Warangalvoice

Hanamkonda

కమ్యూనిస్టుల మార్గదర్శకుడు గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిద్దాం
Hanamkonda

కమ్యూనిస్టుల మార్గదర్శకుడు గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి వరంగల్ వాయిస్, హనుమకొండ : కమ్యూనిస్టుల మార్గదర్శకులు నల్లమల గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గిరి ప్రసాద్ 27వ వర్ధంతిని సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రసాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దళ నాయకులుగా పనిచేసిన గిరి ప్రసాద్ గిరిజనులను సమీకరించి జమీందార్లు, రజాకార్లు, రజాకార్ల స్వాధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. అనేక కేసులను, నిర్భందాలను ఎదుర్కొని జైలు జీవితం అనుభవించిన గిరి ప్రసాద్ భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు....
గ్యాస్ భద్రత చర్యలపై అవగాహన
Hanamkonda

గ్యాస్ భద్రత చర్యలపై అవగాహన

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ వంట గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతలో భాగంగా ఇంటింటికి తమ డెలివరీ సిబ్బంది సందర్శించి వాడకం దారులు వినియోగిస్తున్న ఇండేన్ గ్యాస్ పనితీరును‌ గమనించి‌ తొమ్మిది ఆంశాలతో కూడిన ప్రశ్నావళిని డెలివరి బాయ్ ఆప్ ద్వారా ఆయిల్ కంపెనీకి‌ అనుసందానం చేస్తారని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ డీలర్ల పూర్వ ప్రధాన కార్యదర్శి పీవీ.మదన్ మోహన్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్యాస్ ప్రమాదాలు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లోఅవగాహన లోపంతో జరిగాయని వచ్చిన నివేదిక ఆధారంగా అన్ని ఆయిల్ కంపెనీలు తమ వద్ద నమోదైన గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతా చర్యలు చేపట్టాలని‌ నిర్ణయించాయని అన్నారు. గ్యాస్ లీకేజి వాసన గుర్తిస్తే 1906 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. సురక్ష రబ్బరు ట్యూబ్ ఇటాలియన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారని, దాని కాలపరిమితి ఐదు సంవత్సరాలు, తయారీ తే...
ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండి
Hanamkonda

ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండి

వీడియో విడుదల చేసిన రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ వరంగల్ వాయిస్, హనుమకొండ : ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండని రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ పట్టభద్రులను కోరారు. గురువారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. రాకేష్ బిట్స్ పిలానీలో తన జూనియర్ అని, బిట్స్ పిలాని రోజుల్లో రాకేష్ రెడ్డి ఆల్రౌండర్, చదువులతో పాటు, విద్యార్థి నాయకుడిగా ప్రధాన కార్యదర్శిగా పని చేశారని వెల్లడించారు. నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. దేశం మారుతున్న క్రమంలో ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో అవసరమని గుర్తు చేశారు. జీవితంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొన్న రాకేష్ రెడ్డి లాంటివాళ్ళు గెలిస్తే బాగుంటుందని సూచించారు. దేశానికి ఏదైనా చెయ్యాలనుకునే వారు రాకేష్ లాంటి మంచి నాయకుడిని ఎన్నుకోండి చాలు అని కోరారు. ప్రజలు రాకేష్ లాంటి ఉన్నత విద్...
వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
Hanamkonda

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి-సుధేష్ణ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు, రామంచి నిరంజన్ రాధిక, రాజనందం-హైమ, గునుగంటి రమేష్ దంపతులు, కొలనుపాక సుధాకర్ దంపతులు, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.  ...
శ్రీ మత్స్యగిరి దేవాలయంలో జీఎస్సాఆర్ ప్రత్యేక పూజలు
Hanamkonda

శ్రీ మత్స్యగిరి దేవాలయంలో జీఎస్సాఆర్ ప్రత్యేక పూజలు

వరంగల్ వాయిస్, శాయంపేట : మండల కేంద్రంలోనీ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, చైర్మన్ సామల భిక్షపతి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన జెన్న కృపాకర్ రెడ్డి ఆలయానికి గోవిందరాజస్వామి వారి ఏనుగు రథాన్ని బహూకరించగా, ఆ రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల అధికార ప్రతినిధి చిందం రవి, మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ వై నాలా కుమారస్వామి, జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, మోత్కూరి భాస్కర్, వలుపదాసు రాము, మాదిరెడ్డి ప్రపంచరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  ...
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం
Hanamkonda

తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం శాయంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి అత్యధిక మెజారిటీతో మల్లన్నను గెలిపించుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప...
నేడు అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం
Hanamkonda

నేడు అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాసులను, వృక్ష సంపదను, జల వనరులను, ప్రకృతిని సంరక్షించి కాపాడుకోవడం రాబోవు తరాల వారికి మన అందించే విలువైన బహుమతి అని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజికవేత్త, వన సేవ సభ్యుడు నిమ్మల శ్రీనివాస్ అన్నారు. "అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం "సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ధరిత్రిపై ఉండే జీవరాశుల వలన జీవ సమతుల్యం ఏర్పడుతుందని, వీటిలో ఏ జీవి మనుగడకైనా నష్టం వాటిల్లితే అది మిగిలిన జీవరాశులపై ప్రభావం చూపి జీవవైవిద్యానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే ఈ విషయాలపై ఆసక్తి పెంచడానికి వారి పాఠ్యాంశాలలో భాగంగా "ఎన్విరాన్ మెంటల్ సైన్స్"(ఈవీఎస్) అనే సబ్జెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు విషయాలను బోధించి వారిని ప్రకృతి ప్రేమికులుగా మార్చాలని ఆయన కోరార...
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Hanamkonda

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

21 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక చిన్ననాటి సంగతులను పంచుకున్న 2002-03 బ్యాచ్ ఒకరి ఒకరం.. ఆపదలో అందరం అంటూ బాసలు వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ కలిసిమెలసి గడిపిన తమ బాల్య స్మృతులను 21 ఏళ్ల తర్వాత కలిసిన జడ్పీహెచ్ఎస్ 2002-03 బ్యాచ్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. సంతోషంలో దుఖంలో అంతా ఒక్కటై ఒకరికి..ఒకరం తొడుంటామని ఉమ్మడిగా భరోసాను కల్పించుకున్నారు. ఇదంతా ఈనెల 19న కమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-03 బ్యాచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కార్యక్రమంలో విద్యార్థులు తమ చిన్ననాటి సంగతులను గుర్తుకు చేసుకుంటూ చేసుకున్న బాసలు. చిన్ననాటి మిత్రులంతా 21 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి సంతోషం అంబరాన్నింటింది. అలాగే తమకు విద్యాదానం చేసిన గురువులను ఆహ్వానించి సత్కారాలు, బహుమతులు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించ...
ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ ప్లాంట్
District News, Hanamkonda

ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ ప్లాంట్

ఐదు కోట్లు వెచ్చించినా అవసరాలు తీర్చని ప్లాంట్ ఓ ఏజెన్సీతో కుమ్మకై రూ. 70 లక్షలకు అప్పనంగా కట్ట పెట్టిన అధికారులు.! మామూళ్ల మత్తులో ఆక్సిజన్ ప్లాంట్ మూసివేసేందుకు కుట్ర కోవిడ్ సమయంలో దాతలు అందజేసిన ఆక్సిజన్ మిషన్స్ సైతం గోల్ మాల్ జాడలేని విజిలెన్స్ విచారణ, పట్టించుకుకొని ప్రభుత్వ పెద్దలు వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : కోవిడ్ క్లిష్ట పరిస్థితిలో ఎంతో ఉన్నత లక్ష్యాలతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ రోగుల అవసరాలకు అక్కరకు రాకుండ పోతోంది. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కల్పతరువులా ఊపిరి పోస్తుంది అనుకుంటే అధికారుల కనికరం లేక మరమ్మతులకు నోచుకోక ఏకరువు పెడుతుంది అధికారుల పర్యవేక్షణ లోపమో లేక ఓ ప్రయివేట్ ఏజెన్సీ పాలిట వరమో తెలియదు గానీ, చిన్న చిన్న మరమ్మత్తులు చేయించడం చేతకాక ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు పేరుతొ భారీ కుంభకోణం జరుగుతున్నట్లు జిల్లా కేంద్రంలో భారీగ...
సమర్థత ఉన్న వారినే విసీలుగా నియమించాలి
Hanamkonda

సమర్థత ఉన్న వారినే విసీలుగా నియమించాలి

ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకి అనుభవం అర్హత సమర్థత ఉన్న వారిని ఉపకులపతులుగా నియమించాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా శేషు మాట్లాడుతూ ఈ నెల 21తో ప్రస్తుత ఉపకులపతుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఉపకులపతులను నియమించుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినందున, విధేయులను కాకుండా విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయగల వారిని విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగల దక్షత కలవారిని ఉపకులపతులుగా నియమించాలని కోరారు. గత ప్రభుత్వం తమ అనుయాయులను, విధేయులను ఉపకులపతులుగా నియమించటం వలన విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి, దరఖాస్తు చేసుకున్న 312 మందిలో సమర్థత అనుభవం అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాల...