Warangalvoice

District News

రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్య‌క్షుడిగా అశోక్‌బాబు
District News, Warangal

రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్య‌క్షుడిగా అశోక్‌బాబు

నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకారం వ‌రంగ‌ల్ వాయిస్‌, ఖిలా వ‌రంగ‌ల్ : రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సం సోమ‌వారం కాశిబుగ్గలోని వేడుకల మందిరంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ డాక్ట‌ర్‌ శరత్ బాబు నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా బేతి అశోక్ బాబు, సెక్రటరీగా భేతి సతీష్, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సంద‌ర్భంగా నూత‌న అధ్యక్షుడు బేతి అశోక్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంలో రోట‌రీ క్లబ్ ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పేదలకు ఐదు కుట్టుమిషన్లు, స్కూలుకు పోయే పిల్లలకు ఐదు సైకిళ్లు ఉచితంగా అందజేశారు. కాశిబుగ్గ ఎస్సార్ నగర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల‌కు ప్యాడ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్, చైర్స్ అందించారు. బేతి అశోక్ ఆధ్వర్యంలో 25 మంది ...
ర‌హ‌దారి మరమ్మతులు చేయండి
District News, Warangal

ర‌హ‌దారి మరమ్మతులు చేయండి

హైదరాబాద్‌లో రోడ్లు, భ‌వ‌నాల చీఫ్ ఇంజనీర్‌కు గంట రవికుమార్ వినతివ‌రంగ‌ల్ వాయిస్‌, వ‌రంగ‌ల్ : గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిన వరంగల్ బట్టల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇత‌ర ఆర్ అండ్ బీ ర‌హ‌దారుల మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేత గంట రవికుమార్ కోరారు. ఈ మేర‌కు హైదరాబాద్‌లో సోమవారం ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (రోడ్స్ అండ్ సీ ఆర్ ఎన్) పి.రవీందర్ రావు, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్(అడ్మినిస్ట్రేషన్) పింగళి సతీష్ లను కలిసి రోడ్ల దుస్థితిని తెలిపే ఛాయా చిత్రాలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. అనంతరం గంట రవి కుమార్ మాట్లాడతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి అడుగడుగునా గుంతలమయంగా మారి, ప్రమాదాలు జరుగతున్నాయంటూ వారికి వివరించినట్టు పేర్కొన్నారు. వరంగల్ మహానగరం రోడ్ల దుస్థితిపై చర్చించినట్టు తెలిపారు. వాల్ మార్ట్ నుంచి రంగశాయిపేట్ మీదుగా ఖిలా వరంగల్ కోట రోడ్డు డివైడర్ పనులు పూర్తికాక ప్రజలు తీవ్ర...
లాయ‌ర్ దారుణ హ‌త్య‌
Crime, District News, Mulugu

లాయ‌ర్ దారుణ హ‌త్య‌

వ‌రంగ‌ల్ వాయిస్‌, ములుగు : ములుగు జిల్లాలో సోమ‌వారం రాత్రి ఏడు గంట‌ల ప్రాంతంలో లాయ‌ర్‌ను దారుణంగా హ‌త్య చేశారు. ములుగు జిల్లా కేంద్రానికి 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. హ‌త్య‌కు గురైన వ్య‌క్తి న్యాయవాది మల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎర్ర మట్టి క్వారీ.…భూ త‌గాదాలు.. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....
దంచికొట్టింది
District News, Hanamkonda

దంచికొట్టింది

గంటన్నర వర్షం.. ఆగమాగం చేసింది..మహా నగరం అతలాకుతలంఉప్పొంగిన డ్రైనేజీలు, నాలాలుఎటూ చూసినా నీళ్లేఎక్కడికక్కడా ట్రాఫిక్ జాంలు వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం జలమయమైంది. సోమవారం మధ్యాహ్నం చడీచప్పుడు లేకుండా ఒక గంట పాటు జోరు వాన కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు జలమయమైపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ బస్టాండ్ ప్రాంగణం అంతా నీళ్లు చేరాయి. అలాగే కేడీసీ మీదుగా పెద్ద ప్రవాహం వెళ్లడంతో బస్టాండ్ నుంచి అశోక జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాకాజీ కాలనీలో అంతటా నీళ్లు నిలిచిపోవడంతో రోడ్డుపై ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిట్ సమీపంలోని త్రివేణి సూపర్ మార్కెట్ ఎదుట హైదరాబాద్ రోడ్డుపై వెళ్తున్న వరద పెద్ద వాగును తలపించింది. మోకాళ్ల లోతు నీళ్లు వెళ్లడంతో బైక్, ఆటో, కార్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ పక్కనే ఉన్న ఎస్బీహెచ్ కాలనీలోకి నీళ్లు...
సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్
District News, Legend, Today_banner, Top Stories

సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్

విద్యావేత్త నుంచి కుడా చైర్మన్‌ దాక సుందర్‌ రాజ్‌ యాదవ్‌ విజయ ప్రస్థానంఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన విధేయుడిగా పేరుఅందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా..చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కు కుడిభుజంగా ప్రసిద్ధిఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్ యాదవ్ సొంతం. ఓపిక, సహనం ఆభరణాలుగా, నిబద్ధత, నిజాయితీ పెట్టుబడిగా ఎదిగిన వినయశీలి. దశాబ్దకాలం ఎదురుచూపులకు కుడా చైర్మన్ పదవి రావడం.. ఉద్యమకారుడికి లభించిన సముచిత గౌరవం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కమ్యూనిటీల్లో ఒకటైన యాదవ కులానికి దక్కిన గుర్తింపు.. ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఘనంగా సన్మానించనుంది. 31న (రేపు) హనుమకొండ చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ ...
కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..
Crime, District News, Warangal

కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనంవివరాలు వెల్లడించిన తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన షిండే జితేందర్, షిండే అశోక్ తో పాటు హనుమకొండ జిల్లా పద్మాక్షీ ప్రాంతానికి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు అన్నాదమ్ములు కావడంతో వీరు తరుచుగా కలుసుకునేవారు. ఇదే సమయంలో నిందితులు ముగ్గురు కలిసి మద్యం తాగడంతో పాటు జల్సాలు చేసేవారు. దీంతో వీరు చేసే చిన్న చిన్న పనుల కారణంగా వీరికి వచ్చే అదాయం వీరి జల్సాల...
నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి
Crime, District News, Warangal

నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, మిస్సింగ్, ఎన్.డి.పి.ఎస్, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఈ. పెట్టి కేసులకు సంబంధించి గత ఏడాదికి , ఈ సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కేసుల వ్యత్యాసాలపై సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి విశ్లేషించారు. అనంతరం ప్రస్తుతం నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ,...
వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
District News, Hanamkonda

వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్స్వనిధి మహోత్సవ్ ప్రారంభం వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: వీధి వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శనివారం హన్మకొండ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన ‘‘పట్టణ ప్రగతి స్ట్రీట్ వెండర్స్ డెవలప్మెంట్ స్వనిధి మహోత్సవ్’’ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ .. స్వ నిధి మహోత్సవం పండగ వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహా నగరవ్యాప్తంగా 47,800 మంది వీధి వ్యాపారులను గుర్తించి 27 వేల మందికి 10 వేల రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. రుణాలే కాకుండా చిరు వ్యాపారులకు శాశ్వత చిరునామా కల్పించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 3 కోట్ల రూపాయలతో ...
తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..
Crime, District News, Warangal

తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..

ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం నుంచి తహసీల్దార్ , కలెక్టర్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి తన అనారోగ్యం క్షీణించి చివరగా శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ తనకు స్వార్జితమైన భూమి తనకు దక్కాలని, ఇద్దరు కూతుర్లకు అందాలని నిత్యం మధన పడుతూ అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరం అని , ధరణి తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పొగాకు మహేందర్ మృతి చెందాడని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పొగాకు మహేందర్ కు ఉండబడిన భూమిని తక్షణమే పట్టాకు ఎక్కించి, రైతు...
టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు
District News, Hanamkonda, Political

టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు

గులాబీకి కన్నెబోయిన రాజయ్య గుడ్ బైత్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వరంగల్ వాయిస్, హనుమకొండ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆత్మగౌరవం లేని టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్‌ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి నడిచిన నేతగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుగురు సీనియర్‌ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య ఒకరుగా నిలిచారు. కరీంనగర్‌ అలుగునూర్‌ వద్ద అరెస్ట్‌ అయి ఖమ్మం జైలులో కేసీఆర్‌తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్‌ కూడా ఉన్నారు. రాజీమానామాపై విూడియాతో మాట్లాడిన రాజయ్య… టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం లేదన్నారు....