Warangalvoice

Top Stories

ఈ దారి.. నరక దారి
Top Stories

ఈ దారి.. నరక దారి

ఈ గుంతల లోతు.. పాలకుల నిర్లక్ష్యమంత!అధ్వానంగా నర్సంపేట -కొత్తగూడెం ప్రధాన రహదారిఎమర్జెన్సీ వాహనాలకు తప్పని ఇక్కట్లుప్రభుత్వాలు మారినా.. మారని దుస్థితి..!అదమరిచి జాలీగా ఆ రోడ్డుపై ప్రయాణించారా? ఇక అంతే సంగతులు.. నరకానికి డైరెక్ట్‌ టికెట్‌ తీసుకున్నట్టే.. ఏళ్ల తరబడిగా ఆ రోడ్డును పట్టించుకున్న వాళ్లు లేరు.. ప్రయాణికుల గోడు విన్నవాళ్లు లేరు.. వరంగల్‌ జిల్లా నర్సంపేట నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రోడ్డుపై గుంతలతో వాహనదారులు నానా యాతన పడుతున్నారు. ఇక ఎమర్జెన్సీ వాహనాల పరిస్థితి అయితే దారుణం. ఇటీవల ఓ అంబులెన్స్‌ దిగబడడంతో వేరే వాహనం తీసుకొచ్చి బయటకు లాగి.. పేషెంట్‌ ను అత్యవసరంగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ వాయిస్‌, ఖానాపూర్‌ వరంగల్‌ వాయిస్‌, ఖానాపూర్‌: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా పల్లెల రూపురేఖలు మాత్రం మారటం లేదు. పల్లె ప్రగతి ...
కేటీఆర్‌ హామీ .. బుట్టదాఖలు
Top Stories

కేటీఆర్‌ హామీ .. బుట్టదాఖలు

రెండు సంవత్సరాలైనా నెరవేరని లక్ష్యంపక్కదారి పట్టిన ప్రత్యేక నిధులుముంపుపై చొరవ చూపని బల్దియాగత నిధులకే మోక్షం లేదు..అదనంగా మరో రూ.250 కోట్ల నిధులంటూ ప్రచారం ‘‘వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో ముంపు సమస్యే ఉండొద్దు.. అందుకు కావాల్సిన శాశ్వత ప్రణాళికలు రూపొందించండి.. ప్రధాన నాలాలను విస్తరించి ఇతరులెవరూ ఆక్రమించకుండా రెండు వైపుల గోడలు కట్టాలి.. ఆక్రమణకు గురైనా నాలాలను క్లియర్‌ చేయండి.. వాటితోనే అసలు సమస్య.. నాలాల ఆక్రమణదారులు ఏ హోదాలో ఉన్నా ఉదాసీనత ప్రదర్శించవద్దు.. అవసరమైతే పోలీసుల ప్రొటెక్షన్‌ తీసుకొని కూల్చివేయండి.. నగరాన్ని ముంపునుంచి రక్షించేందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదు.. ’’అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అక్టోబర్‌ 2020లో ఇచ్చిన హామీని బల్దియా అధికారులు అటకెక్కించారు. మంత్రి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ నగర ప్రజలు ముంపు భయంతో వణికిప...
పట్టు పట్టి.. కొలువు కొట్టు
Top Stories

పట్టు పట్టి.. కొలువు కొట్టు

అంకితభావంతో చదివితేనే అందలంమీ భవిష్యత్‌ కు మీరే మార్గనిర్దేశకులుప్రణాళిక, సమయ పాలన అవసరంరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థ సారథినల్గొండ జిల్లా కేంద్రంలోఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. ప్రణాళికా బద్ధంగా, సమయ పాలన పాటిస్తూ కసిగా కష్టపడితే ప్రభుత్వ కొలువు సాధించడం కష్టమేమి కాదు.. బద్దకం, వాయిదా వేయడం, నిరాశ, , ఆత్మన్యూనతా వంటి లక్షణాలు విడనాడాలి.. పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు నడువాలి’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థ సారథి ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్థ సారథి మాట్లాడుతూ.. బుక్‌ స్టాల్‌ లో కనపడే ప్రతీ పుస్తకం కొనవద్దని, ఒక సబ్జెక్ట్‌ కు ఒకే ప్రామాణిక పుస్తకాన్ని చదివి నోట్స్‌ రాసుకోవాలన్నారు. దాన్ని పదే పదే రివిజన్...
క్యాష్‌లెస్‌ ప్రగతి
Top Stories

క్యాష్‌లెస్‌ ప్రగతి

పైసా ఖర్చులేదు.. పెద్దగా చేసిందేమీ లేదురోజు వారి కార్యక్రమాలకే పట్టణ ప్రగతి కలర్‌డివిజన్‌లలో పేరుకుపోయిన సమస్యలుఇబ్బందులు పడుతున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి గ్రేటర్‌ వరంగల్‌లో అభాసుపాలైంది. 15 రోజులపాటు పట్టణ ప్రగతి అంటూ ఊదర గొట్టిన బల్దియా పాలకులు, అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారడంపై స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. శానిటేషన్‌ సిబ్బంది రోజూవారి నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి అంటూ కలర్‌ ఇచ్చి ప్రజలను పక్కదోవ పట్టించారంటూ మండి పడుతున్నారు. చెత్తను తొలగించడం.. ప్రార్థనా మందిరాలు, రోడ్లను ఊడ్చడం.. కాలువలు శుభ్రం చేయడం.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను సీజ్‌ చేయడమే పట్టణ ప్రగతి అయితే వేలాదిగా ఉన్న బల్దియా సిబ్బంది మిగిలిన రోజుల్లో చేస్తున్న పనులేంటని ప్రశ్నిస్తున్నారు. పనీ, పాటా లేని సిబ్బందికే ప్రతి నెల కోట్ల రూపాయల జీతాలు చెల్...
 ఏజెన్సీలో విద్యా కుసుమం
Top Stories

 ఏజెన్సీలో విద్యా కుసుమం

ఎంబీబీఎస్‌ పట్టా స్వీకరించిన సాయిని స్వప్నిల్‌జన్మనిచ్చిన గడ్డకు సేవ చేయడమే లక్ష్యమని వెల్లడి వరంగల్‌ వాయిస్‌, ములుగు: ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి మెడిసిన్‌ సాధించి, విజయవంతంగా పూర్తిచేశాడు సరస్వతీ పుత్రుడు సాయిని స్వప్నిల్‌. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకారాజుపల్లి గ్రామం సాయిని నరేందర్‌, రోజారమణి ఏకైక పుత్రుడైన సాయిని స్వప్నిల్‌ 2016 ఎంసెట్‌ లో మంచి ర్యాంకు సాధించి తెలంగాణ ఏర్పడ్డాక మొదటి మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్‌ సీటు పొందాడు. ఆరు సంవత్సరాల తన కోర్సు పూర్తిచేసుకుని మంగళవారం మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో సాంస్కృతిక, క్రీడలు, యువజన, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా పట్టా స్వీకరించాడు. ఈ సందర్భంగా స్వప్నిల్‌ మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచే చదువులో చురుకుగా ఉండే వాడినని, కలెక్టర్‌ కావా...
 ‘ప్రగతి’ అయిపాయే.. సమస్యలు తీరకపాయే..!
Top Stories

 ‘ప్రగతి’ అయిపాయే.. సమస్యలు తీరకపాయే..!

మహానగరంలో పట్టణ ప్రగతి అపహాస్యంపలు డివిజన్ల వైపు కన్నెత్తి చూడని మేయర్‌, కమిషనర్‌సమీక్షా సమావేశంలో నిలదీసిన అధికార పార్టీ కార్పొరేటర్లుప్రజల నుంచి వచ్చిన వినతులు 5,960డ్రైన్లు, అంతర్గత రహదారులకు చెందినవే సగం నగరాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నగరంలో అపహాస్యం పాలైంది. పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కార్పొరేటర్‌తో కలిసి మేయర్‌, కమిషనర్లు నగరంలోని అన్ని డివిజన్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు పలు డివిజన్ల వైపు కన్నెత్తికూడా చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రగతిపై బల్దియా ప్రధాన కార్యాలయంలో చివరి రోజు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లే మేయర్‌, కమిషనర్లను నిలదీశారు. ‘‘మా డివిజన్‌కు రండి..సమస్యలను మీకు చూపిస్తాం’’ అంటూ టీఆర్‌ ఎస్‌ కార్పొరేటర్లు గట్టిగానే తమ వాణిని వినిపి...
ముంచుకొస్తున్నకాలం -ముందస్తు చర్యలు శూన్యం
Top Stories

ముంచుకొస్తున్నకాలం -ముందస్తు చర్యలు శూన్యం

ముంపు తప్పదంటున్న నిపుణులు అమలుకు నోచుకోని కేటీఆర్‌ హామీ ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు బల్దియా పాలకవర్గం, అధికారులపై ప్రజల ఆగ్రహం వరంగల్‌ మహా నగరానికి ఈయేడు కూడా ముంపు ప్రమాదం తప్పేలా లేదు. ప్రణాళిక లేని పనులు, పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా నగరాన్ని వరదనీరు మరో మారు ముంచెత్తనుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మానవ తప్పిదంతో కుంటలన్నీ జనావాసాలుగా మారడంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో కుంటలను తలపిస్తున్నాయి. వరుసగా 2020, 2021 సంవత్సరాల్లో నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరంగల్‌ నగరంలో ముంపు సమస్య లేకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ బల్దియా అధికారులు మొద్దు నిద్ర వీడకపోవడం వారి పనితనానికి అద్దం పడుతోంది. ...
పల్లెల్లో మళ్లా ఓట్ల జాతర
Top Stories

పల్లెల్లో మళ్లా ఓట్ల జాతర

త్వరలోనే మినీ ‘పల్లె పోరు’పంచాయతీ ఉప ఎన్నికలకు అంతా సిద్ధంపూర్తయిన పోలింగ్‌ కేంద్రాల ఎంపికఉమ్మడి జిల్లాలో 32 సర్పంచ్‌, 11 ఎంపీటీసీ,237 వార్డు స్థానాలు ఖాళీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా పల్లెల్లో త్వరలో పంచాయతీఉప ఎన్నికల నగరా మోగనుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32 సర్సంచ్‌, 11 ఎంపీటీసీ, 237 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎంపికైన కొందరు మృతి చెందడం, రాజీనామాలు చేయడం, సస్పెండ్‌ కావడం, ఇతర పదవులకు ఎన్నిక కావడం, కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం వంటి కారణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేశారు.-వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్‌ జి...
అధిక సాంద్రత పత్తితో అధిక లాభాలు
Top Stories

అధిక సాంద్రత పత్తితో అధిక లాభాలు

ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేలా రైతులకు అవగాహనఒకేసారి పత్తి సేకరణకు అనుకూలంకూలీల వినియోగం అంతంత మాత్రమేపెట్టుబడి వ్యయం తగ్గి..అధిక దిగుబడికి అవకాశాలు అధికంనష్టాలు తగ్గి లాభాల బాట పట్టనున్న రైతులు వరంగల్‌ వాయిస్‌, భూపాలపల్లి: జయశంకర్‌ జిల్లా రేగొండ మండలంలో రైతులు ఖరీఫ్‌ సీజన్లో ఏటా తెల్ల బంగారం సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రకృతి కల్పిస్తున్న ప్రతికూల పరిస్థితులు, తెగుళ్లు, చీడ పీడల వల్ల పెట్టుబడి పెరిగి, పంట దిగుబడి తగ్గి పోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆ నష్టాలను పూడ్చుకుని, లాభాల బాట పట్టడానికి మార్గం కానరాక దిక్కుతోచని పరిస్థితులను చవిచూస్తున్నారు. ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయంగా ఈ దఫా పత్తి పంటలో వినూత్న ప్రయోగానికి యత్నాలు జరుగుతున్నాయి. సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా అధిక సాంద్రతతో పత్తిని పండిరచడానికి రైతాంగాన్ని ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే అక...
ప్రజలను కలువరు.. సమస్యలపై అడుగరు
Top Stories

ప్రజలను కలువరు.. సమస్యలపై అడుగరు

పట్టణ ప్రగతిలో గోప్యమెందుకో?ఫొటో ఫోజులకే నాయకులు పరిమితంమేయర్‌, కమిషనర్‌లకు ప్రత్యేక షెడ్యూలే లేదుమొక్కు బడిగా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకంమహానగరంలో సమస్యలు బోలెడు మహా నగరంలో ఈనెల 3నుంచి ప్రారంభమైన పట్టణ ప్రగతి మొక్కుబడిగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోజువారీగా నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి బిల్డప్‌ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పట్టణ ప్రగతిలో ప్రముఖంగా పాల్గొనాల్సిన మేయర్‌, కమిషనర్‌లకు ప్రత్యేక షెడ్యూలు లేకపోవడం, వారు ఏరోజు ఏ డివిజన్‌లో పర్యటిస్తారో గోప్యంగా ఉంచడం, అసలు పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా మంజూరైన నిధుల వివరాలను కూడా వెల్లడిరచకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతిలో మేయర్‌, కమిషనర్‌ ఏ సమయంలో ఏ డివిజన్‌లో పర్యటిస్తారో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చేందుకే పట్టణ ప్రగతి...