Warangalvoice

Top Stories

జర జాగ్రత్త..
Top Stories

జర జాగ్రత్త..

అడుగుకోగుంత.. ఆదమరిస్తే తంటావర్షపునీటితో నిండిన గుంతలుమహా నగరంలో రోడ్లపై పొంచి ఉన్న ప్రమాదంచొద్యం చూస్తున్న బల్దియాస్టేషన్‌ రోడ్‌ లో పెద్ద గుంతను పూడ్చిన ట్రాఫిక్‌ పోలీసులు మహా నగర ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఎక్కడ గుంత ఉందో.. అది ఎంత లోతు ఉంటుందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి మరీ దయనీయం. ఆదమరిచి ముందుకుపోతే ఆస్పత్రి పాలుకాక తప్పడం లేదు. ప్రధాన రహదారులపైనున్న గుంతల్లో నిత్యం పదుల సంఖ్యలో వాహనదారులు పడుతున్నా బల్దియా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అయితే వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుంతల్లో కంకర, మట్టి పోస్తూ తమ ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులకు ఉన్న సోయి బల్దియా పాలకులకు లేకుండా పోయిందంటూ బాటసారులు, వాహనదారులు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. ...
ఊరూ వాడ.. వరద
Top Stories

ఊరూ వాడ.. వరద

తగ్గని వాన జోరు..ఎటూ చూసిన నీళ్ల హోరుఇండ్లలోకి వరద నీరులోతట్టు ప్రాంతాలు జలమయం,కొట్టుకపోయిన రోడ్లుభూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అటవీ గ్రామాల జలదిగ్బంధంగోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ వాన జోరు తగ్గడం లేదు.. వరద హోరు ఆగడం లేదు.. చెరువులు మత్తళ్లు దుముకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరంగల్‌ మహా నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కాలనీలు జలమయమయ్యాయి. పలు అటవీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ఉధృతితో రోడ్లు తెగిపోయాయి.. పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.-వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా...
సమస్యలు మమ:
Cultural, Top Stories

సమస్యలు మమ:

‘భద్రకాళి’ సన్నిధిలో అంతా ఆగమాగంసమయపాలన పాటించని సిబ్బందిఇష్టారాజ్యంగా పార్కింగ్‌చెప్పుల స్టాండ్‌ ఉన్నా ఉపయోగమే లేదుప్రసాదాల కోసం ఎండలోనే క్యూవిడిది సౌకర్యాన్ని వినిపించుకోని ఆలయ అధికారులుబిచ్చగాళ్లతో బెంబేలెత్తుతున్న భక్తులు శ్రీ భద్రకాళీ దేవస్థానంలోని అమ్మవారిని తనివితీర దర్శించుకుందామని వచ్చే భక్తులకు ఇక్కడి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయ పరిధిలో లెక్కకు మించి సిబ్బంది ఉన్నా ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇందులో చాలా మంది దేవాదాయ శాఖకు చెందిన వారు కాగా మరి కొందరు కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని పర్యవేక్షించే వారు లేకపోవడంతో అంతా దైవాదీనంగా మారింది. అయితే కొంతమంది సిబ్బంది ఆఫీసుకు వచ్చి అందరికీ అలా కనిపించి రిజిస్టర్‌లో సంతకం పెట్టి తర్వాత సొంత పనులకోసం బయటికి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయంలో పర్యవేక్షణ గాడి...
నాలాలపై నజర్‌
Top Stories

నాలాలపై నజర్‌

నడుం బిగించిన బల్దియాఅడ్డంకుల గుర్తింపునకు నాలుగు ప్రత్యేక బృందాలుఅసంపూర్తి నిర్మాణాలపై కమిషనర్‌ సీరియస్‌‘వరంగల్‌ వాయిస్‌’ కథనాలతో స్పందన నగరం ముంపునకు కారణమవుతున్న నాలాలపై వరంగల్‌ మహా నగరపాలక సంస్థ నజర్‌ పెట్టింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను త్వరితగతిన గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వరద నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుపడుతున్న ఆక్రమణల తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సిద్ధపడుతోంది. ‘వరంగల్‌ వాయిస్‌’ దినపత్రికలో వరుసగా వస్తున్న కథనాలకు బల్దియా కమిషనర్‌ స్పందించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌, ల్యాండ్‌ సర్వే, పోలీస్‌ అధికారులతో కలిపి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం కమిషనర్‌ పి.ప్రావీణ్య ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. అసంపూర్తి నిర్మాణాలపై సీరియస్‌ అయ్యారు. అధికారులంతా సమన్వయంలో పనిచేసి పూర్తి వివరాలను జిల్...
ఇష్టపడి చదివితేనే.. కోరుకున్న కొలువు
Top Stories

ఇష్టపడి చదివితేనే.. కోరుకున్న కొలువు

అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..బట్టీ పట్టొద్దు.. సమగ్ర అధ్యయనం చేయాలిఏకాగ్రతతో చదివితేనే లక్ష్యసాధనసువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దురాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథిఆదిలాబాద్‌లో ఉద్యోగార్థులకు అవగాహన ‘‘తమపై తమకు గట్టి నమ్మకం ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది.. అపోహలు వీడి దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్లిన వారే విజేతలుగా నిలబడుతారు.. దురాలవాట్లకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడిని చిత్తు చేస్తూ సడలని ఏకాగ్రతతో చదివితే కోరుకున్న కొలువు సాధించడం అసాధ్యమేమీ కాదు..’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేశారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో పోటీపరీక్షలపై నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్థసారథి అద్భుతమైన మోటివేషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. పోటీ పరీక్షల్లో...
త్రిపుల్‌ ఆర్‌.. పాటించు .. ఉద్యోగం సాధించు..
Top Stories

త్రిపుల్‌ ఆర్‌.. పాటించు .. ఉద్యోగం సాధించు..

‘‘రీడింగ్ రికార్డ్‌, రివిజన్‌ ’’ తో ప్రిపరేషన్‌ చేయండిఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకెళ్లండి..కష్టపడితే అత్యున్నత ఉద్యోగం మీ సొంతంగ్రూప్‌-1 కొడితే సమాజంలో హోదా, ప్రజా సేవలో తృప్తిసువర్ణావకాశాన్ని యువత వదులుకోవద్దు..రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథిమహబూబ్‌ నగర్‌ లో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం.. కష్టే ఫలి అన్నారు పెద్దలు.. కష్టపడితే సాధించనిది లేదు.. ఆకాశమే హద్దుగా ఆత్మవిశ్వాసంతో అహర్నిషలు కష్టపడితే అత్యున్నత కొలువు మీ సొంతం..’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌ నగర్‌ లో గ్రూప్‌-1, ఎస్సై ఉద్యోగార్థుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. అభ్యర్థులు సిలబస్‌ పై పట్టు పెంచుకుని, ‘‘రీడిరగ్‌, రికార్డ్‌, రివిజన్‌ ‘‘పద్ధతిలో ప్రిపరేషన్‌ కొనసాగించాలన్నారు. సబ్జెక్టును 360 డిగ్రీల కోణంలో ప్రణాళికబద్ధంగా చదవాలన్నా...
ఉద్యోగాల యుగమిది..
Top Stories

ఉద్యోగాల యుగమిది..

కష్టపడితే కొలువుమీదేట్రిపుల్‌ ఆర్‌ ఫాలో కావాలిరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాల యుగం నడుస్తోందని, కష్టపడితే కొలువు కష్టం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థులకు పిలుపినిచ్చారు. గురువారం గ్రూప్‌ 1 ఉద్యోగార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.. రీడ్‌, రిమెంబర్‌, రివైజ్డ్‌ (ట్రిపుల్‌ ఆర్‌) సూత్రాలను గుర్తుంచుకోవాలన్నారు. సిలబస్‌ పై స్పష్టత పెంచుకొని ప్రిపరేషన్‌ కొనసాగించాలన్నారు. కష్టపడినోళ్లకే కొలువు దక్కుతుందన్నారు. ఉద్యోగార్థి సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి కోరుకున్న కొలువుకు దగ్గర కావాలన్నారు. ప్రస్తుతం కొలువులు ఎక్కువ ఉండడంతో పోటీ నిష్పత్తి తక్కువ ఉంటుందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిచ్‌పల్లి (నిజామాబాద్‌) : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంల...
కష్టపడితే కొలువు నీదే
Top Stories

కష్టపడితే కొలువు నీదే

అంబేద్కర్‌ భవన్‌ లో గ్రూప్‌-1 అభ్యర్థులకు అవగాహన సదస్సుకృషి, పట్టుదల తోడైతే గ్రూప్‌ -1 నీ సొంతంబేసిక్స్‌ పై పట్టు పెంచుకోవాలి..ఏకాగ్రతతో చదవి.. పునశ్చరణ చేసుకోవాలిసోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి..రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ‘‘ఒక సంవత్సరం పాటు పట్టు సడలకుండా చదివితే.. భవిష్యత్‌ బంగారుమయం అవుతుంది.. గ్రూప్‌-1 లాంటి ఉన్నతోద్యోగం సాధిస్తే మీ జీవితమే మారిపోతుంది.. అందుకే ప్రిపరేషన్‌ లో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. బేసిక్స్‌, కాన్సెప్ట్‌ పై పట్టు సాధించడంతో పాటు ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి. గ్రూప్‌-1లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండడం సువర్ణావకాశం.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థులకు సూచించారు. మంగళవారం హనుమకొండ అంబేద్కర్‌ భవన్‌ లో గ్రూప్‌-1 అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ గె...
మీ భవిష్యత్‌ మీ చేతుల్లోనే..
Top Stories

మీ భవిష్యత్‌ మీ చేతుల్లోనే..

ఏకాగ్రతతో చదివి కొలువు కొట్టండిఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనివ్వొద్దుచదువుపైనే దృష్టి సారించండి.. అనవసర విషయాల్ని పట్టించుకోవద్దుఇంటర్వ్యూ విధానం రద్దుతో అపోహలకు చెక్‌ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోండిఫ్రీ కోచింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మార్గనిర్ధేశనం వరంగల్‌ వాయిస్‌, నిజామాబాద్‌: ‘‘మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుంది’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి స్పష్టం చేశారు. ఏకాగ్రతతో చదువుతూ, పక్కా ప్రణాళికతో సన్నద్ధమైతే కోరుకున్న ప్రభుత్వ కొలువును దక్కించుకోవడం కష్టమైన పనేమీ కాదన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో పోలీస్‌ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఫ్రీ కోచింగ్‌ అందిస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్...
ఈ కొలువు మాకొద్దు
Top Stories

ఈ కొలువు మాకొద్దు

అరకొర వేతనం.. వెట్టిచాకిరీతో సతమతంనెరవేరని పాలకుల హామీలుపట్టించుకోని ప్రభుత్వం9 నుంచి వీఆర్‌ఏల నిరసన బాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం.. వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటాం..అర్హతగల వారందరికీ ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు పే స్కేల్‌ వర్తింపజేస్తామంటూ 2020 సెప్టెంబర్‌ 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతంతో, వీఆర్‌ఏలు వెట్టి చాకిరి చేస్తున్నారు. ఆరు నెలలుగా పలుమార్లు నిరసన తెలిపినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 9నుంచి సమ్మెబాట పడుతున్నారు. -వరంగల్‌ వాయిస్‌, మహబూబాబాద్‌ వరంగల్‌ వాయిస్‌, మహబూబాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మంది వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకు)లు ఉన్నారు. వీరందరికీ న్యాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్...