Warangalvoice

District News

యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి
Crime, District News, Telangana

యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి

దొంగనోట్ల ముఠా అరెస్ట్ నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), న్యూరాయపురకు చెందిన యం.డి సమీర్ (ప్రస్తుతం పరారీలో వున్నాడు), పెద్దమ్మగడ్డకు చెందిన పేరాల అవినాష్, నర్సంపేటకు చెందిన కత్తి రమేష్, మచిలీబజార్ కు చెందిన యం.డి అక్రం ఆలీ, కాజీపేటకు చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్...
సాయంలోనూ తగ్గేదేలే..
District News, Telangana, Viral News

సాయంలోనూ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ ఔదార్యం.. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ అల్లు వారి అబ్బాయి.. నటుడిగానే కాకుండా రియల్ లైఫ్ తన మంచి మనస్సుతో అందరినీ హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. అభిమానులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంతింటి వారిలాగా చూసుకోవడం ఆయనకే చెల్లింది. తాను మాత్రమే బాగుండడం కాదు.. తన దగ్గర పనిచేసేవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్త...
బావిలోకి దూసుకెళ్లిన కారు
Crime, District News, Mahabubabad

బావిలోకి దూసుకెళ్లిన కారు

ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి వ‌రంగ‌ల్ వాయిస్‌, కేస‌ముద్రం : దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న కారు శుక్ర‌వారం రాత్రి ఆరున్న‌ర గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కేస‌ముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం ష‌రీఫ్‌కు కారులో ఐదుగురు బ‌య‌లు దేరారు. తిరిగి వ‌చ్చే క్ర‌మంలో హ‌హ‌బూబాబాద్‌కు చెందిన మ‌రో ఇద్ద‌రు వీరితో క‌లిశారు. మొత్తం ఏడుగురితో అన్నారం ష‌రీఫ్‌లో బ‌య‌లు దేరిక కారు కేస‌ముద్రం బైపాస్ రోడ్డులో ప్ర‌మాదానికి గుర‌యింది. అయితే కారులో భ‌ద్రుతోపాటు చిన్నారి, మ‌రోక‌రు ఉండ‌గా, అచాలితోపాటు మ‌రో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ప్ర‌మాదానికి సంబందించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.  ...
డోర్నకల్ యాదవుల్లో ముసలం
District News, Mahabubabad

డోర్నకల్ యాదవుల్లో ముసలం

సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గొర్రెల పెంపకదారులు కొందరితో కలిసి కలిసి బుధవారం పశు వైద్యుడు సురేష్ కు వినతి పత్రం అందించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో సందేహాలను డాక్టర్ ను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై రికార్డైన వీడియోను కొందరూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై కేశబోయిన మల్లేశం ఘాటుగా స్పందించారు. డోర్నకల్ మండల గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ పదవీ కాలం ముగిసిందని, య...
క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో స్వయం పాలన దినోత్సవం
District News, Hanamkonda

క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో స్వయం పాలన దినోత్సవం

వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానికి డీజిల్ కాలనీలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం రోజున స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఉ త్తమంగా బోధించిన పలువురు విద్యార్థులకు ప్రిన్సిపాల్ శీరీష బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ షరీఫ్, ప్రిన్సిపాల్ శీరిష, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు....
అధికారులే అక్రమార్కులు – చేనేత దందాలో అంద‌రూ వాటాదారులే..
District News, Today_banner

అధికారులే అక్రమార్కులు – చేనేత దందాలో అంద‌రూ వాటాదారులే..

ల‌క్ష‌ల్లో జీఎస్టీ ఎగ‌వేత‌ నిద్ర మ‌త్తులో చేనేత, జౌళి శాఖ‌ ప‌ర్సంటేజీల వారీగా పంప‌కాలు ఆడిట్ రిపోర్టుల‌పై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌చే సంత‌కాలు ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ గండి చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికుల డిమాండ్   చేనేత కార్మికుల‌ను అన్ని విధాలుగా ఆదుకోవాల‌న్న లక్ష్యంతో వివిధ కాంపొనెంటుల కింద కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ప్ర‌వేశ పెట్టిన ఆర్ ఆర్ ఆర్ ప‌థ‌కం చేనేత, జౌళి శాఖ అధికారుల‌కు కాసుల పంట పండించింది. కోట్ల రూపాయ‌ల విలువ చేసే చేనేత ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసిన‌ట్లు ఆడిట్‌లో చూపించినా ఎక్క‌డ కూడా జీఎస్టీ చెల్లించిన‌ట్లు లేక‌పోవ‌డం వారి అక్ర‌మాల‌కు అద్దం ప‌డుతోంది. చేనేత, జౌళి శాఖ‌లో రూ.3కోట్ల కుంభకోణం పేరిట ‘వ‌రంగ‌ల్ వాయిస్’ దిన‌ప‌త్రిక నెల రోజుల క్రిత‌మే అధికారుల అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకురావ‌డంతో ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. అయి...
256కిలోల గంజాయి స్వాధీనం
Crime, District News

256కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు నిందితుల అరెస్ట్ వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం వెల్లడించారు.. కామారెడ్డి జిల్లాకి చెందిన పల్లపు రాజు , పల్లపు రాజు, బోడ సుమన్ అనే ముగ్గురు 4 సంవత్సరాలుగా భద్రాచలం, డొంకరాయి, సీలేరు, ధారకొండ ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలలో వారి ట్రాక్టర్ తో భూమిని చదును చేసేందుకు పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలో సత్తి బాబుకి చెందిన భూమి అల్లురికోట ఒడిషా రాష్ట్రంలో రూ.70,000 లకు కుదుర్చుకొని అతడి భూమిని చదును చేశారు. ...
నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష
District News, Hanamkonda

నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష

మనమంతా ఈ దేశానికి, ధర్మానికి రక్ష బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: ‘తోబుట్టువులు లేని నాకు మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు నన్ను కట్టిపడేశాయి..’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి 11వ డివిజన్ పోతననగర్ కాలనీ మహిళలను కొనియాడారు. గురువారం ఆయనకు పలువురు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మనసా వాచా అందరికీ అన్నలా అండగా ఉంటానన్నారు. రక్షా బంధన్ బంధానికి కులమతాలు అడ్డుకాదన్నారు. రక్షా బంధన్ అంటే ఒకరికి ఒకరు రక్షణగా ఉండాలని, నాకు నువ్వు రక్షా నీకు నేను రక్షా.. మనమంతా ఈ దేశానికి ధర్మానికి రక్ష అన్నది మాకు చిన్నప్పటి నుంచి సంఘ్ శాఖలో నేర్పిందన్నారు. ప్రధాని మోడీకి పాకిస్తాన్ నుంచి ఒక ఆడపడుచు ప్రతీ ఏడూ రాఖీ కడుతుందన్నారు....
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ
District News, Telangana

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ పదవి కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడ‌మి శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్న ఉద్య‌మ కారుడు అల్లం నారాయణకు ప‌లువురు జర్నలిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు....
‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్
Crime, District News, Mulugu

‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్

వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి, ఏ4 తడక రమేష్ లను ప్రవేశపెట్టారు. హత్య నేరం అభియోగంపై రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించి ఖమ్మం జైలుకు తరలించారు....