Warangalvoice

Crime

ఆవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
Crime

ఆవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతువరంగల్‌ వాయిస్‌, కలెక్టరేట్‌ : బక్రీద్‌ పండుగ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు హెచ్చరించారు. జంతు హింస నిరోధక సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం హనుమకొండ కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టర్‌, చైర్మన్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షతన ఈ నెల 10న జరగనున్న బక్రీద్‌ పండుగ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా నిరోధించడానికి గో వధ నిరోధక చట్టం కింద పశు సంవర్ధక శాఖ, పోలీస్‌, అటవీ శాఖ, రవాణా, మార్కెటింగ్‌ శాఖల ఎన్‌.జి.ఓ.ల సంయుక్త కార్యాచరణ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనలను పాటించకుండా మూగ జీవాలను క్రూరత్వంగా రవాణాచేసే వాహనాలను సీజ్‌ చేయాలని, యజమానులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ...
 గుడిసెవాసులపై గుండాల దౌర్జన్యం
Crime

 గుడిసెవాసులపై గుండాల దౌర్జన్యం

స్థానికులు, గుడిసె వాసుల మధ్య వాదోపవాదాలుకర్రలు, రాళ్లతో గుడిసె వాసులపై దాడి30మందికిపైగా గాయాలు-ఎంజీఎం తరలింపుసీపీఐ ఆధ్వర్యంలో సీపీని కలిసిన నేతలురక్షణ కల్పించాలంటూ వినతి హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారం మంగళవారం రణరంగంగా మారింది. రెండు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న నిరుపేదలపై మంగళవారం కొందరు గుండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో బాదారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు. దీంతా ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. నిరుపేద గుడిసె వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయినా ఏ మాత్రం కనికరంలేని రియల్‌ గుండాలు గుడిసెవాసులను వెంబడిరచి దాడులు చేశారు. దీంతో సుమారు 30మందికి పైగా గాయాలయ్యాయి. పలువురికి చేతులు విరిగాయి. వీరిని హుటాహుటిన ఎంజీఎం తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -వరంగ...
కిలాడీ దంపతుల అరెస్ట్‌
Crime

కిలాడీ దంపతుల అరెస్ట్‌

రూ.11.80లక్షల నగదు, 125 గ్రాముల బంగారం, కారు స్వాధీనంవెల్లడిరచిన పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్‌ జోషి వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ క్రైం : అవసరాల కోసమని కాలనీ వాసులను మోసం చేసి వారి నుంచి డబ్బు, బంగారం తీసుకొని ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్‌ ఫోర్స్‌, కేయూసి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరినుంచి రూ.11.80లక్షల నగదు, 125 గ్రాముల బంగారు అభరణాలతోపాటు ఒక ఖరీదైన కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్‌ జోషి వివరాలను వెల్లడిరచారు. కొమళ్ళ కిషోర్‌, కొమళ్ళ దివ్య దంపతులు హనుమకొండలోని పరిమళకాలనీలో నివాసం ఉంటూ చిరు వ్యాపారం నిర్వహిస్తుండేవారు. ఈ వ్యాపారంలో వారికి లాభాలు రాకపోవడంతో సులభంగా పెద్ద మొత్తం డబ్బు సంపాదించాలనుకున్నారు. తమ ప్రణాళికలో భాగంగా ముందుగా కాలనీవాసులనుంచి వ్యక్తిగత అవసరాల నిమిత్తం చిన్న మొత్తాల్లో అప్పులు, బంగారాన్ని తీసుక...