Warangalvoice

District News

హ‌ద్దు మీరొద్దు
District News, Political, Warangal

హ‌ద్దు మీరొద్దు

పార్టీ క్యాడ‌ర్‌కు ఎమ్మెల్యే చ‌ల్లా హెచ్చ‌రిక‌విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై సీరియ‌స్‌ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చ‌ర్య‌లుజ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రించాలంటూ హిత‌వుప‌ర‌కాల‌లో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి ‘‘ప్ర‌జా సేవే ల‌క్ష్యంగా పార్టీ క్యాడ‌ర్ ముందుకు సాగాలి.. ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూ వారి అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి.. ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప‌ర‌కాల‌లో తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలి.. వివాదాల్లో త‌ల‌దూర్చుతూ హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రిస్తే వేటు త‌ప్ప‌దు..పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు.. పార్టీలో ప‌ట్టప‌గ్గాలు లేకుండా వ్య‌వ‌హ‌రించేవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు..’’ అంటూ ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారావు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిసింది. ప‌ర‌కాల ...
డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ
District News, Hanamkonda

డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ

వరంగల్ వాయిస్, కాజీపేట : దర్గా కాజీపేటలో ఉన్న తన ఇంటి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన బండ మీద మీద పడబోయిన ఒక వ్యక్తిని కాపాడి తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నమస్తే తెలంగాణ రచయిత, యూనివర్సిటీ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్ కు ఎడమ చేయి మణికట్టు కీలు విరిగిపోయి బలమైన దెబ్బలు తగలి చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి పరిస్థితిని తెలుసుకొని ఫోన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దీనికి వారు స్పందిస్తూ తారక రామారావు గొప్ప మానవతావాది అని ప్రమాదవశాత్తు కాలు విరిగి తాను తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ కూడా నాకు జరిగిన ప్రమాదాన్ని వెంటనే తెలుసుకొని నన్ను పలకరించడం నాకు ఎంతో భరోసాను ఇచ్చిందని బైరి నిరంజన్ తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, యూనివర్సిటీ అధ్యాపక సంఘం చైర్మన్ డాక్టర్ పి.కరు...
పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి
District News, Mahabubabad

పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి

వరంగల్ వాయిస్, తొర్రూరు : పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని, ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తొర్రూరు మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి.రఘునారాయణ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య హాజరై మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సంఘం పనిచేస్తుందని, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని తెలిపారు. పెన్షనర్స్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ప్రతి నెల 1న జీతాలు ఇవ్వాలని, మెడికల్ బిల్స్ ను వెంటనే మంజూరు చేసి, సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 398 వేతనంపై పనిచేసిన టీచర్స్ కు నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి, లైఫ్ సర్టిఫికెట్స్ ఆన...
ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు
District News, Hanamkonda

ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు

వరంగల్ వాయిస్, కేయూ : ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రముఖ ఫార్మసీ సంస్థ అలయన్స్ అండ్ ఎకో సిస్టం మేనేజ్ మెంట్ సంచాలకుడు డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో సెమినార్ హాల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో నేడు “డ్రగ్ డెవలప్ మెంట్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ : పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం చేశారు. ఫార్మసీ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. మారుతున్న జీవన్ శైలికి అనుగుణంగా డ్రగ్ డెవలప్ మెంట్ లో మార్పులు వస్తున్నాయన్నారు. దీనికి అనుగుణంగా రోగ నిర్ధారణ ఉండాలన్నారు, ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్ధి అయ...
స్వేరోస్ జ్ఞాన సంకల్పసభ గోడపత్రిక ఆవిష్కరణ
District News

స్వేరోస్ జ్ఞాన సంకల్పసభ గోడపత్రిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, కేయూ : స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈనెల 31న సిద్దిపేటలో నిర్వహించ తలపెట్టిన జ్ఞాన సంకల్ప సభ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ లను హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ముందు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బీ.ఎస్.ఎఫ్) కేయూ అధ్యక్షుడు మన్నే దినాకర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం స్వేరోస్ ఇంటర్నేషనల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్ర ప్రసాద్, బీఎస్ ఎఫ్ కేయూ ఇంఛార్జి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల మనోహర్ మాట్లాడుతూ స్వేరో జ్ఞాన సంకల్ప సభకు చీఫ్ గెస్ట్ గా స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటున్నారని తెలిపారు. బహుజన మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వరంగల్ జిల్లా మాజీ జాయింట్ సెక్రటరీ శనిగరపు శాజన్, బీఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర...
31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్
District News, Hanamkonda

31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్

వరంగల్ వాయిస్, కేయూ : ఈ నెల 31న తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్ కరపత్రాన్ని యూనివర్సిటీ లైబ్రరీ ఆవరణంలో శుక్రవారం టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరాపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ లంక రాజ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పైన ఉద్యోగాల ప్రకటన చేసి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి అందులో భాగంగా 17,516 ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం ఈ మెగా మోడల్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారుల చేత, ఉత్తమ అధ్యాపకుల చేత ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నామని, ఈ మోడల్ టెస్ట్ ను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగ...
పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి
District News

పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు అనుమాండ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో హాసన్ పర్తి మండల కేంద్రంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే, బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపైన క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన...
అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..
Crime, District News

అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..

బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తారు..వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషివిష్ణుప్రియ గార్డెన్స్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు వరంగల్ వాయిస్, క్రైం: వివిధ సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే అపరిచత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారన్ని పంచుకోవద్దని యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ , మత్తు పదార్థాలపై కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక హంటర్ రోడ్ లోని విష్ణు ప్రియ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం రోజు, రోజుకి అధికం కావడంతో పాటు, అదే స్థాయిలో ఇంటర్ నెట్ ను వినియోగించుకోని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ, ప్రజల డబ్బును దోచేస్తున్నారన్నారు. ఇందుకు ముఖ్య కారణం నెట్ వి...
ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్
District News, Today_banner, Top Stories

ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్

సామాజిక సేవే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఅమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఆలోచన..పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న తపనపేద విద్యార్థులకు భరోసాగా ట్రస్ట్ ఏర్పాటువిద్యా స్ఫూర్తిగా సాగుతున్న బృహత్తర కార్యక్రమం ‘‘పేదరికం ఎంతో కఠినమైనదో తెలుసు.. దాని ఫలితాలు మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసు.. పేదరికంపై విజయం సాధించాలంటే సగటు జీవికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధం.. చిన్నతనంలో అమ్మనాన్న పడిన కష్టమే తనను ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసేలా చేసింది..’’ ఈ మాటలు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చిట్ల పార్థసారథి హృదయాంతరాల్లోనుంచి వచ్చినవి. అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడానికి చిట్ల ప్రమీల - జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ యేడాది పేద ప్రతిభావంతులకు ప్రోత్సాహంగా నగదు పురస్కా...
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
District News, Hanamkonda

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన శీలం ప్రవీణ్ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న విషయం స్థానిక నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధి నుంచి రూ. లక్ష మంజూరు చేయించి గురువారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి ఆనంద్ శారద, చెన్న ప్రకాష్, ఎర్రోజు భాస్కర్, దూల్ పేట రాజు, పానుగంటి శ్రీధర్, కేదారి మధు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు....