Warangalvoice

Cultural

ముగిసిన ఆషాడ మాసం
Cultural

ముగిసిన ఆషాడ మాసం

చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు వరంగల్జూ వాయిస్, 28(ఆర్‌ఎన్‌ఎ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకే చోట సవిూపంగా చేరినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. తర్వాత సూర్యుని నుండి చంద్రుడు ప్రతిదినం తూర్పువైపు కదులుతాడు. ఈ చంద్రగతి ఆధారంగా చంద్రామానం ఏర్పడుతుంది. సూర్యుని నుండి చంద్రుడు 12 డిగ్రీలు నడిస్తే ఒక తిధి అవుతుంది. ఇలాగ ఒక అమావాస్య నుండి ఇంకో అమావాస్య వరకు 29 రోజుల 44. నిమిషాల 2.87 సెకండ్ల కాలం జరుగునని వేద జ్యోతిషం తెలుపుతుంది. ఈ అమావాస్యకు పితృ దేవతలు అదిపతులుగా ఉంటారు. పంచాంగ ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్...
రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు
Cultural, District News

రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు

వరంగల్ వాయిస్, ములుగు రోడ్: నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఈ నెల 29 వ తేదీ శ్రావణ మాసో ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వరద దత్త క్షేత్రం ట్రస్ట్ సభ్యులు అడ్డగుడి వెంకటేశ్వరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో ఈ నెల 29 తేదీ మొదటి శుక్రవారం అమ్మవారికి పండ్లతో అర్చన ఆగస్ట్ 5వ తేదీన వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ హోమం, 12 వ తేదీన అమ్మవారికి పూలతో అర్చన, 19 వ తేదీన అమ్మవారికి తమలపాకులు వక్కలతో అర్చన లక్ష్మీ హోమం, 26 వ తేదీన అమ్మవారికి జాకెట్ ముక్కలతో అర్చన, 21వ తేదీన దశమి సందర్భంగా ఆశ్రమంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ అనగాష్టమి వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ స్వామిజీ కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు....
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం
Cultural, District News, Hanamkonda

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం

వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా అప్లై చేశాడు.197 దేశాల పేర్లు రాజధాని, కరెన్సీ, భాషలు అవలీలగా చెప్పగలడు. రికార్డు ఇంతవరకు ఎవరు సాధించలేదు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా బింగి నరేందర్ గౌడ్, అడ్డగట్ట గంగాధర్, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు....
రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం
Cultural, Telangana

రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మయూరి ఆర్ట్స్ , తెలంగాణ అర్ట్స్ కల్చరల్ అకాడమీ, (భవిరి అర్ట్స్ )అధినేత మిమిక్రీ శివ ఆధ్వర్యంలో సోమవారము రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాలులో విశ్వ సంస్కృతి నంది పురస్కారాలు 2022 నిర్వహించారు. ప్రతిభ కల్గిన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు ఈ నంది అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మన వరంగల్ జిల్లాలోని 35 డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ రాగి దామోదర్ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రతిభకు గుర్తింపుగా ఈ నంది పురస్కారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన సినీ నటులు కోటేశ్వరరావు, కిషోర్ దాస్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివ, ఆర్గనైజేషన్ మునుకోటి డేవిడ్ రాజు, డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేతుల మీదుగా ఈ నంది అవార్డ్స్ రాగి దామోదర్ అందుకున్నారు. మిమిక్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఎన్నో ఉన్నత శిఖరాలు చేరు...
మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం
Cultural

మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం

వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : మాస శివరాత్రి సందర్బంగా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం గణపతి రుద్ర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం అన్న పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గుండేటి రజిని కుమార్, మార్త దీపక్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
మట్టి విగ్రహాలపై ముందస్తు చర్యలేవి?
Cultural, Top Stories

మట్టి విగ్రహాలపై ముందస్తు చర్యలేవి?

దగ్గరకొస్తున్న వినాయక చతుర్థిపలు ప్రాంతాల్లో ప్రారంభమైన విగ్రహాల తయారీపీఓపీ విగ్రహాలకే తయారీదారుల మొగ్గుచెరువుల నీటిని కలుషితం చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగంముందస్తు అవగాహన కల్పించడంలో బల్దియా విఫలంమట్టి విగ్రహాలనే వాడాలంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలుగ్రేటర్‌ తీరును ఎండగడుతున్న పర్యావరణ ప్రేమికులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తోపాటు వివిధ రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి.. చెరువుల్లోని నీరు కలుషితం అవుతుండడంతో వాటిలో నివసించే జీవ జాతులు అంతరించిపోతున్నాయి.. అందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజిస్తామంటూ ప్రతీనబూనాలి.. ఇదే అన్నివిధాలా శ్రేయస్కరం.. ఈ రోజు మనం నిర్మించే సమాజమే మన భావితరాలకు స్వేచ్ఛా వాయువులను ఇస్తుంది.. అంటూ ప్రతియేడు వినాయక చవితి పండుగ సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బల్దియా సిబ్బంది ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తుంటారు. కాని ఆచర...
శాకంబరి శరణం మమ:
Cultural, Top Stories

శాకంబరి శరణం మమ:

అంగరంగ వైభవంగా ముగిసిన భద్రకాళి నవరాత్రోత్సవాలు4 టన్నుల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణసేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాలనుంచి సేకరణజోరువానలోనూ తరలి వచ్చిన భక్తులుభారీ బందోబస్తు చేసిన పోలీసులు జై భద్రకాళీ.. జై జై శాకంబరి మాత.. అంటూ భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. అమ్మవారి శాకంబరి నవరాత్రులు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు భద్రకాళి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ కోసం సేంద్రియ పద్ధతిలో పండిరచిన 4 టన్నుల పండ్లు, కూరగాయలను తెప్పించారు. ఈ వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షంలో సైతం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శాకంబరి అలంకరణలో ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రోత్సవాలకు సహకరించిన అందరికీ ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.-వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌ వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌ : నగరంలోని సుప...
సమస్యలు మమ:
Cultural, Top Stories

సమస్యలు మమ:

‘భద్రకాళి’ సన్నిధిలో అంతా ఆగమాగంసమయపాలన పాటించని సిబ్బందిఇష్టారాజ్యంగా పార్కింగ్‌చెప్పుల స్టాండ్‌ ఉన్నా ఉపయోగమే లేదుప్రసాదాల కోసం ఎండలోనే క్యూవిడిది సౌకర్యాన్ని వినిపించుకోని ఆలయ అధికారులుబిచ్చగాళ్లతో బెంబేలెత్తుతున్న భక్తులు శ్రీ భద్రకాళీ దేవస్థానంలోని అమ్మవారిని తనివితీర దర్శించుకుందామని వచ్చే భక్తులకు ఇక్కడి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయ పరిధిలో లెక్కకు మించి సిబ్బంది ఉన్నా ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇందులో చాలా మంది దేవాదాయ శాఖకు చెందిన వారు కాగా మరి కొందరు కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని పర్యవేక్షించే వారు లేకపోవడంతో అంతా దైవాదీనంగా మారింది. అయితే కొంతమంది సిబ్బంది ఆఫీసుకు వచ్చి అందరికీ అలా కనిపించి రిజిస్టర్‌లో సంతకం పెట్టి తర్వాత సొంత పనులకోసం బయటికి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయంలో పర్యవేక్షణ గాడి...
విరోధినీ క్రమంలో భద్రకాళి
Cultural

విరోధినీ క్రమంలో భద్రకాళి

శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు సోమవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్ర పుష్పాలతో ముగిసింది. అమ్మవారిని విరోధినీమాతగా షోడశీ క్రమాన్ని అనుసరించి వహ్నివాసినిగాను అలంకారం జరిపి పూజారాధనలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య ఆలయాన్ని సందర్శించారు.-వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌...
‘కుల్లా’ క్రమంలో అమ్మవారు
Cultural

‘కుల్లా’ క్రమంలో అమ్మవారు

శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారిని ‘‘కుల్లా’’ క్రమంలో అలంకరించారు. ‘‘కుల్లా’’ భూమిని ఉద్ధరించిందని, అందుకే అమ్మవారిని ‘కుల్లా’గా పిలుస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. నారాయణమూర్తిలోని వారాహి శక్తియే ఈ కుల్లా మాత అని పేర్కొన్నారు. అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి అనిల్‌ రాజార్‌, ఎంపీ ఓంప్రకాష్‌ మాధుర్‌ , మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు దర్శించుకున్నారు. -వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌...