Warangalvoice

Political

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
District News, Mahabubabad, Political

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకా...
ఈడీ పేరుతో కక్ష సాధింపులా?
Political

ఈడీ పేరుతో కక్ష సాధింపులా?

మచ్చలేని నేతలను ఇబ్బందులు పెడుతారా..కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు..కాంగ్రెస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయినికాజీపేట చౌరస్తాలో రాస్తారోకో వరంగల్ వాయిస్, కాజీపేట: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీపై మోడీ ప్రభుత్వం ఈడీ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దానికి నిరసనగా శుక్రవారం కాజీపేట చౌరస్తాలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మచ్చలేని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ దర్యాప్తు పేరుతో ఎంక్వయిరీ చేయాలని పిలిపించి వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై మచ్చ వేసే విధంగా ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదలప...
మోడీ రాకతో పెరిగిన పొలిటికల్‌ హీట్‌
Political

మోడీ రాకతో పెరిగిన పొలిటికల్‌ హీట్‌

మరోమారు పరస్పర ఆరోపణలతో వేడెక్కుతున్న రాజకీయం సర్వత్రా ఇప్పుడు రాజకీయంగా ఇదే చర్చ వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పుడు బిజెపి కార్యవర్గ సమావేశాలు, మోడీ పర్యటన, ప్రసంగం,కెసిఆర్‌ వ్యవహార శైలిపైనే పెద్దగా చర్చ సాగుతోంది. ఇంతగా పరస్పరం శతృవులుగా మారిన పరిణామాలపైనా చర్చించకుంటున్నారు. అదేపనిగా కేంద్రాన్ని, మోడీని తిడుతున్న టిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడుతున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. మోడీ తెలంగాణకు ఏం చేశారనే వారు కూడా ఉన్నారు.అయితే మోడీ మాత్రం ఇటీవలి తన పర్యటనలో అందరితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జపించి కేసీఆర్‌ వ్యూహానికి చిక్కని మోడీ.. తన బలగాన్ని బలిమిని ప్రదర్శించి టీఆరెస్‌ను హడలెత్తించడం లో మోడీ సక్సెస్‌ అయ్యారని కూడా అంటున్నారు. .ప్రధాని మోడీ హైదరాబాద్‌ రాకను టీఆరెస్సే అనవసరంగా హైప్‌ క్రియేట్‌ చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.మోడీ రాక.. ఇటు టీఆరెస్‌లో అటు బీజేపీలో...
ఎరుపెక్కిన కడవెండి
Political

ఎరుపెక్కిన కడవెండి

ఘనంగా దొడ్డి కొమురయ్య76వ వర్ధంతిదొడ్డి కొమరయ్య స్ఫూర్తినిఆదర్శంగా తీసుకోవాలినివాళులర్పించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వరంగల్‌ వాయిస్‌, దేవరుప్పుల : చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కొనియాడారు. సోమవారం దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని అమరుల అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి సీపీఐ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి దొడ్డి కొమురయ్య స్థూపానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం దొడ్డి కొమురయ్య స్మారక భవనంలో ఏర్పాటు భవనంలో మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా కె.నారాయణ పాల్గొని మాట్లాడుతూ.. నిజాం సర్కారు హయాంలో విస్నూర్‌ కేంద్రంగా దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి అరవ్కె గ్రామాలపై ఆధిపత్యం నడుస్తుండగా ఆయన తల్లి...
అందరి చూపు హైదరాబాద్‌ వైపు..
Political

అందరి చూపు హైదరాబాద్‌ వైపు..

బీజేపీ జాతీయ తీర్మానాలు,మోడీ సభపై ఆసక్తినిశితంగా పరిశీలిస్తున్నప్రత్యర్థి పార్టీలుప్రధాన సమావేశాల హాల్‌కు కాకతీయ ప్రాంగణంగా పేరుబస ప్రాంతానికి సమ్మక్క, సారలక్క నిలయంసెంటిమెంట్‌గా మారుతున్న తెలంగాణ భారతీయ జనతాపార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను దేశంలోని అన్ని పార్టీలతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన అతిరథ మహారథులందరూ పాల్గొననున్న ఈ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. దీనికితోడు మోడీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఎలాంటి కీలక అంశాలను ప్రస్తావిస్తారన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మోడీ సభ సక్సెస్‌ కావడంతోపాటు అన్ని విఘ్నాలు తొలగి పోవాలని కోరుతూ వరంగల్‌ ...
హంటర్‌ రోడ్డులో.. డిష్యుం.. డిష్యుం
Political

హంటర్‌ రోడ్డులో.. డిష్యుం.. డిష్యుం

బీజేపీ, కాంగ్రెస్‌ లీడర్లు తన్నుకున్నరురణరంగంగా మారిన బీజేపీ ఆఫీస్‌ ఏరియాఅడ్డుకున్న పోలీసులు.. ఒకరికి గాయాలు జాతీయ పార్టీలు అనేది మరిచారు.. వీధి రౌడీల్లా రోడ్డు మీదే తన్నుకున్నారు.. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ తిట్టుకున్నారు.. కర్రలతో ఒకరిపై ఒకరు దూకారు.. వాహనాలను ధ్వంసం చేశారు.. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి. శుక్రవారం హనుమకొండ హంటర్‌ రోడ్డు బీజేపీ ఆఫీస్‌ ఏరియా అంతా రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తూ.. మాటామాటా పెరిగి ఫైటింగ్‌ కు దారితీసింది. చివరకు పోలీసులు అందరికీ నచ్చజెప్పి గొడవ సద్దుమణిగింపజేశారు. - వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ : భారతీయ జన...
సత్తా చాటేందుకు ‘కాషాయ’ కసరత్తు
Political

సత్తా చాటేందుకు ‘కాషాయ’ కసరత్తు

మోదీ బహిరంగ సభకు పక్కా స్కెచ్‌ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 15వేల మందివరంగల్‌ నుంచి ప్రత్యేక రైలుఖమ్మం, మహబూబాబాద్‌ మీదుగా మరో రైలుబూత్‌ స్థాయి నేతలకే బాధ్యతలుమూడు రోజుల ముందుగానే పార్టీ మోర్చాలతో సమావేశం తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర రాజధానిలో నిర్వహించేలా పక్కా ప్లాన్‌ చేశారు. పనిలోపనిగా ప్రధాని మోదీ చరిష్మాను ఉపయోగించి తెలంగాణలో పార్టీ పుంజుకునేలా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభ ద్వారా పార్టీ సత్తా చాటేలా స్కెచ్‌ వేశారు. బహిరంగ సభకు లక్షలాదిగా జనాన్ని తరలించడం ద్వారా బీజేపీ సత్తాను ఇతర పార్టీలకు తెలియజెప్పాలని భావిస్తున్నారు. సమావేశానికి జనాన్ని తరలించేందుకు అన్ని జిల్లాలనుంచి ప్ర...
పనితీరు మార్చుకోండి..
Political

పనితీరు మార్చుకోండి..

వివాదాస్పద ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ వార్నింగ్‌12 స్థానాల్లో విజయం సాధించేలా పక్కా ప్లాన్‌త్వరలో నియోజకవర్గానికో ఇన్‌చార్జి..పార్టీ సీనియర్‌ నేతలకు బాధ్యతలు నాయకులను గాడిలో పెట్టే పనిలో జిల్లా అధ్యక్షులు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లోని 12 స్థానాలకు గానూ 8 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా, 2018 ఎన్నికల్లో 10మంది గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచినప్పటికీ తర్వాత టీఆర్‌ ఎస్‌లో చేరడంతో వారి సంఖ్య 11కు చేరింది. అయితే రానున్న ఎన్నికల్లో 12 స్థానాల్లో టీఆర్‌ ఎస్‌ జెండా ఎగురవేసేలా అధిష్ఠానం ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను...