6AugNo Comments
నేనే సుప్రీమ్
బల్దియాలో నేను చెప్పిందే వేదం
ఇతరులెవరూ ఎదగకుండా పక్కా ప్లాన్
డిప్యూటీ మేయర్పై చిన్నచూపు
సంవత్సరం దాటినా కారు, క్యాంపు క్లర్కే లేరు
నేటికీ స్టాండింగ్ కమిటీ ఊసే లేదు
ఫ్లోర్ లీడర్లు లేరు.. ఆయా పార్టీలకు గదుల కేటాయింపూ లేదు..
రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత సీనియర్లు ఎవరైనా ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ కావాలనుకోవడం కామన్. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ రెండు కుదరకపోతే ఉన్న నెక్ట్స్ ఆప్షనే స్టాండింగ్ కమిటీ మెంబర్. మిగిలిన కార్పొరేటర్ల తాపత్రయం అంతా దానిపైనే ఉంటుంది. కాని వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు. పాలక వర్గం ఏర్పడి సంవత్సరంన్నర గడిచినా నేటికీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుపై ఊసే లేదు. బల్దియాలో నేనే సుప్రీమ్..నేను చెప్పిందే వే...
4AugNo Comments
నిరంతర సాధనే – విజయమార్గం
ప్రణాళికతో చదివి విజేతగా నిలువండిపట్టుదలతో ఇష్టపడి చదవాలిచదువుతోనే ఉజ్వల భవిష్యత్తురాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథికామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు
‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రతీ నిమిషం కీలకమేనని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయానికి దగ్గరవుతారని సూచించారు. అంకిత భావంతో చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను ఉత్సాహపరిచారు.
వ...
3AugNo Comments
పాదయాత్రల జోరు
సెంటిమెంటుగా భావిస్తున్న నేతలు
ఎన్టీఆర్తో శ్రీకారం.. వైఎస్ తో వైభవం
రాష్ట్రంలో కొనసాగుతున్న వైఎస్ శర్మిల, ప్రవీణ్ కుమార్ పాదయాత్ర
అత్యధిక రోజులు పాదయాత్ర చేసిన జగన్
నేడు యాదాద్రిలో మూడో విడత ప్రారంభించిన బండి సంజయ్
రాష్ట్రంలో పాదయాత్రల జోరు కొనసాగుతోంది. అధికారమే లక్ష్యంగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. పాదయాత్రలు చేయడం ద్వారా పవర్లోకి రావచ్చని భావిస్తున్నారు. గతంలో ఇది వర్కవుట్ కావడంతో నేటి నేతలు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్టీరామారావు పాదయాత్ర చేపట్టడంద్వారా ప్రజలకు మరింత చేరువై అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే ఒరవడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించి ముఖ్యమంత్రి అయ్యా...
3AugNo Comments
హాస్టల్ లో ఫైటింగ్
ముగ్గురు విద్యార్థినులకు గాయాలుకారణాలు బయటకు పొక్కనివ్వని సిబ్బందితల్లిదండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి
వరంగల్ వాయిస్, వరంగల్ టౌన్: నగరంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ శంభునిపేటలో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థునులకు గొంతుపై కోసినట్లు గాయాలు కావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈనెల 24న సంఘటన జరిగినా గురుకుల సిబ్బంది దీనిని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురుకుల సిబ్బందే ట్రీట్మెంట్ ఇప్పించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సోమవారం బాధిత విద్యార్థునుల తల్లిదండ్రులు గురుకులం ఎదుట ఆందోళనకు దిగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా గురుకుల సిబ్బంది గేటు వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవ...
3AugNo Comments
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం
వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో వారిని ప్రోత్సహించే విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ శిబిరం ముందుగా రక్తదానం చేసి యువతకు అదర్శంగా నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ...




