయిందని తెలిపారు. ప్రభుత్వం అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వేస్ అండ్ మీన్స్ అడ్వా...
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
Top Stories

KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్

అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని చెప్పారు. ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మెుదటి సం...
Harish Rao | టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీపై మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు హ‌రీశ్‌రావు కౌంట‌ర్
Top Stories

Harish Rao | టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీపై మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు హ‌రీశ్‌రావు కౌంట‌ర్

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తాము ఒక్క టీచ‌ర్ పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేద‌ని నిరూపించ‌గ‌ల‌వా అని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు హ‌రీశ్ రావు స‌వాల్ విసిరారు. బీఆర్ఎస్ హ‌యాంలో ఒక్క టీచ‌ర్ పోస్టు భ‌ర్తీ జ‌ర‌గ‌లేద‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు స‌త్య‌దూరం మాట‌లు మాట్లాడారు. నేను ఛాలెంజ్ వేస్తున్నా.. బీఆర్‌ఎస్ హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి.. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మరో 18 వేల ఉద్యోగాలు గురుకులాల్లో నియామకాలు చేసినం. 26 వేల టీచర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తే ఒక్క‌టి కూడా భ‌ర్తీ చేయ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు మాట్లాడ‌డం స‌రికాదు....
TG Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌.. కేబినెట్‌లో కొత్తగా నలుగురికే ఛాన్స్‌..?
Top Stories

TG Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌.. కేబినెట్‌లో కొత్తగా నలుగురికే ఛాన్స్‌..?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. కేబినెట్‌ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. కొత్త మంత్రులు ఏప్రిల్‌ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ...
Sunitha Lakshma Reddy | స్పీకర్‌ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Top Stories

Sunitha Lakshma Reddy | స్పీకర్‌ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ప్రశ్నించారు. విషయంపైనే మాట్లాడానుతప్ప ఎక్కడా పరిధి దాటలేదన్నారు. అయినా తనను అలా వినబుద్ధికావడం లేదని ఎలా అంటారన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్‌ ఉపసంహరించుకోవాలన్నారు. శాసనసభలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సభ్యుల హక్క...
OU Circular | ఓయూ సర్క్యులర్ రద్దుకు మద్దతు ఇవ్వండి.. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌కు విజ్ఞ‌ప్తి
Top Stories

OU Circular | ఓయూ సర్క్యులర్ రద్దుకు మద్దతు ఇవ్వండి.. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌కు విజ్ఞ‌ప్తి

ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు. వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్‌లను కలిసి పరిస్థితిని వివరించారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం.. ఓయూ అధికారులతో మాట్లాడాలని ...