Warangalvoice

Cultural

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి
Cultural, District News

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ వాయిస్, కాటారం : రాములోరి పెండ్లి వేడుకలు ఊరూరా ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. అలాగే కాటారం మండల కేంద్రమైన గారి పెళ్లి కాటారం చింతకాని తదితర గ్రామాల్లో ఆయా దేవతామూర్తుల ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి వేడుకలను తిలకించారు. వేద మూర్తి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో సీతారాముల కల్యాణాన్ని పూర్తి గావించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో పుస్తే, మట్టే తలంబ్రాలను మద్ది నవీన్, పులి అశోక్ దంపతులు సమర్పించగా చీరల రమేష్ దంపతులు అన్నదానం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని దత...
మెట్టుగుట్టపై శ్రీ సీతారామల కల్యానోత్సవం
Cultural, District News

మెట్టుగుట్టపై శ్రీ సీతారామల కల్యానోత్సవం

వరంగల్ వాయిస్, మడికొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ది గాంచిన శ్రీ మెట్టుగుట్టపై నున్న శ్రీ సీతా రామచంద్ర స్వామి, శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రామనవమి బ్రమ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10:30గంటల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుహాసిని హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని కల్యాణాన్ని తిలకించారు. 18వ తేదీ గురువారం ఉదయం హోమం, బలిహరణ వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు నిత్యా హోమం, బలిహరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరాశరం విష్ణువర్ధనాచార్యులు, రాగిచేడు అభిలాష్ శర్మ, పారుపల్లి సత్యనారాయణ...
ఊరూ..వాడా.. సీతారాముల కల్యాణ శోభ
Cultural, District News

ఊరూ..వాడా.. సీతారాముల కల్యాణ శోభ

కన్నుల పండువగా వేడుకలు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు వరంగల్ వాయిస్, వరంగల్ : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం ఎస్ ఆర్ ఆర్ తోటలోని శ్రీ వీరాంజనేయ దేవాలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కల్యాణోత్సవంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వివాహనంతరం భక్తులకు ఆశీర్వచనం నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. భక్తులకు బెల్లం పానకం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా 32వ డివిజన్ పరిధిలో ఆటో స్టాండ్ ఏరియాలోని శ్రీ వీరాంజనేయ దేవాలయం, వినాయక కాలనీలో జరిగిన కల్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ రవి వాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహి...
వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
Cultural, District News, Hanamkonda

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వేదిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవాలయం     వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని పెడపల్లి డబ్బాల క్రాస్ వద్దగల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో రెండో సామూహిక పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గురు స్వామి జానకి రామయ్య ఆధ్వర్యంలో పడిపూజను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలివచ్చి భజనలు చేసి స్వామి వారి పడిపూజలో సందడి చేశారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పడిపూజ అనంతరం స్వాములకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పడిపూజలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులు, అయప్ప స్వాములకు, సేవ చేసిన వారికి కమిటీ గౌరవ అధ్యక్షుడు దండబోయిన శ్రీకాంత్, అధ్యక్షుడు చాగంటి రాజు, ఉపాధ్యక్షులు గుంటి ...
కారుపై లింగాకారంలో గణపయ్య
Cultural, Warangal

కారుపై లింగాకారంలో గణపయ్య

నగరంలోని 20 డివిజన్ కాశిబుగ్గకు చెందిన వంగరి లక్ష్మీపతి బ్రదర్స్ ప్రతి ఏడు వినాయక నిమజ్జనంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం కారుపై శివలింగాకారంలో గణపతులను అందంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణపయ్యను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వంగరి కుటుంబ సభ్యులు వంగరి రాజశేఖర్, రవి, గుండు చంద్రమోహన్, దేవలపల్లి నరేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -వరంగల్ వాయిస్, కాశిబుగ్గ  ...
ప్రజల మనిషి కాళోజీ
Cultural, District News, Telangana

ప్రజల మనిషి కాళోజీ

సెప్టెంబర్ 9న ఆయన జయంతి నేడు తెలంగాణ భాషాదినోత్సవం (ఆయన జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించింది.) అది 1931 తెల్లదొరల పాలన నుంచి భరతమాత విముక్తి కోసం పోరాటం చేస్తున్న ఎందరో వీరులు, ఆ వీరులలో భరతమాత ముద్దుబిడ్డ  భగత్ సింగ్ పారాటం మరువలేనిది.  భగత్ సింగ్ పోరాటం రుచించని బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను ఉరితీసింది. అప్పడు విద్యర్ధి దశలో ఉన్న కాళోజి ఈ అన్యాయాన్ని తట్టుకోలేపోయాలు. అప్పడే ఆయనలో దేశభక్తి చిగురించింది.  భగత్ సింగ్‌ను ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవిత్వమది. అప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా అతని కలం స్పందించింది. కాళోజీ తన పాఠశాల విద్యార్థి ధ నుంచి కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. ఆయన కవిత్వం 1931లోనే ప్రచురించబడింది. కత్తికంటే కలం గొప్పదని భావించాడు. కవితనే ఆయుధంగా సంధించాడు. విద్యార్థి దశలో నాటి దేశ కాల పరిస్థితుల...
నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి
Cultural, Telangana, Today_banner

నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి

‘ఓ నిజాము పిశాచమా! కానరాడు..నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..తీగలను తెంపి అగ్నిలోకి దింపినావు.. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. ఈ పద్యం వినని, తెలియని తెలంగాణావారుండరు. ఒక్కోసారి అన్పిస్తుంది ఇలాంటి పద్యాలే కవులు రాయకపోతే తెలంగాణ ప్రాంతీయ స్పృహ అందరిలో పుట్టేదా? అని. అటువంటి పద్యాలు, వచనాలు ఎన్నో ఈనేలన పురుడు పోసుకున్నాయి. మానులై ఎన్నో విజయాలూ అందించుటలో సహకరించాయి. అలాంటి ఉద్యమ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యంలో తెలంగాణా అనగానే సాధారణంగా గుర్తొచ్చే కవి దాశరథి కృష్ణమాచార్యులు.నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారి వ్యవస్థను, అన్యాయం, అధర్మం ఉన్న ప్రతి చోటా కవితాశక్తి ధిరోదాత్తుడై కనిపించినవాడు దాశరథి. ఆయనలోని కవితాధార ఎందరో పీడిరచేవారిని గజగజ వణికించింది. అది అగ్నిధారై ప్రవహించింది. రుద్రవీణై వినిపించింది. అమృతాభిషేకం కురిపించి కవితా పుష్పకంలో వికసించింది. అట్లాంటి తెలంగాణా ...
ఉపవాస పర్వం, భక్తి శ్రద్ధల పారవశ్యం – తొలి ఏకాదశి
Cultural, District News, Telangana

ఉపవాస పర్వం, భక్తి శ్రద్ధల పారవశ్యం – తొలి ఏకాదశి

తొలి ఏకాదశి జూన్ 29న శ్రీ మహా విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం చాతుర్మాస వ్రతం పుణ్యఫలం ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం...
విప్లవ యోధుడు వీర సావర్కర్
Cultural, Today_banner

విప్లవ యోధుడు వీర సావర్కర్

భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తుడు , విప్లవ యోధుడు వీర సావర్కర్ జయంతి మే 28న స్వాతంత్ర సమరసినాని సావర్కర్ భారత స్వాతంత్ర్య సమరంలో ఒక ప్రభంజనం. సావర్కర్ విద్యార్థి దశ నుండి అర్థవంతమైన జీవితాన్ని ఆరంభించారు. విప్లవకారులు శాపేకర్ సోదరుల్ని బ్రిటిష్ వారు ఉరి తీశారన్న వార్త విన్న చిరుప్రాయంలోని సావర్కర్ చలించిపోయారు. వినాయక్ దామోదర్ సావర్కర్ కు స్వాతంత్ర సంగ్రామంలో 50 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అండమాన్ దీవుల్లో ని కారాగారంలో ఆయన దుర్భర జీవితం గడుపుతున్నప్పటికీ తోటి ఖైదీలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించటానికి వారిని సంఘటిత పరిచి సమ్మెలు నిర్వహింప చేశారు. జైల్లో ఆయన అనారోగ్యంగా ఉన్నా అధికారులు చిత్రహింసలు పెట్టడం మానలేదు. రాసుకోవడానికి కాగితాలు ఇవ్వకపోయినా సావర్కర్ తనకు దొరికిన కాలి బూటు మేకులతో గోడలపై కవిత్వాలు రాశారు. ఆ రచనలో ఆయన రాబోయే దేశ పరిణామాల మీద స్ప...
రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం
Cultural, Today_banner

రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం

దేవర్షి నారద జయంతి  పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని  ‘వార్తయందు జగము వర్ధిలులచున్నది యదియు లేని నాడ యఖిలజనులు సంధకార మగ్నులగుదురు గాన వార్త నిర్వహింపవలయుజతికి’ అంటాడు నారదుడు. వార్త అంటే సమాచారమనీ నాటి అభిప్రాయం. వార్త అంటే సమాచారం, సమాచరమే విజ్ఞానం. సమాచరమే అధికారం. సమాచారం అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇటు సమాచార రంగానికి, అటు పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని ఆయన సమాచారాన్ని లోక కల్యాణానికి ఉపయోగించారు. రాజసూయానికి ముందు ధర్మరాజు వద్దకు వస్తాడు నారదుడు. ధర్మరాజు రాజనీతిని బోధిస్తూ ఒక పద్యాన్ని ఉదహరిస్తాడు. ఇది ఆంధ్ర మహాభారతం సభా పర్వంలో ఉంది. పై పద్యం ఈనాటి అభిప్రాయ వార్త నిర్వహింప వలయు జతికి అంటే ఇక్కడ అర్థం రాజుకు వార్త చేరవేయాలని. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతరీత్య ‘అధిపతి’ అంటే ప్రజలు కనుక ప్రజలకు వార్త అందించాలని ఆ పద్యాన్ని ఈనాటికి అన్వయించుకోవచ్చు. మరొక వైపు ప్రజాస్...