Warangalvoice

Crime

కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..
Crime, District News, Warangal

కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనంవివరాలు వెల్లడించిన తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన షిండే జితేందర్, షిండే అశోక్ తో పాటు హనుమకొండ జిల్లా పద్మాక్షీ ప్రాంతానికి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు అన్నాదమ్ములు కావడంతో వీరు తరుచుగా కలుసుకునేవారు. ఇదే సమయంలో నిందితులు ముగ్గురు కలిసి మద్యం తాగడంతో పాటు జల్సాలు చేసేవారు. దీంతో వీరు చేసే చిన్న చిన్న పనుల కారణంగా వీరికి వచ్చే అదాయం వీరి జల్సాల...
నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి
Crime, District News, Warangal

నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, మిస్సింగ్, ఎన్.డి.పి.ఎస్, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఈ. పెట్టి కేసులకు సంబంధించి గత ఏడాదికి , ఈ సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కేసుల వ్యత్యాసాలపై సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి విశ్లేషించారు. అనంతరం ప్రస్తుతం నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ,...
తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..
Crime, District News, Warangal

తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..

ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం నుంచి తహసీల్దార్ , కలెక్టర్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి తన అనారోగ్యం క్షీణించి చివరగా శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ తనకు స్వార్జితమైన భూమి తనకు దక్కాలని, ఇద్దరు కూతుర్లకు అందాలని నిత్యం మధన పడుతూ అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరం అని , ధరణి తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పొగాకు మహేందర్ మృతి చెందాడని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పొగాకు మహేందర్ కు ఉండబడిన భూమిని తక్షణమే పట్టాకు ఎక్కించి, రైతు...
అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..
Crime, District News

అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..

బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తారు..వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషివిష్ణుప్రియ గార్డెన్స్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు వరంగల్ వాయిస్, క్రైం: వివిధ సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే అపరిచత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారన్ని పంచుకోవద్దని యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ , మత్తు పదార్థాలపై కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక హంటర్ రోడ్ లోని విష్ణు ప్రియ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం రోజు, రోజుకి అధికం కావడంతో పాటు, అదే స్థాయిలో ఇంటర్ నెట్ ను వినియోగించుకోని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ, ప్రజల డబ్బును దోచేస్తున్నారన్నారు. ఇందుకు ముఖ్య కారణం నెట్ వి...
ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
Crime, District News, Mulugu

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలుయువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దువరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ రాజయ్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను గురువారం పరకాల ఇన్ స్పెక్టర్ పి.కిషన్ నిందితులకు ఖమ్మం జిల్లా కారాగారంలో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితులు రెండు నెలల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా నుంచి భద్రాచలం మీదుగా పరకాలకు గ...
బైక్ కవర్లో పైసలు మాయం
Crime, District News, Mahabubabad

బైక్ కవర్లో పైసలు మాయం

షాపులోకి వెళ్లొచ్చేసరికి అపహరించిన దుండగులురూ.4లక్షలు చోరీ చేశారంటున్న బాధితుడుస్టేషన్ లో ఫిర్యాదు.. పోలీసుల విచారణమహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్: ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకొని నగదును తన ద్విచక్ర వాహనంలోని ట్యాoకు కవర్ లో పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యలో ఓ షోరూమ్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చే సరికే దుండగులు 4 లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి..జిల్లాలోని మల్యాల గ్రామశివారు రామోజీ తండాకు చెందిన బానోతు శ్రీను అనే రైతు జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ఎస్బీఐలోని తన ఖాతా నుంచి రూ.4లక్షలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనంలోని ట్యాంక్ కవర్ లో పెట్టుకొని బయలు దేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ షోరూమ్ ఎదుట వాహనాన్ని పార్కింగ్ చేసి షోరూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చి ...
బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ దాడులు
Crime, District News

బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ దాడులు

వరంగల్ వాయిస్, క్రైం: ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ లపై టాస్క్ ఫోర్స్ టీం బుధవారం దాడులు చేసింది. నిబంధనలు పాటించకుండా ఉదయాన్నే బార్లు తెరుస్తున్నారని మట్వాడ, హన్మకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ, సుబేదారి, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఆరుగురు బార్ నిర్వాహకులు, ఒక కార్మికుడిని అరెస్ట్ చేసి మద్యాన్ని సీజ్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లలో తిరుమల బార్, సప్తగిరి బార్, తులసి బార్, ఇంద్రకీలాద్రి బార్, బాలాజీ బార్ లు ఉన్నాయి....
అనుమానంతో .. అంతమొందించాడు
Crime, District News, Mahabubabad

అనుమానంతో .. అంతమొందించాడు

భార్యను హత్య చేసిన భర్తనిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన బంధువులుమరిపెడ మండలం అనకట్ట తండాలో విషాదం వరంగల్‌, వాయిస్‌, డోర్నకల్‌: ‘‘అమ్మ… లే అమ్మ… నాన్న వెళ్లిపోయా డు… లేవమ్మా’’ అంటూ చనిపోయిన వాళ్ల అమ్మను లేపే ప్రయత్నం చేస్తున్న చిన్నారులను వారించ టం.. సముదాయిం చటం ఎవ్వరి వల్ల కాలేదు. తండ్రి అవేశం వల్ల తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని చిన్నారుల పరిస్థితి చూసి తండావాసులు కన్నీరుపె ట్టారు. మానుకోట జిల్లాలో ఉదయం ఓ మహిళ హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని ఆనకట్ట తండాకు చెందిన బానోత్‌ రవీందర్‌కు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని నారియ తండాకు చెందిన బానోత్‌ మమత(29) కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె జన్మించారు. ఆ తర్వాత భార్యపై అనుమాన...
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌
Crime, District News, Mulugu

ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

వరంగల్‌ వాయిస్‌, ములుగు: ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం వారి అరెస్ట్‌ ను చూపిన వెంకటాపురం సీఐ కె. శివప్రసాద్‌ మంగళవారం వివరాలు వెల్లడిరచారు. 25న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివారులోని బిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొండాపురం వైపు నుంచి అలుబాక వైపునకు అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ బ్రిడ్జి సమీపానికి వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడిరచి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నిషేదిత సి.పి.ఐ మావోయిస్ట్‌ పార్టీకి చెందిన వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌) , జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌) పేరుతో నినాదాలతో కూడిన కొన్ని కరపత్రాలు కనిపించాయమన్నారు. పట్టుబడిన వ్యక్తులు తాటి సోమయ్య, తాటి సత్యం, యాలం సురేష్‌ ల గుర్తించారు. వీరిది...
వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ<br>ఇద్దరు దొంగల అరెస్ట్
Crime, Viral News

వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ
ఇద్దరు దొంగల అరెస్ట్

నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిమీద ఉన్న బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు లక్ష పదివేల రూపాయల విలువ గల బంగారు ఆభరణంతో పాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ నగరంలోని బి.ఆర్ నగర్ కు చెందిన అజారుద్దీన్, ఓరుగంటి రాజు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు బాల్య స్నేహితులు. ఇద్దరూ చదువు మధ్యలో అపివేసి ఎలక్ట్రిషన్ గా పనిచేసేవారు. దీని ద్వారా వీరికి వచ్చే అదాయంతో పాటు అప్పులు చేసి మద్యం తాగుతూ, జల్సాలు చేసేవారు. దీంతో వీరికి అప్పులు అధికం కావడంతో పాటు వీరి జల్సాలకు డబ్బు లభించకపోవడంతో సులువు డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగం వీరి ప్రాంతంలోనే ఒంటరి నివసిస్తున్న వృద్ధురాల...