Warangalvoice

District News

Harish Rao | పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిన ప్రభుత్వ తీరు: హరీశ్‌రావు
District News

Harish Rao | పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిన ప్రభుత్వ తీరు: హరీశ్‌రావు

స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతున్నదని ఆగ్రహం వ్యక్తం చ...
CPI | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ బృందం
District News

CPI | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ బృందం

CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది తప్పితే ఆయా పార్టీలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల విధానాలు ప్రతిబింబించవని అన్నారు. అదే సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్...
Koppula Eshwar | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఎండుతున్న పంటలు : కొప్పుల ఈశ్వర్
District News

Koppula Eshwar | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఎండుతున్న పంటలు : కొప్పుల ఈశ్వర్

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. వరంగల్ వాయిస్,  ధర్మారం : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వార్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న లింక్ కాల్వ పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో సోమవారం ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాలల్లోని కాల్వ చివరి గ్రామాల రైతులు, పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మూడు సంవత్సరాల క్రితం మల్లాపూర్ నుంచి వెల్గటూరు మండలంలోని చివరి గ్రామాలకు సాగునీటికి శాశ్వత పరిష్కారం అందించడానికి రూ.13 కోట్ల నిధులను మంజూరు చేయించామన్నారు. ఆ నిధులతో నంది రిజర్వాయర్ నుంచి రెండున్నర కిల...
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్‌ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
District News

KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్‌ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం

KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సూచనతో అధికారులు కదిలారు. వరంగల్ వాయిస్, సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సూచనతో అధికారులు కదిలారు. నిన్న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్‌ను రంగనాయక సాగర్ నుంచి నీళ్లు ఇప్పించాలని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ల, నేరెళ్ల, చిన్న లింగాపూర్, రామచంద్రపురం, దాచారం రైతులు కోరిన విషయం తెలిసిందే. స్పందించిన కేటీఆర్ ఎస్ఈతో ఫోన్‌లో మాట్లాడి నీళ్లు అందివ్వాలని సూచించారు. దీంతో సోమవారం జక్కాపూర్‌లోని రంగనాయక సాగర్ కాల్వను ఎస్ఈ రవీందర్, అధికారులు తంగళ్లపల్లి మండలంలో రైతులుతో కలిసి సందర్శించారు. కాలువను పరిశీలించి నీటి సరఫరా చేస్తామని, నీటి ఫ్లో కూడా పెంచుతామని పేర్కొన్నారు. రంగనాయక సాగర్ కాల్వ నుంచి జిల్లెళ్ల వరకు నీటి సరఫరా చేస్తామని, కాలువలో భూములు కోల్పోయిన రైతులకు, పెండింగ్‌లో ఉన్న భూ పరిహారం రూ.55...
ACB Raids | రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్‌
District News

ACB Raids | రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్‌

నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్టర్‌ను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ వాయిస్,  నిజామాబాద్  : నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు (ACB Raids ) నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్‌ను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కవితా కాంప్లెక్స్ రెండవ అంతస్తులో ఉన్న జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంపై సోమవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి కి సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ శ్రీరామరాజును సదరు వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసి...
Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
District News

Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు

Rajnath Singh: యూపీఐ లావాదేవీలలో భారత్ నేడు అగ్రగామిగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గతేడాది అంటే.. 2024లో భారత్‌లో రూ. 171 బిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 2.45 లక్షల కోట్ల రూపాయిలని ఆయన సోదాహరణగా వివరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. గ్లోబల్ లీడర్ షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని విజ్ఞాన్ వైభవ్-2025ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుం...
MLC Kavitha | ఆయా రంగాల్లో బీసీల‌కు 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే : ఎమ్మెల్సీ క‌విత‌
District News

MLC Kavitha | ఆయా రంగాల్లో బీసీల‌కు 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | బీసీల‌కు విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, నాగ‌ర్‌క‌ర్నూల్ : బీసీల‌కు విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. అయితే ఈ మూడింటికి సంబంధించి వేర్వేరు బిల్లుల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశపెట్టాల‌ని డిమాండ్ చేశారు క‌విత‌. నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ సమావేశంలో క‌విత ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలి. ఒకటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని తొలి నుంచి నేను వాదిస్తున్నాను. ప్రభుత్వం దిగొచ్చి మూడు బిల్లులను పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో నిలవదు అని ...
రాజ్యాధికారం లేకనే బీసీ డాక్టర్లకు అన్యాయం
District News

రాజ్యాధికారం లేకనే బీసీ డాక్టర్లకు అన్యాయం

కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల డాక్టర్లకు అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, ఒక్క మంచి పోస్టులో కూడా డాక్టర్లు లేని పరిస్థితి ఉందని, దీనికంతటికి కారణం బీసీ రాజ్యాధికారం లేకపోవడమే అని, బీసీ నేత, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. గురువారం హనుమకొండలోని ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ హాజరై మాట్లాడారు. 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటికి బీసీలకు అధికారం రావడం లేదంటే విభజించి పాలించిన రాజకీయ నాయకులేనన్నారు. ఇప్పటికీ బీసీలందరూ ఒకటయ్యాం. ప్రతి గల్లీ గల్లీలో వాడవాడలో మండల మండలంలో గ్రామ గ్రామాన బీసీలకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ పైన జరుగుతున్...
SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి
District News, Hanamkonda

SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ మాజీ కూడా చైర్మన్, బీసీ నేత సుందర్ రాజు యాదవ్ వరంగల్ వాయిస్, భీమదేవరపల్లి : బీసీ నాయకులు ఐక్యంగా ఉండి మన హక్కులు సాదించుకోవాలని బీసీ నేత, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని గ్రంథాలయంలో జాతీయ బీసీ నాయకులు మాజీ జడ్పీటీసీ వంగ రవి అధ్యక్షతన బీసీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ నేత మాజీ కూడా చైర్మన్, సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ హజరై మాట్లాడుతూ హనుమకొండ ఆర్ట్స్ అండ్ కాలేజీలో ఫిబ్రవరి 2 యుద్దభేరి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీసీల జెండాలు ఏగిరే సమయం అసన్నమైందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నుండే బీసీలు రాజకీయ యుద్దం మొదలవుతుందన్నారు. ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి ప్రతి ఒక్...
బీసీల ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి
District News, Hanamkonda

బీసీల ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి

రాజకీయ చైతన్యంకై గ్రామాలకు తరలాలి స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్ల గెలుపుకై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కృషి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సమాజ విముక్తి కోసం రాజ్యాధికారం అవసరమని, రాజకీయ చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని బీసీ ఇంటలెక్టువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా "స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పాత్ర" అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం ఉద్యమిస్తున్న బీసీలు దోపిడీ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలను వీడాలని పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు...