Warangalvoice

Telangana

తెలంగాణలో అద్భుత ప్రగతి
Political, Telangana, Top Stories

తెలంగాణలో అద్భుత ప్రగతి

అన్నిరంగాల్లోనూ గణనీయమైన ప్రగతి విద్యుత్‌, తాగు,సాగునీటి రంగాల్లో విప్లవం దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌ పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ గ్రామాలు అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి కెసిఆర్‌ దక్షతకు తెలంగాణ సర్వతోముఖాభివృద్ది అసెంబ్లీ భయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై ప్రసంగం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన దక్షత, ప్రజా ప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిరదని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ...
దేశంలో ఆర్థికాభివృద్ది కన్నా రాజకరీయాలకే ప్రాధాన్యం
Telangana, Top Stories

దేశంలో ఆర్థికాభివృద్ది కన్నా రాజకరీయాలకే ప్రాధాన్యం

ఆర్థిక అభివృద్దిపై దృష్టి సారిస్తే నంబర్‌ వన్‌ స్థాయికి చేరుతాం ’డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అంశంపై నిర్వహించిన సదస్సులో కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారని మంతరి కెటిఆర్‌ అన్నారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడిరచారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి ఎందుకు రా...
తెలంగాణలో వేగవంతమైన ప్రగతి
Political, Telangana, Top Stories

తెలంగాణలో వేగవంతమైన ప్రగతి

కెసిఆర్‌ జాతీయ రాజకీయాలపై సానుకూలత ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత విధానంలో ముందుకు సాగితే మరో వందేళ్లయినా అభివృద్ధి సాధించమన్న ప్రకటన ఆలోచింపచేసేదిగా ఉంది. తాజా బడ్జెట్‌ చూస్తుంటే కెసిఆర్‌ ప్రకటన అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. నిజానికి దేశాన్ని..ఇతర రాష్టాల్రను పోల్చిచూస్తే తెలంగాణలో తెలంగాణలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. సాగునీటి రంగంతో పాటు విద్యుత్‌ రంగంలో గణనీయమైన మార్పలు చూస్తున్నాం. పాఠశాలల గతిని మారుస్తున్నారు. దేశానికి కొత్త తరహా రాజకీయం అవసరమని.. ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా మన రాజ్యాంగం ద్వారా పేదలు, అతిపేదలు, ప్రజలకు మేలు కలగడం లేదు. కేవలం రాజకీయ వ్యవస్థమాత్రమే బలోప...
మరోమారు ఆధ్యాత్మిక పరిమళాలు
Telangana

మరోమారు ఆధ్యాత్మిక పరిమళాలు

  ముచ్చింతల్‌లో పదిరోజుల పాటు ఉత్సవాలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ వద్ద ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ గతేడాది వైభవంగా సాగింది. అదే స్ఫూర్తితో చినజీయర్‌ స్వామి ఇప్పుడు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇది దేశానికి,ప్రంపచానికి, మనకూ గర్వకారణం. దాదాపు పదిరోజుల పాటు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగనుంది. ఫిబ్రవరి 2 గగురువారం నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడాది కాలంగా సమతామూర్తి ప్రాంతం ఇప్పుడు ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో రామనుజాచార్యుల వారిది ఖచ్చితంగా ప్రత్యేక స్థానమే. వెయ్యేళ్ల క్రితం అంటే... దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యులు.. వాళ్లను అర్చకులుగానూ మార్చారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. నారాణమంత్రాన్ని అందరికీ బహిరంగగంగా ఉపదేశించారు. ఆయన ఆనాడు వేళ్లూనుకున్న వర్ణవ్య...
మారుతున్న బడుల రూపురేఖలు
Telangana, Top Stories

మారుతున్న బడుల రూపురేఖలు

రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను బాగుచేశాం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మన ఊరు/బస్తీ`మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిందని తెలిపారు. మన ఊరు/బస్తీ`మన బడి మొదటి దశలో భాగంగా రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను మెరుగు పరిచామన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌, కంటోన్మెట్‌ నియోజకవర్గాల్లో మన బస్తీ`మన బడి నిధులతో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని 26,095 సర్కార్‌ బడుల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. నాణ్యమైన బోధన, భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత...
సాధుసంతులు రావడం ఆనందందాయకం
Telangana, Top Stories

సాధుసంతులు రావడం ఆనందందాయకం

నందిపేట్‌ మహాసభల్లో కవిత వెల్లడి కెసిఆర్‌ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేశారన్న జీవన్‌ రెడ్డి వరంగల్ వాయిస్, నిజామాబాద్‌:నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్‌ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదారేశ్వర ఆలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. 34 ఏండ్ల క్రితం సాధు పరిషత్‌ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ జరగటం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్మూర్‌ కు ప్రత్యేక చరిత్ర ఉందన్న కవిత... నవనాధ సాధుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతం నవ సిద్ధుల గుట్ట అని చెప్పారు. దేశవ్యాప్తంగా గా ఉన్న సనాతన ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడు కున్నందునే దేశం గొప్ప స్థాయిలో ఉందని గర్వంగా చెప్పారు. వితండవాదాలను ఎదుర్కొంటూ మన ధర్మాన్ని కాపాడుతున్నామంటే అది సాదు సంతుల గొప్పతనమని ప్రశంసించారు. తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని...
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్‌
Telangana, Top Stories

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్‌

రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం మన బాధ్యత గాంధీ జయంతి సభలో స్పీకర్‌ పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని గవర్నర్‌ తీరుపై మండలి ఛైర్మన్‌ గుత్తి సుకేదంర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డలు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్‌ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభలో వారు నివాళి అర్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యంగాబద్దంగా వ్యవహరిం చాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్‌ తమిళి సై తీరుపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పందించారు. అయితే అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాం...
Cultural, District News, Telangana

అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు

రథసప్తమి జనవరి 28న సూర్యుడుదయించే తూర్పు దిక్కు అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలు.కోటి సూర్యమండల మధ్యస్థమైన మహాత్రిపురసుందరీదేవి తన మూల స్థానాన్ని సూర్యుడియందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంతశక్తి భాండాగారం. ఇంతటి పౌరాణిక, వైజ్ఞాజనిక ప్రాభవంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది. కనుకనే రథసప్తమి పర్వదినమైంది. మాఘ సప్తమి తిథి నుండి సూర్య కిరణాలు వేడిని, వెలుగును, శక్తినీ, ధాతుపుష్టినీ మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు అంతరంగ దర్శనాన్ని వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను జాతి, మత, వర్గ, వర్ణనాతీతమైన స్థాయిలో ప్రసరించే రథసప్తమి, సూర్యోపాసనలో ఒక మహత్తరమైన భూమిక. ఈ క్షణం నుండీ జీవుడి ప్రయాణాన్ని వడి వడిగా సాగించే మహాబోధక శక్తి అనుభవమౌతుంది. అవిద్య, అనాచారం, అస్పష్టత, అహంకారం అనబడే చీకటిని నశింపజేసే వినాశక శక్తీ, దేహ, మనో బుద్ధులను వికాసమానం చేయగల శక్తి సూర్య కిరణాల...
నేడు ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ యుద్దభేరీ
Political, Telangana

నేడు ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ యుద్దభేరీ

బిజెపి లక్ష్యంగా సమరశంఖం పూరించనున్న కెసిఆర్‌ బిజెపికి ప్రత్యామ్నాయం చూపే దిశగా బిఆర్‌ఎస్‌ అడుగు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ తొలి బహిరంగసభకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 18న బుధవారం సాయంత్రం జరిగే సభతో బిజెపికి సవాల్‌ విసిరేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ రంగం సిద్దం చేసుకున్నారు. 9 రాష్టాల్ల్రో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కెసిఆర్‌ అవినీతి పాలన అంటూ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో అధికారం తమదే అని ప్రకటించుకుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపిని చెండాడడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్‌ తొలి అడుగు ఖమ్మం నుంచి వేయబోతోంది. బిజెపికి కెసిఆర్‌ సవాల్‌ విసరబోతున్నారు. అలాగే దేశంలో బిజెపిని ఎదుర్కొనేందుకు వివిధ ప్రాంతీయపార్టీలతో కలసి కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకుని వెల్లేందుకు పక్కా వ్యూహం సిద్దం చేసుకున్నారు. తెలంగాణలో బిజెపిని చా...
చురుకుగా నాగోబా జాతర పనులు
Telangana

చురుకుగా నాగోబా జాతర పనులు

గంగాజలం కోసం మొస్రం వంశస్థుల యాత్ర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వరంగల్ వాయిస్,ఆదిలాబాద్‌: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతరకు మెస్రం వంశస్తులు అంతా సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం అట్టహాసంగా ఆలయ ప్రారంభోత్సవ పూజలు ఇప్పటికీ ప్రారంభించారు. ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబాకు మెస్రం వంశస్థులు 5 కోట్లతో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ పూజలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం, దేవాలయ పునరుద్ధరణ, మండప ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఏళ్ల నాటి కళ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసిన నిధులతో నాగోబా ఆలయం సౌకర్యాలతో కళకళాడనుంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మెస్రం వంశస్థుల సమక్షంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, ఆయన భార్య లక్ష్మి నవగ్రహ పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం నుంచి తీసుకువచ్చిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను, ఆ...