Warangalvoice

Latest News

SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు
Latest News

SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు

జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. వరంగల్ వాయిస్,  నాగర్ కర్నూల్ : జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ  వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్  పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న ఊట నీటిని తోడిపోస్తూ స్టీల్  వ్యర్ధాలను బయటకు తరలిస్తున్నారు. శుక్రవారం టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీలును లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించ...
Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహ‌రింపు
Latest News

Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహ‌రింపు

వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వాయిస్, చార్మినార్ : వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి భవన్‌కు చేరిన పక్షంలో ఇక రాజ్యాంగ‌బద్దంగా అమలు కావడమే తరువాయి. ప్రస్తుతం లోక్‌స‌భ‌, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి బిల్లు సవరణకు మద్దతు పలికారు. ఈ క్ర‌మంలో ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంద‌రు స్వాగ‌తిస్తే.. మ‌రికొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల కొనసాగుతుంది. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల నేపథ్యంలో సున్నిత, అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల పోలీస్ ఉన్నతధికారులు ప...
KTR | గ‌డ్డి న‌ర‌స‌య్య మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు : కేటీఆర్
Latest News

KTR | గ‌డ్డి న‌ర‌స‌య్య మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు : కేటీఆర్

 సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నరసయ్య అకాల మరణం పట్ల చింతిస్తూ.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు. ఇక న‌ర‌స‌య్య మృత‌దేహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం నివాళుల‌ర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా అందించారు. ఆయన వెంట బీఆర్ఎ...
భగ్గుమన్న రైతన్నలు.. ధాన్యంతో తొగుట మార్కెట్ ముందు రాస్తారోకో
Latest News

భగ్గుమన్న రైతన్నలు.. ధాన్యంతో తొగుట మార్కెట్ ముందు రాస్తారోకో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి. వరంగల్ వాయిస్,  తొగుట : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేటని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రమైన తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రైతులతో కలిసి పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పరిశీలించారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. పొద్దు తిరుగుడు ధాన్యంతో మార్కెట్ ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోడ్‌లో గత నెల 3న తొగుటలో పొద్దుతిరుగుడు కేంద్రాన్ని ప్రారంభ...
SIRICILLA | లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి
Latest News

SIRICILLA | లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం వరంగల్ వాయిస్,  సిరిసిల్ల కలెక్టరేట్  : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్ల తో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం క్రింద మంజూరు చేసే యూనిట్ లకు మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్ లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన, తుది ఆమోదం సమయంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర...
Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ.. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’
Latest News

Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ.. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. Supreme Court | ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. మణిపూర్‌ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని.. ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని తెలిపారు. రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని.. ప్రస్త...
SIRICILLA | కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..!
Latest News

SIRICILLA | కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..!

సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. వరంగల్ వాయిస్, సిరిసిల్ల : సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు. చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో మిగిలిన చేతికొచ్చిన పంట, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఉన్న ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. . ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా రూ.1700 నుంచి రూ.1800లకే క్వింటాలుకు అమ్ముకోవడం గమనార్హం. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉదయాన్నే కళ్లాల వద్ద కాంటాలు పెట్టి ధాన్యాన్ని దళారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి కైన ప్రభు...
త్వరలోనే అర్హులందరకీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు
Latest News

త్వరలోనే అర్హులందరకీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు

పెద్దపల్లి ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసమే సన్న బియ్యం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం వరంగల్ వాయిస్,  పెద్దపల్లి : ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో రేషన్ షాపుల ద్వారా పంపిణి చేసే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కార్డు దారులకు బుధవారం బియ్యం పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో పేదవర్గాల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వ...
BRS leader Rajaramesh | ప్రజలకు న్యాయం చేయాలని పోరాడితే అక్రమ కేసులా ? : బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్
Latest News

BRS leader Rajaramesh | ప్రజలకు న్యాయం చేయాలని పోరాడితే అక్రమ కేసులా ? : బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్

తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు. వరంగల్ వాయిస్, చెన్నూర్ టౌన్ : తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్  నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్  ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి మంగళ వారం ఆయన చెన్నూర్‌ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 420 హామీలు, ఆరు గ్యారెంటీలను రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని, మరీ ముఖ్యంగా రైతన్నలను దారుణంగా మోసం చేసిందని ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన 17 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు లాగిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక...
Ponnam Prabhakar Goud | తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Latest News

Ponnam Prabhakar Goud | తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వరంగల్ వాయిస్, హుస్నాబాద్ టౌన్  : రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నేటి నుంచి సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో ఇవాళ సన్న బియ్యం పథకం మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించడం జరిగిందని.. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 17,263 చౌకధరల దుకాణాల ద్వారా ర...