Warangalvoice

Political

Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్
Political

Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్

Seethakka criticizes BRS and BJP: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి సీతక్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ఎంపీలు డుమ్మాకొట్టారు. దీనిపై సీతక్క స్పందించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ఎంపీలు హాజరుకాకపోవడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అని మరోసారి రుజువైందన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారు కేంద్రంపై పోరాటం అంటే సమయానికి ఎగ్గొడతారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. అందుకే అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రాలేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పదే పదే కోరే బీఆర్ఎస్ ఈరోజు...
RS Praveen Kumar | రెండు గంట‌ల్లో ఆరు సార్లు క‌రెంట్ క‌ట్.. సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్
Political

RS Praveen Kumar | రెండు గంట‌ల్లో ఆరు సార్లు క‌రెంట్ క‌ట్.. సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్

RS Praveen Kumar | రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట క‌రెంట్ కోత‌లు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంట‌ల త‌ర‌బ‌డి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతోంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట క‌రెంట్ కోత‌లు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంట‌ల త‌ర‌బ‌డి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతోంది. ఈ కార‌ణంగా అటు అన్న‌దాత‌లు, ఇటు పరిశ్ర‌మ‌ల వారితో పాటు సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌రెంట్ కోత‌ల‌పై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో నేనుండే బండ్లగూడ ఏరియాలో రెండు గంటల్లో ఆరు (6) సార్లు కరెంటు పోయింది!! రేవంత్ గారు.. మీరు కోతలు-ఎగవేతల సీఎం కాకపోతే మరేంది? అని ప్ర‌శ్నించారు. మీ పాలనంతా అంధకారమే అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శించార...
Rahul Gandhi | ఆయన కాంగ్రెస్‌ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్‌ ధారావి పర్యటనపై విమర్శలు
Political

Rahul Gandhi | ఆయన కాంగ్రెస్‌ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్‌ ధారావి పర్యటనపై విమర్శలు

Rahul Gandhi | కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే. వరంగల్ వాయిస్, ధారావి : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ ధారావి  పర్యటనపై శివసేన నాయకుడు  సంజయ్‌ నిరుపమ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఓ కాంగ్రెస్‌ నాయకుడిగా కాకుండా యూట్యూబర్‌గా ఆ ప్రదేశాన్ని సందర్శించారంటూ వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ ముంబైకి కాంగ్రెస్‌ నాయకుడిగా రాలేదు. ఓ యూట్యూబర్‌గా వచ్చి ధారావిని సందర్శించారు. అక్కడ వీడియోలు తీసుకొని వెళ్లిపోయారు’ అంటూ వ్యాఖ్యానించారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ స్థానిక నేతలను కలవకుండానే రాహుల్ తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు. ‘ముంబై కాంగ్రెస్‌ పరిస్థి...
Harish Rao | ఏపీ జ‌ల దోపిడీపై రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలి : హ‌రీశ్‌రావు
Political

Harish Rao | ఏపీ జ‌ల దోపిడీపై రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలి : హ‌రీశ్‌రావు

Harish Rao | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జ‌ల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సూచించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జ‌ల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సూచించారు. బనకచర్ల ద్వారా 200 టీఏంసీల కృష్ణా నీళ్ల తరలింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వ‌హిస్తున్నార‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. బనకచర్ల ద్వారా గోదావరి వరద జలాలనే తీసుకువెళ్తున్నాం, తెలంగాణకు నష్టం లేదు అని ఏపీ నీళ్ల మంత్రి అంటే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మౌనం వ‌హించ‌డం వెనుక అంత‌ర్య‌మేంట‌ని ప్ర‌శ్నించారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉ...
Harish Rao | ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తెర‌వాలి.. లేదంటే చ‌రిత్ర క్ష‌మించ‌దు : హ‌రీశ్‌రావు
Political

Harish Rao | ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తెర‌వాలి.. లేదంటే చ‌రిత్ర క్ష‌మించ‌దు : హ‌రీశ్‌రావు

Harish Rao | కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, సిద్దిపేట : కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవండి.. లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును హరీష్ రావు సంద‌ర్శించారు. ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్‌లోకి కాలేశ్వరం పంప్ హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు. సిద్దిపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పంట సాగు అవుత...
Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు.. మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Political

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు.. మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆయ‌న పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడు.. మరి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్ర‌శ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా...
Minister Seethakka: తీన్మార్ మల్లన్నది ఆ స్థాయి కాదు.. మంత్రి సీతక్క ఫైర్
Political

Minister Seethakka: తీన్మార్ మల్లన్నది ఆ స్థాయి కాదు.. మంత్రి సీతక్క ఫైర్

Minister Seethakka: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వరంగల్ వాయిస్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని.. అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి మల్లన్నది కాదని చెప్పారు. ...
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి సైతం ఉరేసుకునే ప‌రిస్థితి : హ‌రీశ్‌రావు
Political

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి సైతం ఉరేసుకునే ప‌రిస్థితి : హ‌రీశ్‌రావు

Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. భూముల వేలంపై మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొన్నది అని విమ‌ర్శించారు. ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. తాము అధిక...
Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Political

Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు నుంచి త‌మ‌కు నోటీసులు రాలేద‌ని ప్ర‌తివాదుల త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. ప్ర‌తివాదుల వాద‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, జ‌స్టిస్ అగ‌స్టిన్ జార్జ్ ధ‌ర్మాస‌నం.. రాష్ట్ర ప్ర‌భుత్వం, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి స‌హా ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు జారీ చేసింది. పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25వ తేదీకి ధ‌ర్మాస‌నం వాయిదా వేసిం...
Sabitha Indra Reddy | ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి సెటైర్లు
Political

Sabitha Indra Reddy | ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి సెటైర్లు

 మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను సోమవారం అందజేశారు. వరంగల్ వాయిస్, బడంపేట : ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ డబ్బులు వస్తాయనే ఆశతో అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారని అన్నారు. సకాలంలో చెక్కులు అందజేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం...