Warangalvoice

Crime

256కిలోల గంజాయి స్వాధీనం
Crime, District News

256కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు నిందితుల అరెస్ట్ వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం వెల్లడించారు.. కామారెడ్డి జిల్లాకి చెందిన పల్లపు రాజు , పల్లపు రాజు, బోడ సుమన్ అనే ముగ్గురు 4 సంవత్సరాలుగా భద్రాచలం, డొంకరాయి, సీలేరు, ధారకొండ ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలలో వారి ట్రాక్టర్ తో భూమిని చదును చేసేందుకు పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలో సత్తి బాబుకి చెందిన భూమి అల్లురికోట ఒడిషా రాష్ట్రంలో రూ.70,000 లకు కుదుర్చుకొని అతడి భూమిని చదును చేశారు. ...
‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్
Crime, District News, Mulugu

‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్

వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి, ఏ4 తడక రమేష్ లను ప్రవేశపెట్టారు. హత్య నేరం అభియోగంపై రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించి ఖమ్మం జైలుకు తరలించారు....
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
Crime, District News, Today_banner, Warangal

పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిపై సీరియ‌స్‌ఆరుగురు య‌జ‌మానుల‌పై కేసులుచేయి చేసుకోవ‌డంతో ముదిరిన వివాదంఒక రోజు బంద్ పాటించి నిర‌స‌న‌ ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసుల‌కు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారంటూ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంపై బార్ అండ్‌ రెస్టారెంట్ య‌జ‌మానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తే బార్లు న‌ష్టాల్లో కూరుకుపోయి మూసుకోవాల్సిన‌ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని య‌జ‌మానులు అంటుండగా ఎవ‌రైనా ఎక్సైజ్‌ నిబంధ‌న‌లు పాటించాల్సిందే నంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మార‌డంతో బార్ య‌జ‌మానులు మంగ‌ళ‌వారం ఒక్క రోజు బంద్ కూడా పాటించారు. పోలీసులు మ...
చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు
Crime, District News, Hanamkonda

చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు

భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి ఆర్థిక సంబంధం లేదన్నారు. వైశ్య సామాజిక వర్గం సమావేశంలో చికోటి ప్రవీణ్ పాల్గొన్నాడని, చిన జీయర్ స్వామితో చికోటి ప్రవీణ్ కు భక్తిపరమైన పరిచయం ఉందని అలా పేద వైశ్య కుటుంబాలకు చేయూతనందించడానికి ఆయనను సంప్రదించడం జరిగిందన్నారు. తమ సామాజిక వర్గం వాళ్ళని ఆధ్యాత్మిక సేవలో భాగంగా యాగంలో పాల్గొన్నప్పుడే ఆయన గురించి తెలిసిందన్నారు. తమ వాసవి బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ సేవ సంస్థకు...
నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
Crime, District News, Warangal

నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్

ఏ విద్యార్హత లేకున్నా వైద్యంనకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులువివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్, మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ వున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో అపివేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. నిందితుడు అహ్మద్ సహాయకుడి...
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్
Crime, District News

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్

వరంగల్ వాయిస్, క్రైం: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా పట్టాబిపురానికి చెందిన ఎస్.కె.గౌస్, పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ నిందితుడు గౌస్ కు వరంగల్ రైల్వే స్టేషన్లో వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కారాగారానికి తరలించారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులను నమ్మించడం ప్రారంభించి.. సంబంధిత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు రూ.8లక్షల నుంచి 20 లక్షల్లో డబ్బు వసూలు చేసిన సంఘటనలో నిందితుడిని మీల్స్ కాలనీ, టాస...
అనుమానం.. రెండు ప్రాణాలు బలి
Crime, District News, Warangal

అనుమానం.. రెండు ప్రాణాలు బలి

భార్యను నరికి చంపిన భర్త ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితమే భార్యతో గొడవపడిన హరీష్‌ క్రిమిసంహారక మందు తాగాడు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. అయితే మరోసారి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వివాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్‌ మంగళవారం తెల్లవారుజామున భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి త...
హాస్టల్ లో ఫైటింగ్
Crime, District News, Top Stories

హాస్టల్ లో ఫైటింగ్

ముగ్గురు విద్యార్థినులకు గాయాలుకారణాలు బయటకు పొక్కనివ్వని సిబ్బందితల్లిదండ్రుల ఆందోళ‌న‌తో ఆల‌స్యంగా వెలుగులోకి వరంగల్ వాయిస్‌, వ‌రంగ‌ల్ టౌన్: న‌గ‌రంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ గర్ల్స్ స్కూల్‌ శంభునిపేటలో 9వ తరగతి చదువుతున్న‌ ముగ్గురు విద్యార్థునులకు గొంతుపై కోసిన‌ట్లు గాయాలు కావ‌డం న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఈనెల 24న సంఘ‌ట‌న జ‌రిగినా గురుకుల సిబ్బంది దీనిని గోప్యంగా ఉంచ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. గురుకుల సిబ్బందే ట్రీట్‌మెంట్ ఇప్పించ‌డంపై తల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. సోమ‌వారం బాధిత విద్యార్థునుల త‌ల్లిదండ్రులు గురుకులం ఎదుట ఆందోళన‌కు దిగ‌డంతో విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌ను కూడా గురుకుల సిబ్బంది గేటు వ‌ద్దే అడ్డుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థినుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌...
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
Crime, District News, Hanamkonda, Top Stories

తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో వారిని ప్రోత్సహించే విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ శిబిరం ముందుగా రక్తదానం చేసి యువతకు అదర్శంగా నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ...
లాయ‌ర్ దారుణ హ‌త్య‌
Crime, District News, Mulugu

లాయ‌ర్ దారుణ హ‌త్య‌

వ‌రంగ‌ల్ వాయిస్‌, ములుగు : ములుగు జిల్లాలో సోమ‌వారం రాత్రి ఏడు గంట‌ల ప్రాంతంలో లాయ‌ర్‌ను దారుణంగా హ‌త్య చేశారు. ములుగు జిల్లా కేంద్రానికి 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. హ‌త్య‌కు గురైన వ్య‌క్తి న్యాయవాది మల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎర్ర మట్టి క్వారీ.…భూ త‌గాదాలు.. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....