Warangalvoice

District News

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
District News, Hanamkonda

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ గిరిజన శక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు మంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని మంద నరేష్ అన్నారు. విద్యార్థులు తమ చదువులు సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం సాధిస్తే రాష్ట్రం వచ్చాక విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రం కోసం పోరాడని తెలంగాణ ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి మాత్రం జిల్లాకు మంత్రి అయ్యాడని మండిపడ్డారు. ...
అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
District News, Hanamkonda

అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ వరంగల్ వాయిస్, హనుమకొండ : షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్న నేటికీ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను అమలు చేయడం లేదని, ఈ కారణంగా కోట్లాది రూపాయలు కార్మికులు నష్టపోతున్నారని, రాష్ట్ర కార్మిక శాఖ కనీస వేతనాలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఫైలు పంపినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి కనీస వేతనాల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సవరణ జరగాల్సి ఉండగా ...
బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి
District News, Hanamkonda

బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : అంబేద్కర్ సెంటర్ వద్ద బీసీ యువజన సంఘం గ్రేటర్ అధ్యక్షుడు రాసురి రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందే అని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55% ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపై క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్...
గిరిజన రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
District News, Jangaon

గిరిజన రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ వరంగల్ వాయిస్, జనగామ : తెలంగాణలో బీసీ-ఈ రిజర్వేషన్ల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది పరిష్కారం అయ్యేవరకు గిరిజన రిజర్వేషన్ పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందునాయక్ కేంద్రప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బీసీ-ఈ తో ముడి పెట్టడం అన్యాయమన్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6 శాతం నుంచి 9.08 శాతానికి పెంచుకోవడానికి కేంద్ర హోం శాఖ అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర గిరిజన వ్యవరాలశాఖ కోరింది. గత నాలుగు సంవత్సరాలుగా జాప్యం చేసిన కేంద్ర హోం శాఖ ఇప్పుడు బీసీ- ఈ సమస్యను గిరిజన రిజర్వేషన్ పెంపు సమస్యతో ముడిపెట్టడం బీజేపీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని అన్నార...
గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్
District News, Warangal

గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్

వరంగల్ వాయిస్, వరంగల్ : గొర్రెలు, మేకలు అనారోగ్య నివారణకు, నీలి నాలుక వ్యాధిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా బ్లుటంగ్ వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం వేయించడం జరుగుతుందని, దీన్ని గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. పశు వైద్యశాల డాక్టర్ ఝాన్సీ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మందులను పంపిణీ చేసి, గొర్రెలకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని పశు సంపద గొర్రెలు, మేకలు పెంపకానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య. హసీనా, వినయ్, గొట్టే రాజమ్మ, పిట్ట శ్రీనివాస్, సుంకరి నరేష్ ఉన్నారు....
నిత్యావసర సరుకుల పంపిణీ
Bhupalapally, District News, Telangana

నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా కృష్ణబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వం కోల్పొయిన వీరికి స్వచ్ఛందంగా కొంతమంది మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్...
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
District News, Mahabubabad, Political

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకా...