Warangalvoice

Top Stories

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్‌
Telangana, Top Stories

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్‌

రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం మన బాధ్యత గాంధీ జయంతి సభలో స్పీకర్‌ పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని గవర్నర్‌ తీరుపై మండలి ఛైర్మన్‌ గుత్తి సుకేదంర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డలు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్‌ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభలో వారు నివాళి అర్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యంగాబద్దంగా వ్యవహరిం చాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్‌ తమిళి సై తీరుపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పందించారు. అయితే అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాం...
సరదాగా సాగిన సంక్రాంతి వేడుకలు
Top Stories

సరదాగా సాగిన సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి అంటేనే సరదా అన్న రీతిలో పండుగ సాగింది. ప్రజలంతా అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లి పండగ చేసుకున్నారు. గత మూడేళ్లుగా కరోనా భయాల మధ్య సాగిన పండగ ఇప్పుడు సరదాగా సాగింది. సంస్కృతిని ప్రతిబింబించేవి పండుగలే. ఈ పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలుపులు మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగం. తెలుగునాట సంక్రాంతిని ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. తెలుగునాట సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌, కేరళలో ’ఓణం’ ఇటువంటి పండుగే. కన్నడ, మరాఠీ ప్రజలు కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది పంటల పండుగ. పంట రైతు ఇంటికి చేరి ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడే సమయం ఇది. మొదటిరోజు భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, పాడిపంటలు, పిండి వంటలు మాత్రమే కాదు... రంగురంగుల ముగ్గులతో, పువ్వులు అలంకరించిన గొబ్బెమ్మలతో, హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలు, పతంగాల ...
కేంద్ర మాజీమంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత
Top Stories

కేంద్ర మాజీమంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని మోడీ తదితరులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారన్న కెసిఆర్‌ వరంగల్ వాయిస్,పాట్నా: మాజీ కేంద్ర మంత్రి శరద్‌ యాదవ్‌ (75) గురువారం రాత్రి కన్ను మూశారు. వయోభారంతో బాధ పడుతున్న శరద్‌ యాదవ్‌ను చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు గుర్‌గ్రామ్‌లోని ఫొర్టిస్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తు న్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో మరణించి నట్లు కూతురు సుభాషిణి శరద్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. జనతాదళ్‌ యునైటెడ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న శరద్‌ యాదవ్‌ ఏడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీని స్థాపించారు. 1947 జూలై 1న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో శరద్‌ యాదవ్‌ జన్మించారు. బీహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తదితరులతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. 1989కి ముందు విశ్వనాథ్‌ ...
గంగా క్రూయిజ్‌కు ప్రధాని మోడీ పచ్చజెండా
Top Stories

గంగా క్రూయిజ్‌కు ప్రధాని మోడీ పచ్చజెండా

వారణాసి నుంచి దిబ్రూగఢ్‌ వరకు 3200 కివిూ ప్రయాణం అత్యంత లగ్జరీ క్రూయిజ్‌గా పలుసౌకర్యాలు వరంగల్ వాయిస్,న్యూఢలిలీ: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ క్రూయిజ్‌ ప్రారంభమయ్యింది. ఎంవీ గంగా విలాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్‌ సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. భారత్‌లో విూరు ఊహించగలిగేవన్నీ ఉన్నాయని, ఇది విూ ఊహకు మించినదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. భారతదేశాన్ని మాటల్లో నిర్వచించలేమన్న ఆయన... దీన్ని మన మనసు ద్వారానే అనుభూతి చెందగలమని పర్యాటకులకు ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఇతర కేంద్ర మంత్రులు, పలు శాఖల సీనియర్‌ అధికా...
ఎన్టీఆర్‌ అంటేనే ఓ ప్రభంజనం
Top Stories

ఎన్టీఆర్‌ అంటేనే ఓ ప్రభంజనం

విప్లవాత్మక రాజకీయాలకు శ్రీకారం చంద్రబాబు దూరదృష్టితో అభివృద్దికి పెద్దపీట జగన్‌ పాలనలో దోచుకు తింటున్నారు ఆర్థిక వ్యవస్థను దివాళా తీసి అప్రతిష్ట పాల్చేసారు మండిపడ్డ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వరంగల్ వాయిస్,అనంతపురం: దివంగత ఎన్టీఆర్‌ ప్రభంజనం సృష్టించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తే..ఆయన వారసుడిగా చంద్రబాబు ఉమ్మడి ఎపిని ఎంతో అభివృద్ది చేశారని అన్నారు. తెలుగువేశం పార్టీ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిందన్నారు. చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే..జగన్‌ ధనయజ్ఞం చేస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. రాష్టాన్న్రి ఆర్థికంగా దివాళా తీసి నాశనం చేశారని అన్నారు. మద్యనిషేధం కాస్తా కాసులవేట పథకంగా మారింద న్నారు. ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఇకపోతే అభివృద్ది ఆగిందని అన్నారు. చంద్రబాబు హయాంలో రాయలసీమకు నీటి తరలింపు కోసం ము...
ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి…..
Top Stories

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి…..

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 13నుండి ఉగాది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి
Telangana, Today_banner, Top Stories

సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి

ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి.. ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు.. లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన జీవితంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ.. విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. పేద విద్యార్థులు కుటుంబ పరిస్థితులను తలుచుకుని కుమిలిపోవద్దని, లక్ష్యాన్ని ప్రేమించి కసితో, పట్టుదలతో చదివి గెలుపు బావుటా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి ఒక సృష్టికర్త, ఒక ఆవిష్...
Top Stories

డోర్నకల్ యాదవుల్లో ముసలం

సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గొర్రెల పెంపకదారులు కొందరితో కలిసి కలిసి బుధవారం పశు వైద్యుడు సురేష్ కు వినతి పత్రం అందించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో సందేహాలను డాక్టర్ ను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై రికార్డైన వీడియోను కొందరూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై కేశబోయిన మల్లేశం ఘాటుగా స్పందించారు. డోర్నకల్ మండల గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ పదవీ కాలం ముగిసిందని, య...