Warangalvoice

Latest News

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం
Crime, District News, Latest News

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం

మూడు వందలకు పైగా మృతులు వేయికి పైగా క్షతగాత్రులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్‌ పట్నాయక్‌ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్‌ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. ఈ ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్‌ ఎక్స...
సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన
Latest News, Telangana

సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా విూర్జా రిటైర్మెంట్‌ ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌) టోర్నీతో తన కెరీర్‌ కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం కాబోయే ఆస్టేల్రియా ఓపెన్‌ కు సన్నధం అవుతుంది. తర్వాత దుబాయ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్కడే తన రిటైర్మెంట్‌ ను ప్రకటిస్తుంది. గతేడాది ఆటనుంచి తప్పుకోవాలని అనుకున్నా.. కొన్ని కారణాలవల్ల తర్వాత తన మనసు మార్చుకుంది. పోయిన ఏడాది యూఎస్‌ ఓపెన్‌ ఆడి ఆటకు గుడబై చెప్పాలనుకుంది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరం అయింది. దాంతో రిటైర్మెంట్‌ వాయిదా పడిరది. ’గాయంతో కెరీర్‌ ముగించుకోవాలి అనుకోలేదు. అందుకే రిటైర్మెంట్‌ ని పోస్ట్‌ పోన్‌ చేశా’ అని సానియా అన్నది....
రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !
Latest News, Telangana

రైతుల పాలిట రాక్షసులుగా పాలకులు !

వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి ఆందోళన రైతుల ఆక్రందనకు అద్దంపట్టే చర్య. ఇప్పుడు కామారెడ్డి ఒక్కటే కాదు... ఇంతకు ముందు మల్లన్న సాగర్‌,కొండపోచమ్మ సాగర్‌...ఫార్మాసిటీ, పోలవరం..అమరావతి, విశాఖ ఉక్కు, గంగవరం పోర్టు... ఇలా చెప్పుకుంటే పోతే అనేక చోట్ల ప్రభుత్వాల దౌర్జన్యం కనిపిస్తుంది. దోపిడీదారులుగా మారిన పాలకులు రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుని వ్యాపారం చేస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. అభివృద్ది అన్న అందమైన పేరు చూపి భూములను గుంజుకుని బక్కరైతులను బజారున పడేస్తున్న తీరు నిరంకుశ పాలనకు సాక్ష్యంగా చూడాలి. ఎంతగా అంటే వారికి ముష్టి డబ్బులు వేసి భూములను గుంజుకుంటున్న తీరు కళ్లముందు కనబడుతున్నది. రైతులు ఆక్రందనతో ఆందోళన చేస్తుంటే పోలీస్‌ బలగాలతో వారిని అణచివేస్తున్నారు. ఇళ్లను కూడా గుంజుకుని వారిని తన్ని తరిమేస్తున్న తీరు దౌర్జన్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ఎకరా 50 లక్షలు పలుకుతోంద...