Warangalvoice

District News

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం
District News, Jangaon

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం

అబ్దుల్ క‌లామే అందుకు నిద‌ర్శ‌నంమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుపాల‌కుర్తి జడ్పీ పాఠ‌శాల‌లో అబ్దుల్ క‌లామ్ విగ్రహావిష్క‌ర‌ణ వరంగల్ వాయిస్, పాలకుర్తి: పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లామ్ జీవితమే నిదర్శమని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కొనియాడారు. బుధవారం జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏపీజే అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హాన్ని ఆయన ఆవిష్క‌రించారు. పదో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో అత్యంత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చిన విద్యార్థుల‌కు స‌న్మానం చేశారు. ఉత్త‌మ సేవ‌లు అందించిన స్కూల్ అటెండ‌ర్ భిక్ష‌ప‌తిని మంత్రి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవిత‌మంతా శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, సమాజం కోసం పాటుపడిన మహనీయుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం అని, నీతికి, నిజాయితీకి నిలువె...
రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు
Cultural, District News

రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు

వరంగల్ వాయిస్, ములుగు రోడ్: నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఈ నెల 29 వ తేదీ శ్రావణ మాసో ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వరద దత్త క్షేత్రం ట్రస్ట్ సభ్యులు అడ్డగుడి వెంకటేశ్వరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో ఈ నెల 29 తేదీ మొదటి శుక్రవారం అమ్మవారికి పండ్లతో అర్చన ఆగస్ట్ 5వ తేదీన వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ హోమం, 12 వ తేదీన అమ్మవారికి పూలతో అర్చన, 19 వ తేదీన అమ్మవారికి తమలపాకులు వక్కలతో అర్చన లక్ష్మీ హోమం, 26 వ తేదీన అమ్మవారికి జాకెట్ ముక్కలతో అర్చన, 21వ తేదీన దశమి సందర్భంగా ఆశ్రమంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ అనగాష్టమి వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ స్వామిజీ కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు....
బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ దాడులు
Crime, District News

బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ దాడులు

వరంగల్ వాయిస్, క్రైం: ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ లపై టాస్క్ ఫోర్స్ టీం బుధవారం దాడులు చేసింది. నిబంధనలు పాటించకుండా ఉదయాన్నే బార్లు తెరుస్తున్నారని మట్వాడ, హన్మకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ, సుబేదారి, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఆరుగురు బార్ నిర్వాహకులు, ఒక కార్మికుడిని అరెస్ట్ చేసి మద్యాన్ని సీజ్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లలో తిరుమల బార్, సప్తగిరి బార్, తులసి బార్, ఇంద్రకీలాద్రి బార్, బాలాజీ బార్ లు ఉన్నాయి....
అనుమానంతో .. అంతమొందించాడు
Crime, District News, Mahabubabad

అనుమానంతో .. అంతమొందించాడు

భార్యను హత్య చేసిన భర్తనిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన బంధువులుమరిపెడ మండలం అనకట్ట తండాలో విషాదం వరంగల్‌, వాయిస్‌, డోర్నకల్‌: ‘‘అమ్మ… లే అమ్మ… నాన్న వెళ్లిపోయా డు… లేవమ్మా’’ అంటూ చనిపోయిన వాళ్ల అమ్మను లేపే ప్రయత్నం చేస్తున్న చిన్నారులను వారించ టం.. సముదాయిం చటం ఎవ్వరి వల్ల కాలేదు. తండ్రి అవేశం వల్ల తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని చిన్నారుల పరిస్థితి చూసి తండావాసులు కన్నీరుపె ట్టారు. మానుకోట జిల్లాలో ఉదయం ఓ మహిళ హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని ఆనకట్ట తండాకు చెందిన బానోత్‌ రవీందర్‌కు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని నారియ తండాకు చెందిన బానోత్‌ మమత(29) కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె జన్మించారు. ఆ తర్వాత భార్యపై అనుమాన...
సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే
District News, Hanamkonda, Top Stories, Warangal

సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే

గ్రేటర్‌లో సగానికిపైగా మహిళా ప్రతినిధులేవీరిలో చాలా మంది వంటింటికే పరిమితంరాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులుఅధికారిక కార్యక్రమాల్లోనూ వారేప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరుఅయోమయానికి గురవుతున్న జనం మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు. భర్త ఎస్‌ అంటే ఎస్‌ అని నో అంటే నో అంటూ వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు సైతం పతులే హాజరవుతున్నారు. సతులు గడప దాటకుండా కేవలం అధికారిక పత్రాలపై ఆటోగ్రాఫ్‌లకే పరిమితమవుతుండగా పతులు మాత్రం పొద్దున లేచింది మొదలు పొద్దుపోయే వరకు రాజకీయంగా చక్రం తిప్పుతూ హడావిడి సృష్టిస్తున్నారు. కొంతమంది భర్తలు ఇంకొంచెం ముందడుగు ...
విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి
District News, Hanamkonda

విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి

వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ: పాఠశాల విద్యార్థులకు సామాజిక నైతిక విలువలు, కౌమారవిద్యను నేర్పించాలని కోరుతూ అడిషనల్‌ కలెక్టర్‌ కు ఓరుగల్లు కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ , సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా మంగళవారం వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై అడిషనల్‌ కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహవిద్యాకార్యక్రమాలు గతంలో వలె జరుగడం లేదని, విద్యాలయాల్లో విద్యతో పాటు దేశభక్తి, సామాజిక, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించేవిధంగా ఉండాలని, అందుకనుగుణమైన పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయుల కాలనిర్ణయపట్టిక ఉండాలని కోరామన్నారు. పాఠశాలల్లో కన్స్యూమర్స్‌ క్లబ్బుల ఏర్పాటు, పర్యావరణం, స్వచ్ఛ భారత్‌, తెలంగాణ హరితహారం, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేవిధంగా సహవిద్యాకార్యక్రమాలు ఉండాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ ను కలిసినవారిలో కజాంపురం దామోద...
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌
Crime, District News, Mulugu

ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

వరంగల్‌ వాయిస్‌, ములుగు: ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం వారి అరెస్ట్‌ ను చూపిన వెంకటాపురం సీఐ కె. శివప్రసాద్‌ మంగళవారం వివరాలు వెల్లడిరచారు. 25న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివారులోని బిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొండాపురం వైపు నుంచి అలుబాక వైపునకు అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ బ్రిడ్జి సమీపానికి వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడిరచి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నిషేదిత సి.పి.ఐ మావోయిస్ట్‌ పార్టీకి చెందిన వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌) , జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌) పేరుతో నినాదాలతో కూడిన కొన్ని కరపత్రాలు కనిపించాయమన్నారు. పట్టుబడిన వ్యక్తులు తాటి సోమయ్య, తాటి సత్యం, యాలం సురేష్‌ ల గుర్తించారు. వీరిది...
వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించండి
District News, Warangal

వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించండి

వరంగల్ వాయిస్, నర్సంపేట : వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగా తహసీల్దార్ కార్యాలయంలో 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వీఆర్వో సంఘం సంఘీభావం తెలుపారు. సమ్మెను ఉద్దెశించి వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు న్యాయమైనవి, వారికి పే స్కేల్ జీవో వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ల సంఘం నాయకులు రాజేందర్, రాజు, నర్సింహస్వామి, వీఆర్ఏల జేఏసీ చైర్మన్ బిర్రు సునిల్, వీఆర్ఏలు పాల్గొన్నారు పాల్గొన్నారు....
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం
Cultural, District News, Hanamkonda

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం

వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా అప్లై చేశాడు.197 దేశాల పేర్లు రాజధాని, కరెన్సీ, భాషలు అవలీలగా చెప్పగలడు. రికార్డు ఇంతవరకు ఎవరు సాధించలేదు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా బింగి నరేందర్ గౌడ్, అడ్డగట్ట గంగాధర్, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు....
రాష్ట్రపతి ముర్ము చిత్రపటాల బహూకరణ
District News, Mahabubabad

రాష్ట్రపతి ముర్ము చిత్రపటాల బహూకరణ

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో భారత రాష్ట్రపతి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చిత్ర పటాన్ని మహబూబాబాద్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్ర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య, సీనియర్ నాయకులు శశి వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకటేశ్వర్లు, చీకటి మహేష్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందు భారతి, జిల్లా ఉపాధ్యక్షులు మేరెడ్డి సురేందర్, గూడూరు మండల అధ్యక్షుడు మోతీలాల్, కేసముద్రం మండల అధ్యక్షుడు పొదిలి నర్సింహా రెడ్డి, సింగారపు సతీష్, రేష్మ, పద్మ తదితర జిల్లా నాయకులు, మండల ...