Warangalvoice

Cultural

ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు
Cultural, District News

ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు

హాజరైన ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య ,ఎమ్మెల్యే నాయిని... వరంగల్ వాయిస్ , హనుమకొండ : హనుమకొండ గోకుల్ నగర్ లో బంక సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.. మొదటి సారిగా వరంగల్ లో నిర్వహించడం ప్రత్యేకంగా ఉంది. : నాయిని రాజేందర్ రెడ్డి సదర్ పండుగ అంటే హైదరాబాద్ గా పేరుగాంచిన వేడుక కానీ ఇప్పుడు వరంగల్ లో మొదటి సారిగా నిర్వహించడం ప్రత్యేకంగా ఉందని అభినందించారు.అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సోదరా సోదరిమనులు పార్టీలకు అతీతంగా గెలిపించారాని సదర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా యాదవులకు సమూచితస్థానం కల్పించడం జరిగిందని అతి చిన్న వయసులో అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపిన ఘనత కాంగ్రెస్ ...
కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు
Cultural, District News

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అత్యంత ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల వేడుకల్లో పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.మహిళలు బతకమ్మ పాటలకు చేసిన నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో మహిళల్ని శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప పండుగ ప్రపంచంలో ఒక్క ...
బల్దియాలో బతుకమ్మ వేడుకలు
Cultural, District News

బల్దియాలో బతుకమ్మ వేడుకలు

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, గుండు చందన పూర్ణచందర్, ఈదురు అరుణ విక్టర్, జన్ను షిబారాణి, బస్వరాజు శిరీష, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, విజయశ్రీ రాజాఅలీ, పోశాల పద్మ, తూర్పాటి సులోచన, ఆడెపు స్వప్న, బైరాబోయిన ఉమా దామోదర్, బల్దియా సెక్రెటరీ విజయలక్ష్మి, ఉప కమిషనర్ మహిళ ఉద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలు, చామంతులతో అందంగా పేర్చి మహిళలందరితో ఒక చోట చేరి చప్పట్లతో నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ...
రవ్వ ప్రసాదం పంపిణీ
Cultural, Warangal

రవ్వ ప్రసాదం పంపిణీ

వరంగల్ వాయిస్, కాశీబుగ్గ : కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా 2వ రోజు సాయంత్రం పూజ కార్యక్రమం అనంతరం 60 కిలోల రవ్వ కేసరి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ వర్ధక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, గుండేటి నరేంద్ర కుమార్, గుళ్ళపల్లి రాజకుమార్, గోరంటల మనోహర్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, మండల శ్రీరాములు, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, బండారి రాజేశ్వరరావు, వంగరి రవి, ములుక సురేష్, దాసి శివకృష్ణ, కూరపాటి సతీష్, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు....
ఖైరతాబాద్ గణేశుడికి వస్త్రం, జంజం సమర్పించిన పద్మశాలీలు
Cultural, Telangana

ఖైరతాబాద్ గణేశుడికి వస్త్రం, జంజం సమర్పించిన పద్మశాలీలు

వరంగల్ వాయిస్ ఖైరతాబాద్: హైదరాబాద్ లోని అతిపెద్ద గణపతి విగ్రమైన ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలి కులస్తులు శనివారం వినాయక చవితి సందర్భంగా వస్త్రం, జంజం, గరిక మాల సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వినాయకుడికి పద్మశాలి కులస్తులు వస్త్రం, జంజం, గరికమాల సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలి కులస్తులు వాటిని అందించడం జరిగింది. తెలంగాణలోనే అతిపెద్ద వినాయకుడిగా పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడికి పద్మశాలీలు వస్త్రం, జంజం, గరిక మాల సమర్పించే అవకాశం ఈసారి తమకు రావడం సంతోషంగా ఉందని తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ పార్థసారథి, ఐపీఎస్ అధికారి రావిరాల వెంకటేశం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా వీవవర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు, బసపత్తిని రాజేశం,  రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవు...
శ్రీరాముడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి..
Cultural, District News

శ్రీరాముడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి..

వరంగల్ వాయిస్, స్టేషన్ ఘనపూర్ : మండలం తాటికొండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిల్పూరు మండలం నష్కల్ లో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలోని శ్రీ సీత రామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులు, చిన్నారులతో మమేకమై వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య వారిని ఆప్యాయంగా పలకరించారు. కనకదుర్గ మాత దేవాలయంలో.. వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : సీతారాముల కళ్యాణం సందర్భంగా నర్సంప...
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
Cultural, District News

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

వరంగల్ వాయిస్, రేగొండ : ఉమ్మడి రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని రావుల పల్లి, రూపిరెడ్డి పల్లి, తిరుమలగిరి, గోరి కొత్తపల్లి గ్రామాల్లో రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. రామాలయ నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయుకుడైన శ్రీరాముడు, సీతమ్మల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది..మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయ ధ్వనాల మధ్య బుధవారం నవమి తిథి, పునర్వసు నక్షత్రం , మిధున లగ్నంలో జానకీ మాత శిరస్సున శ్రీరామచంద్రమూర్తి జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు అమ్మవారి మెడలో స్వామివారు మాంగల్య ధారణ చేశారు. రామయ్య పెళ్లిని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చారు.భక్తులు సీతారాముల పాదాలపై తలంబ్రాలు వేసి ఆశీర్వాదాలు పొందారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం...
హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. సీతారామ కల్యాణ మహోత్సవం
Cultural, District News

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. సీతారామ కల్యాణ మహోత్సవం

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయంలో బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ మారుతీ పరపతి సంఘం ఆధ్వర్యంలో సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గంధతి సుధాకర్-కల్పన, అడపా కిరణ్-స్వాతి, గందే సాయిరాం-మాధురిలు కల్యాణంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ గందె కృష్ణ-భాగ్యలక్ష్మి, కనుకుంట్ల రవికుమార్-ఉమాదేవి, కరు దశరథ్ కుమార్-లలిత, మాదాసు మొగులయ్య-సరళ, అంబటి నరేందర్-అరుణ, గంట సత్యం-సీత, మారుతి పరపతి సంఘ కమిటీ మేఘా సింగ్, కాటి ఎల్లయ్య, దేవులపల్లి సంపత్, నట్వర్లాల్ పటేల్, హర్షం కృష్ణమూర్తి, ఆరుట్ల రామాచార్యులు, ఆలయ అర్చకులు, హనుమాన్ మూలాధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించినారు. భక్తులు తలంబ్రాలు వేసి తదనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. 29వ డివిజన్ లో.. వరంగల్ వాయిస్, ...
పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..
Cultural, District News

పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..

పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో.. వరంగల్ వాయిస్, పరకాల : శ్రీరామ నవమి సందర్భంగా పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వరాలయంలో.. శ్రీరామనవమి సందర్భంగా గీసుగొండలోని బసవేశ్వరాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ...
కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి
Cultural, District News

కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి

కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ జిల్లా ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు రాములవారి కళ్యాణానికి చూడటానికి పోటెత్తారని, అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తరువాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయనన్నారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక అన్నారు. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం..అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుక...