Warangalvoice

Cultural

అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు
Cultural, Telangana

అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు

శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ జయంతి ఏప్రిల్ 30న వరంగల్ వాయిస్, ప్రత్యేకం: జీవితాన్ని కవిత్వంలోనూ వడబోస్తూ, తెగిన గాలి పటంలా గడిపానని శ్రీ శ్రీ అనేవారు. 1936లో ‘వీణ’ పత్రిక సంపాదక వర్గంలో కొంత కాలం పనిచేశారు. 1938లో ఆంధ్రప్రభలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. శ్రీ శ్రీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, కవితా వ్యాసంగం మాత్రం వదలలేదు. ఆనాటి రోజుల్లో అధికంగా వాడుకలో ఉన్న సంప్రదాయ, భావ కవిత ధోరణులు ఆకర్షించిన వాడైనా, కొన్ని కొత్త ధోరణులు తన కవితలో శ్రీ శ్రీ ప్రదర్శించే వారని, ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితరులు పేర్కొన్నారు. శ్రీ శ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ అఖిలాంధ్ర కీర్తి తెచ్చి పెట్టింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించిన నవ్య సాహిత్య పరిషత్తును 1936లో ప్రారంభించడంలో శ్రీ శ్రీ కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే 1937లో తన ఆప్తమిత్రుడు కొంపెల్లి జనార్ధనరావు మరణించ...
భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్
Cultural, District News, Telangana

భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్

అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న వరంగల్ వాయిస్, కల్చరల్ :  అంబేద్కర్ అంటే అందరికి అర్థమయ్యేది ఆయన అంటరాని కులంలో పుట్టాడని, కాదంటే దళిత నాయకుడు అని అయితే ఈ దేశానికి రాజ్యాంగం రాసినాయన రాజ్యాంగ నిర్మాతగా పరిచయం అవుతాడు. మరి కొంత మందికి సామాజిక విప్లవకారుడుగా కనిపిస్తాడు. ఇంకొంత మందికి సాంఘీక సంస్కర్తగా కనిపిస్తాడు. వేరే వారికి ఒక న్యాయవాదిగా న్యాయశాఖ మంత్రిగా కనిపిస్తే మరికొంత మందికి మంచి రచయితగా కనిపిస్తాడు. భారతదేశంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కావలసిన పరిశోధనలు చేశాడు. పరిశోధనాసార పుస్తకాలుగా రాశాడు. ఆయన ఎంచుకున్న పరిశోధనలు కూడా చాలా క్లిష్టమైనవి. అంటరానితనం అంటే ఏమిటి? వారు అంటరాని వారు ఎలా అయ్యారు? అనేవి. శూద్రులెవరు? అనేవి? శుద్రులెవరు? కుల నిర్మూలన అంశాల మీద పుస్తకాలు రాశాడాయన. భారతదేశంలోని రచయితలు సామాజిక శాస్త్రవేత్తలు ‘కులం’ గురించి పరిశోధనలు చేయలేదు. పుస్తకాలు...
దేశభక్తికి నిలువెత్తురూపం
Cultural, District News, Hanamkonda

దేశభక్తికి నిలువెత్తురూపం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు హెగ్డేవార్ జయంతి ఏప్రిల్ 1న వరంగల్ వాయిస్, కల్చరల్ : ఆయన ఆదికేశవుడు, ఆయన ఆత్మ బలరాముడు ఆయన అవిశ్రాంత వార్ కు ప్రతిరూపం అన్ని అంకాలలో తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ మహనీయ నాయకుడు డాక్టర్ బలిరాం హెగ్డే వార్ 134 సంవత్సరాల క్రితం జన్మించి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ పతాకంగా రెపరెపలాడుతున్న వాడు అందరి చేత వందనాలు అందుకుంటున్న వాడు పెద్దవారు 1889 ఏప్రిల్ ఒకటో తేదీన ఉగాది పర్వదినాన నాగపూర్ లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్డేవారు జన్మించారు. డాక్టర్ జీ పుర్వీకులు నిజామాబాద్ జిల్లా వాసులు. కేశవరావ్ ఆజన్మ దేశభక్తులు. మనల్ని బానిసరలుగా చేసి పాలిస్తున్న విదేశీయులను ఈ దేశం నుంచి ఎలా పంపించాలా అని ఆయన బాల్యం నుంచే బలంగా ఆలోచించేవారు హెగ్డే వార్ "నీట్ సీట్" హైస్కూల్లో చదివే రోజుల్లో దేశంలో వందేమాతరం ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో పర్యవేక్షణ కోసం వచ్చిన అధికారికి "న...
ప్రజలను ఐక్యం చేయడంలో జాతరల పాత్ర పెద్దద
Cultural, Telangana

ప్రజలను ఐక్యం చేయడంలో జాతరల పాత్ర పెద్దద

పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి 5 నుంచి 9 వరకు జాతర: జగదీశ్‌ రెడ్డి వరంగల్ వాయిస్, సూర్యాపేట: సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరకు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సూర్యాపేటలోని గొల్ల బజార్‌ ఎల్లమ్మ గుడిలో పెద్దగట్టు జాతరలో తొలి ఘట్టమైన మకర తోరణం తరలిపు పక్రియను ప్రత్యేక పూజలు చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి భేరీలు వాయించారు. అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం కల్పించామన్నారు. ఆదివారం రాత్రి కేసారం నుంచి దేవర పెట్టే తరలింపు పక్రియ ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి...
Cultural, District News, Telangana

అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు

రథసప్తమి జనవరి 28న సూర్యుడుదయించే తూర్పు దిక్కు అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలు.కోటి సూర్యమండల మధ్యస్థమైన మహాత్రిపురసుందరీదేవి తన మూల స్థానాన్ని సూర్యుడియందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంతశక్తి భాండాగారం. ఇంతటి పౌరాణిక, వైజ్ఞాజనిక ప్రాభవంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది. కనుకనే రథసప్తమి పర్వదినమైంది. మాఘ సప్తమి తిథి నుండి సూర్య కిరణాలు వేడిని, వెలుగును, శక్తినీ, ధాతుపుష్టినీ మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు అంతరంగ దర్శనాన్ని వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను జాతి, మత, వర్గ, వర్ణనాతీతమైన స్థాయిలో ప్రసరించే రథసప్తమి, సూర్యోపాసనలో ఒక మహత్తరమైన భూమిక. ఈ క్షణం నుండీ జీవుడి ప్రయాణాన్ని వడి వడిగా సాగించే మహాబోధక శక్తి అనుభవమౌతుంది. అవిద్య, అనాచారం, అస్పష్టత, అహంకారం అనబడే చీకటిని నశింపజేసే వినాశక శక్తీ, దేహ, మనో బుద్ధులను వికాసమానం చేయగల శక్తి సూర్య కిరణాల...
శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
Cultural, Telangana

శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

రెండురోజుల పాటు భారీగా తరలివచ్చిన నగర వాసులు ఆక్టుటకున్న బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: పల్లె సొగసులు… ప్రకృతి అందాలతో నగర ప్రజలకు ఓ గ్రావిూణ ప్రాంతంగా ఆకట్టుకుంటున్న శిల్పారామంలో సంక్రాంతి సందడి నగరవాసులను ఆకట్టుకుంది. పల్లెలకు వెళ్లలేకపోయిన పట్టణవాసులు సంక్రాంతి వేడుకలను ఇక్కడ ఆస్వాదించారు. భోగిమంటలు, రంగురంగుల రంగవల్లికలతో శిల్పారామం స్వాగతం పలుకింది. బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో సందడి సందడిగా మారింది. సోమ,మంగళవారాల్లో శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి వరకు గంగిరెద్దు విన్యాసాలు హైలెట్‌గా నిలిచాయి., ఓ పక్క నగర వాసులు పల్లెటూర్లకు బయల్దేరి వెళ్లారు. దీంతో నగరంలో ఉన్న ప్రలకు శిల్పారామం సంక్రాంతి సంబరాలను చేరువ చేసింది. నగరంలో ఉండే తెలుగు ప్రజల సంస...
యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య
Cultural, District News, Mulugu

యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

వరంగల్ వాయిస్, ములుగు: జిల్లా యువత కళలలో రాణించాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబట్టి ,వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో రాణించాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇవి మొట్టమొదటిసారి యువజన ఉత్సవాలు అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి పి. వెంకటరమణ చారి, న్యాయ నిర్ణయితలుగా నరసింహ, తాడిచెర్ల రవి, సంధ్యా రాణి,...
వరలక్ష్మీ నమోస్తుతే..
Cultural, District News, Hanamkonda, Warangal

వరలక్ష్మీ నమోస్తుతే..

భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి, రాజమణి దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్హర్.. మండలంలో వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సం...
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
Cultural, District News, Hanamkonda

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

ఆలయాల్లో భక్తుల రద్దీపుట్టలో పాలు పోసి మొక్కులుచల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు బారులు తీరారు. తమ కుటుంబాన్ని చల్లంగా చూడాలని నాగమయ్యను వేడుకున్నారు. దయానంద కాలనీలో..వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయం ఆవరణలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుల పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ మాత ఆలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ....
నేటినుంచి శ్రావణమాసం ఆరంభం
Cultural, District News

నేటినుంచి శ్రావణమాసం ఆరంభం

వ్రతాలు, నోములకు పెద్దపీటవరంగల్ వాయిస్, జూలై28 : తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం వర్షఋతువులో వస్తుంది.. కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి. ఈ నెల హిందువుల లోగిళ్ళు ఆలయాలను తలపిస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం.. ఈ నెలలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలను ఆచరిస్తారు. ఈ నెలలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దల చెబుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు.. కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం.. ఈ నక్షత్రం పేరుతొ ఏర్పడిన శ్రావణమాసం అని.. ఈ మాసంలో చేసే పూజలు అత్యంత ఫలప్రదమని పురాణాల కథనం. లక్ష్మీ ప్రదమైన మాసం.. శ్రావణ మాసం ఈ ఏడాది జూలై 29 వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు. తొలిరోజే శుక్రవారంతో ప్రారంభం కావడం విశేషం...