Warangalvoice

District News

వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు
District News, Warangal

వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు

వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో వీఆర్ఏల జాక్ తో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. పే స్కేల్ ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని దుయ్యపట్టారు. సమ్మెలో పాల్గొన్న బీజేపీ నాయకులు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లర నర్సింగ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ చాంద్ పాషా, 2వ డివిజన్ అధ్యక్షుడు భగవాన్ దాస్ ఉపాధ్యాయ, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోవెల జీవన్, ప్రకాష్, జయంతి లాల్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కందకట్ల సత్యనారాయణ, గుంటి కుమార్ స్వామి, ఆర్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రవణ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు....
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
District News, Hanamkonda

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలి అన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అలాగే మిగతా వారి న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ పరకాల మండల అధ్యక్షుడు సూర రాజు, ఉపాధ్యక్షుడు ఓట్ల స్వాతి, కార్యదర్శి అశోక్, రాకేష్, రామకృష్ణ, రవీందర్, శైలజ, తిరుపతి, సాంబయ్య, దేవి, నరసయ్య, తదితరులు ...
‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
District News, Political, Telangana, Top Stories

‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి

ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీపార్టీ బలోపేతమే లక్ష్యంఆగ‌స్టు 2నుంచి బండి సంజ‌య్ మూడో విడ‌త పాద‌యాత్ర‌యాదాద్రి లక్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధినుంచి ప్రారంభం26న వ‌రంగ‌ల్‌లో భారీ ముగింపు స‌భ‌హాజ‌రుకానున్న బీజేపీ చీఫ్ న‌డ్డా ఓరుగల్లుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్ట‌నున్న‌ మూడో విడ‌త పాద‌యాత్ర‌ను మొద‌ట వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ముగించాల‌ని భావించినా చివ‌రి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాద‌యాత్ర‌ను యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ఆగ‌స్టు 2వ‌ తేదీన ప్రారంభించి అదే నెల 26న వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సంద‌ర్భంగా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భ...
ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
Crime, District News, Mulugu

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలుయువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దువరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ రాజయ్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను గురువారం పరకాల ఇన్ స్పెక్టర్ పి.కిషన్ నిందితులకు ఖమ్మం జిల్లా కారాగారంలో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితులు రెండు నెలల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా నుంచి భద్రాచలం మీదుగా పరకాలకు గ...
నేటినుంచి శ్రావణమాసం ఆరంభం
Cultural, District News

నేటినుంచి శ్రావణమాసం ఆరంభం

వ్రతాలు, నోములకు పెద్దపీటవరంగల్ వాయిస్, జూలై28 : తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం వర్షఋతువులో వస్తుంది.. కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి. ఈ నెల హిందువుల లోగిళ్ళు ఆలయాలను తలపిస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం.. ఈ నెలలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలను ఆచరిస్తారు. ఈ నెలలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దల చెబుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు.. కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం.. ఈ నక్షత్రం పేరుతొ ఏర్పడిన శ్రావణమాసం అని.. ఈ మాసంలో చేసే పూజలు అత్యంత ఫలప్రదమని పురాణాల కథనం. లక్ష్మీ ప్రదమైన మాసం.. శ్రావణ మాసం ఈ ఏడాది జూలై 29 వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు. తొలిరోజే శుక్రవారంతో ప్రారంభం కావడం విశేషం...
స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
District News, Hanamkonda, Top Stories, Warangal

స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?

న‌గ‌రంలో 121 ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లునేటికీ ముందుకు ప‌డ‌ని అడుగులుఇబ్బందులో ప్ర‌జ‌లుమొద్దునిద్ర‌లో బ‌ల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా అభివృద్ధి చెందుతున్న వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు పాల‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నీటి మూట‌లుగా మారుతున్నాయి. అధికారుల అల‌స‌త్వం, పాల‌కులు ప‌ట్టింపులేని త‌నంతో న‌గ‌రం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెన‌క్కి వెళ్తోంది. న‌గరంలో నూత‌నంగా చేప‌ట్టాల్సిన ఎన్నో ప‌థ‌కాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. ఇదే బాట‌లో న‌గ‌రంలో స్మార్ట్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణ ప్ర‌క్రియ‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేశారు. దీంతో పాత‌కాల‌పు నాటి బ‌స్ షెల్ట‌ర్‌తోనే న‌గ‌ర ప్ర‌జ‌లు స‌ర్దుకోవాల్సి వస్తోంది. న‌గ‌రంలో మోడ్రన్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి న...
75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం
District News, Top Stories

75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం

దుర్విచక్షణ, అసమానతలను అధిగమించి దేశీయంగా ప్రగతి సాధించబడాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారతీయుల సగటు ఆయుర్ధాయాన్ని నేటికీ కూడా కులమే నిర్దేశిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం అగ్రవర్ణాలతో పోలిస్తే.. ఎస్సీ, ఎస్టీల జీవిత కాలంలో నాలుగు నుంచి ఆరేండ్లు తగ్గుదలగా ఉన్నట్లుగా చెబుతున్నది. ఆయా సామాజిక వర్గాల సగటు ఆయుఃప్రమాణంతో 20 ఏండ్ల క్రితం 4.6 సంవత్సరాల తేడా ఉంటే 2016 నాటికి అది 6, 1కి పెరిగింది. ప్రజారోగ్యాన్ని ప్రోదిచేయడం ప్రభుత్వాలు, పాలకుల కర్తవ్యం అని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్నది. కానీ ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందాలని 1946లోనే భోర్‌ కమిటీ సూచించింది. ప్రత...
కాంగ్రెస్ సత్యాగ్రహ..
District News, Hanamkonda, Political

కాంగ్రెస్ సత్యాగ్రహ..

సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహంఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలుఅక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్ లో "సత్యాగ్రహ దీక్ష" నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యం, ప్రజల పక్షాన పోరాటాలు చేసే వారు లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు పెట్టి ఈడీ విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై దేశప్రజలు ఆలోచించాలని, మో...
చెట్టు కింద పాలన.. ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!
District News, Jangaon

చెట్టు కింద పాలన.. ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!

సింగ‌రాజుప‌ల్లిని మండ‌ల కేంద్రం చేయాలని వినతిపరిశీలిస్తామని హామీ వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జ‌నంలోనే, జ‌నంతోనే ఉండే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడ‌రు. జ‌నంతో ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌నుకుంటారు. అలా… అనేక సంద‌ర్భాల్లో ప్ర‌వ‌ర్తించిన మంత్రి మ‌రోసారి త‌న రూటే సెప‌రేట‌ని నిరూపించారు. బుధవారం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్తూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం) క్రాస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలోని సింగ‌రాజుప‌ల్లి, ఆ చుట్టు పక్కల గ్రామాల‌కు చెందిన ప‌లువురు మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆ ప‌క్క‌నే ఉన్న చిన్న గుడిసె హోట‌ల్ ముందు ఆగారు. అక్క‌డే ప్ర‌యాణికుల కోసం వేసి ఉన్న ఓ చైర్ మీద కూర్చున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారు సింగ‌రాజుప‌...
బైక్ కవర్లో పైసలు మాయం
Crime, District News, Mahabubabad

బైక్ కవర్లో పైసలు మాయం

షాపులోకి వెళ్లొచ్చేసరికి అపహరించిన దుండగులురూ.4లక్షలు చోరీ చేశారంటున్న బాధితుడుస్టేషన్ లో ఫిర్యాదు.. పోలీసుల విచారణమహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్: ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకొని నగదును తన ద్విచక్ర వాహనంలోని ట్యాoకు కవర్ లో పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యలో ఓ షోరూమ్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చే సరికే దుండగులు 4 లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి..జిల్లాలోని మల్యాల గ్రామశివారు రామోజీ తండాకు చెందిన బానోతు శ్రీను అనే రైతు జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ఎస్బీఐలోని తన ఖాతా నుంచి రూ.4లక్షలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనంలోని ట్యాంక్ కవర్ లో పెట్టుకొని బయలు దేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ షోరూమ్ ఎదుట వాహనాన్ని పార్కింగ్ చేసి షోరూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చి ...